ETV Bharat / state

'అయోధ్యలో రామాలయం కడుతుంటే.. ఏపీలో కూల్చేస్తున్నారు'

author img

By

Published : Jan 4, 2021, 1:47 PM IST

ఆంధ్రప్రదేశ్​లో దేవాలయాలపై జరుగుతున్న దాడులు హిందువులను కలవరపాటుకు గురి చేస్తున్నాయని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ ​ అన్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం జరుగుతుంటే ​ఏపీలో దేవాలయాలను కూలుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

bjp leader laxman says  andhra pradesh Ramatirtha incident was unfortunate
రామతీర్థం ఘటన దురదృష్టకరం: లక్ష్మణ్​

ఆంధ్రప్రదేశ్​లోని రామతీర్థం ఘటన దురదృష్టకరమని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. తిరుపతిలో పర్యటించిన ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

ఆంధ్రప్రదేశ్​లో దేవాలయాలపై జరుగుతున్న దాడులు హిందువులను కలవరపరుస్తున్నాయని లక్ష్మణ్​ అన్నారు. ఒక పక్కన ప్రజల చిరకాల వాంఛ అయిన అయోధ్య రామమందిర నిర్మాణం జరుగుతుంటే ​ఏపీలో మాత్రం దేవాలయాల కూల్చివేత ఘటనలు జరుగడం దురదృష్టకరమని పేర్కొన్నారు. వెంటనే నిందితులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జగన్​ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శ్రీవారి ఆశీస్సులతో శాస్త్రవేత్తలు కరోనాకు వ్యాక్సిన్ కనుగొన్నారని సంతోషం వ్యక్తం చేశారు. కొవిడ్​ కష్టకాలంలోనూ తితిదే భక్తులకు దర్శన భాగ్యం కల్పించడం సంతోషకరమన్నారు.

ఆంధ్రప్రదేశ్​లోని రామతీర్థం ఘటన దురదృష్టకరమని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. తిరుపతిలో పర్యటించిన ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

ఆంధ్రప్రదేశ్​లో దేవాలయాలపై జరుగుతున్న దాడులు హిందువులను కలవరపరుస్తున్నాయని లక్ష్మణ్​ అన్నారు. ఒక పక్కన ప్రజల చిరకాల వాంఛ అయిన అయోధ్య రామమందిర నిర్మాణం జరుగుతుంటే ​ఏపీలో మాత్రం దేవాలయాల కూల్చివేత ఘటనలు జరుగడం దురదృష్టకరమని పేర్కొన్నారు. వెంటనే నిందితులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జగన్​ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శ్రీవారి ఆశీస్సులతో శాస్త్రవేత్తలు కరోనాకు వ్యాక్సిన్ కనుగొన్నారని సంతోషం వ్యక్తం చేశారు. కొవిడ్​ కష్టకాలంలోనూ తితిదే భక్తులకు దర్శన భాగ్యం కల్పించడం సంతోషకరమన్నారు.

ఇదీ చదవండి : నాగార్జునసాగర్ ప్రధాన జల విద్యుదుత్పత్తి కేంద్రంలో మంటలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.