వామన్రావు దంపతుల హత్యను న్యాయవాద వ్యవస్థ మీద దాడిగా ఎమ్మెల్సీ రాంచందర్రావు వ్యాఖ్యానించారు. న్యాయవాద దంపతుల ఆత్మకు శాంతి చేకూరాలని గన్ పార్క్లోని అమరవీరుల స్థూపం వద్ద భాజపా లీగల్ సెల్ ఆధ్వర్యంలో నివాళులర్పించారు. ఈ ఘటనను భాజపా తీవ్రంగా ఖండిస్తోందని... దోషులను కఠినంగా శిక్షించాలని ఎమ్మెల్సీ డిమాండ్ చేశారు.
ఇలాంటి ఘటనలు జరగడం విచారకరమన్నారు. సర్కారుకు వ్యతిరేకంగా కోర్టులో పిల్ దాఖలు చేస్తున్న న్యాయవాదులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. హత్యకు కారణమైన దోషులు ఎంతటివారైనా కఠినంగా శిక్షించాలని రాంచందర్రావు డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: న్యాయవాదుల హత్యను సుమోటోగా స్వీకరించిన హైకోర్టు