ETV Bharat / state

కిరోసిన్​ పోసుకుని భాజపా కార్యకర్తల ఆత్మహత్యాయత్నం

author img

By

Published : Nov 19, 2020, 11:30 AM IST

పార్టీకోసం కష్టపడే వారికి కాకుండా... అక్రమార్కులకు టికెట్లు ఇస్తున్నారంటూ భాజపా కార్యకర్తలు ఆందోళనకు దిగారు. భాజపా కార్యాలయం ముందు కిరోసిన్​ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించారు.

bjp-leaders-suicide-attempt-at-musheerabad
కిరోసిన్​ పోసుకుని భాజపా కార్యకర్తల ఆత్మహత్యాయత్నం

ముషీరాబాద్ నియోజకవర్గంలో భాజపా కార్యకర్తలు ఆత్మహత్యాయత్నం చేశారు. అర్హులకే జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో అర్హులకు టికెట్లు ఇవ్వాలని... భాజపా కార్యాలయం ముందు కిరోసిన్​ పోసుకున్నారు. అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకున్నారు. అనంతరం కార్యకర్తలు కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. పార్టీ పట్ల అంకితభావంతో పనిచేసే వారికే టికెట్​ ఇవ్వాలన్నారు. అక్రమ దందాలు చేసే వారికి ప్రాధన్యత ఇస్తూ... వారికి టికెట్లు ఇవ్వడం ఎంతవరకు సమంజసం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

ముషీరాబాద్ నియోజకవర్గంలో భాజపా కార్యకర్తలు ఆత్మహత్యాయత్నం చేశారు. అర్హులకే జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో అర్హులకు టికెట్లు ఇవ్వాలని... భాజపా కార్యాలయం ముందు కిరోసిన్​ పోసుకున్నారు. అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకున్నారు. అనంతరం కార్యకర్తలు కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. పార్టీ పట్ల అంకితభావంతో పనిచేసే వారికే టికెట్​ ఇవ్వాలన్నారు. అక్రమ దందాలు చేసే వారికి ప్రాధన్యత ఇస్తూ... వారికి టికెట్లు ఇవ్వడం ఎంతవరకు సమంజసం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: బండి సంజయ్ కోసం కార్యకర్త ఆత్మహత్యాయత్నం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.