ETV Bharat / state

ఆయోధ్యలో రామమందిరం నిర్మించాలనే వాజ్‌పేయీ కల సాకారం కాబోతుంది : కిషన్‌రెడ్డి

author img

By ETV Bharat Telangana Team

Published : Dec 25, 2023, 5:55 PM IST

BJP Leaders on Atal Bihari Vajpayee Anniversary : మాజీ ప్రధానమంత్రి, దివంగత నేత అటల్​ బిహారి వాజ్​పేయీ జయంతి సందర్భంగా పలువురు నేతలు ఆయనకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి కిషన్​రెడ్డి పలు కార్యక్రమాల్లో పాల్గొని మాజీ ప్రధాని అటల్​ బిహారి వాజ్​పేయీని స్మరించుకున్నారు. ముషీరాబాద్ చౌరస్తాలో బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్​ వాజ్​పేయీ చిత్రపటానికి నివాళులర్పించారు.

BJP Leaders on Atal Bihari Vajpayee Anniversary
ఆయోధ్యలో రామమందిరం నిర్మించాలనే వాజ్‌పేయ్‌ కల - సాకారం కాబోతుంది: కిషన్‌రెడ్డి

BJP Leaders on Atal Bihari Vajpayee Anniversary : రాజకీయాలకు అతీతంగా దేశ ప్రయోజనాలే పరమామధిగా పనిచేసిన గొప్ప వ్యక్తి అటల్ బిహారి వాజ్​పేయీ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మాజీ ప్రధాని వాజ్​పేయీ జయంతి సందర్భంగా హైదరాబాద్​లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కిషన్​రెడ్డి పాల్గొన్నారు. అనంతరం నగరంలోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో (Basavatarakam Cancer Hospital) మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డితో కలిసి రోగులకు పండ్లు పంపిణీ చేశారు.

Kishan Reddy About Atal Bihari Vajpayee : బస్సులో పాకిస్థాన్​కు వెళ్లి శాంతి కోసం చర్చలు జరిపి, దేశ ప్రయోజనాల కోసం కార్గిల్ యుద్ధం(Kargil war) గెలిచిన ఘనత వాజ్​పేయీదేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, మంత్రి కిషన్​రెడ్డి కొనియాడారు. ఈ సందర్భంగా బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి భవనాన్ని వాజ్​పేయీ ప్రారంభించారని గుర్తు చేశారు. ఆయన జయంతి వేడుకలు ఇక్కడ జరపడం సంతోషకరమన్నారు. అటల్‌ బీహారి వాజ్‌పేయీ నవయుగ సామ్రాట్​గా పేరు తెచ్చుకున్నారని అన్నారు. వాజ్‌పేయీ అయోధ్యలో రామమందిరం నిర్మించాలని ఆకాంక్షించారని, ఆయన కల సాకారం కాబోతుందని తెలిపారు.

వాజ్​పేయీకి ప్రముఖుల ఘన నివాళులు- సేవలను గుర్తు చేసుకున్న మోదీ

Vajpayee Anniversary as Sushasan Divas : వాజ్‌పేయీ జన్మదినాన్ని కేంద్ర ప్రభుత్వం సుశాసన్ దినోత్సవం పేరుతో నిర్వహిస్తుందని మంత్రి కిషన్​రెడ్డి పేర్కొన్నారు. స్వచ్ఛభారత్​తో పాటు అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం, అటల్ బిహారీ వాజ్​పేయీ జీవిత విశేషాలపై సభలు, సమావేశాల ద్వారా నేటి తరానికి తెలియజేస్తున్నామని అన్నారు. వాజ్​పేయీ నైతిక విలువలతో కూడిన రాజకీయాలతో పరిపాలన చేసి ప్రజాస్వామ్య విలువలు కాపాడారని తెలిపారు. నాడు పార్లమెంటులో ఒక్క ఓటు తక్కువ ఉన్నందున, వాజ్​పేయీ నైతిక బాధ్యత(Moral Responsibility) వహిస్తూ, విలువలకు కట్టుబడి ప్రభుత్వాన్ని త్యాగం చేశారని పేర్కొన్నారు.

MP Laxman on Atal Bihari Vajpayee Anniversary : అటల్​ బిహారి వాజ్​పేయీ ఆశయాలను ప్రధాని నరేంద్ర మోదీ అమలు చేస్తూ మూడోసారి బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయమని రాజ్యసభ సభ్యుడు డా.కె లక్ష్మణ్ పేర్కొన్నారు. మాజీ ప్రధాని అటల్​ బిహారి వాజ్​పేయీ జయంతి పురస్కరించుకొని హైదరాబాద్ ముషీరాబాద్ చౌరస్తాలో ఆయన చిత్రపటానికి కె.లక్ష్మణ్ కార్పొరేటర్ సుప్రియ నవీన్ గౌడ్ , బీజేపీ నాయకులు పూసరాజు తదితరులు పూలువేసి నివాళులు అర్పించారు.

MP Laxman speech about vajpayee : పేద ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రధాని నరేంద్ర మోదీ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని బీజేపీ నేత, ఎంపీ లక్ష్మణ్​ అన్నారు. దేశంలోని పేదలకు ప్రధాని నాలుగు కోట్ల మందికి ఇల్లు కట్టించారని ఆయన గుర్తు చేశారు. వాజ్​పేయీ ఆశయాల సాధనకు పార్టీ శ్రేణులు కంకణ బదులు కావాలని ఆయన పిలుపునిచ్చారు.

'వాజ్‌పేయీ గొప్ప పరిపాలన దక్షుడు.. ఆయనకు సేవ చేసే అదృష్టం నాకు దొరికింది'

వాజ్​పేయి విగ్రహం ఏర్పాటు విషయంలో వివాదం

BJP Leaders on Atal Bihari Vajpayee Anniversary : రాజకీయాలకు అతీతంగా దేశ ప్రయోజనాలే పరమామధిగా పనిచేసిన గొప్ప వ్యక్తి అటల్ బిహారి వాజ్​పేయీ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మాజీ ప్రధాని వాజ్​పేయీ జయంతి సందర్భంగా హైదరాబాద్​లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కిషన్​రెడ్డి పాల్గొన్నారు. అనంతరం నగరంలోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో (Basavatarakam Cancer Hospital) మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డితో కలిసి రోగులకు పండ్లు పంపిణీ చేశారు.

Kishan Reddy About Atal Bihari Vajpayee : బస్సులో పాకిస్థాన్​కు వెళ్లి శాంతి కోసం చర్చలు జరిపి, దేశ ప్రయోజనాల కోసం కార్గిల్ యుద్ధం(Kargil war) గెలిచిన ఘనత వాజ్​పేయీదేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, మంత్రి కిషన్​రెడ్డి కొనియాడారు. ఈ సందర్భంగా బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి భవనాన్ని వాజ్​పేయీ ప్రారంభించారని గుర్తు చేశారు. ఆయన జయంతి వేడుకలు ఇక్కడ జరపడం సంతోషకరమన్నారు. అటల్‌ బీహారి వాజ్‌పేయీ నవయుగ సామ్రాట్​గా పేరు తెచ్చుకున్నారని అన్నారు. వాజ్‌పేయీ అయోధ్యలో రామమందిరం నిర్మించాలని ఆకాంక్షించారని, ఆయన కల సాకారం కాబోతుందని తెలిపారు.

వాజ్​పేయీకి ప్రముఖుల ఘన నివాళులు- సేవలను గుర్తు చేసుకున్న మోదీ

Vajpayee Anniversary as Sushasan Divas : వాజ్‌పేయీ జన్మదినాన్ని కేంద్ర ప్రభుత్వం సుశాసన్ దినోత్సవం పేరుతో నిర్వహిస్తుందని మంత్రి కిషన్​రెడ్డి పేర్కొన్నారు. స్వచ్ఛభారత్​తో పాటు అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం, అటల్ బిహారీ వాజ్​పేయీ జీవిత విశేషాలపై సభలు, సమావేశాల ద్వారా నేటి తరానికి తెలియజేస్తున్నామని అన్నారు. వాజ్​పేయీ నైతిక విలువలతో కూడిన రాజకీయాలతో పరిపాలన చేసి ప్రజాస్వామ్య విలువలు కాపాడారని తెలిపారు. నాడు పార్లమెంటులో ఒక్క ఓటు తక్కువ ఉన్నందున, వాజ్​పేయీ నైతిక బాధ్యత(Moral Responsibility) వహిస్తూ, విలువలకు కట్టుబడి ప్రభుత్వాన్ని త్యాగం చేశారని పేర్కొన్నారు.

MP Laxman on Atal Bihari Vajpayee Anniversary : అటల్​ బిహారి వాజ్​పేయీ ఆశయాలను ప్రధాని నరేంద్ర మోదీ అమలు చేస్తూ మూడోసారి బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయమని రాజ్యసభ సభ్యుడు డా.కె లక్ష్మణ్ పేర్కొన్నారు. మాజీ ప్రధాని అటల్​ బిహారి వాజ్​పేయీ జయంతి పురస్కరించుకొని హైదరాబాద్ ముషీరాబాద్ చౌరస్తాలో ఆయన చిత్రపటానికి కె.లక్ష్మణ్ కార్పొరేటర్ సుప్రియ నవీన్ గౌడ్ , బీజేపీ నాయకులు పూసరాజు తదితరులు పూలువేసి నివాళులు అర్పించారు.

MP Laxman speech about vajpayee : పేద ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రధాని నరేంద్ర మోదీ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని బీజేపీ నేత, ఎంపీ లక్ష్మణ్​ అన్నారు. దేశంలోని పేదలకు ప్రధాని నాలుగు కోట్ల మందికి ఇల్లు కట్టించారని ఆయన గుర్తు చేశారు. వాజ్​పేయీ ఆశయాల సాధనకు పార్టీ శ్రేణులు కంకణ బదులు కావాలని ఆయన పిలుపునిచ్చారు.

'వాజ్‌పేయీ గొప్ప పరిపాలన దక్షుడు.. ఆయనకు సేవ చేసే అదృష్టం నాకు దొరికింది'

వాజ్​పేయి విగ్రహం ఏర్పాటు విషయంలో వివాదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.