ETV Bharat / state

'దిల్లీలో కాళ్లు.. హైదరాబాద్​లో కన్నీళ్లు'

author img

By

Published : Dec 13, 2019, 1:35 PM IST

పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా ఎందుకు ఓటు వేశారో తెరాస చెప్పాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ డిమాండ్​ చేశారు. తెరాస నాయకులు దిల్లీలో కాళ్లు, హైదరాబాద్​లో కన్నీళ్లు పెట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్​ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ గాల్లో కలిసిపోయాయని విమర్శించారు.

bjp leader laxman fires on cm kcr
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్

ముఖ్యమంత్రి కేసీఆర్​ తెలంగాణను అప్పుల, అవినీతి రాష్ట్రంగా మార్చారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. ఆర్థిక మంత్రి ప్రమేయం లేకుండానే సమీక్షలు చేయడమేంటని ప్రశ్నించారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలన్నీ ఒక్కొక్కటిగా మూలన పడుతున్నాయని లక్ష్మణ్​ అన్నారు. రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్​ అప్పుల తెలంగాణగా మార్చారని మండిపడ్డారు.

అంగన్​ వాడీలకు నిధులు ఇవ్వలేక.. మూసివేయాలని ప్రభుత్వం చూస్తోందని పేర్కొన్నారు. నిరుద్యోగ భృతి ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేశారని ఆరోపించారు.

రాష్ట్ర ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని విమర్శించారు. అన్నదాతకు ఆలంబనగా ఉంటుందనుకున్న రైతు బంధు బంద్​ అయ్యేలా ఉందని ఎద్దేవా చేశారు.

రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దిశ, సమత, మానస ఘటనలు ఫ్రెండ్లీ పోలీస్​ ఎక్కడుందని ఎద్దేవా చేస్తున్నాయని చెప్పారు. రాష్ట్రంలో మద్యం నిషేధించే వరకు భాజపా పోరాడుతూనే ఉంటుందని స్పష్టం చేశారు.

పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఎందుకు ఓటు వేశారో తెరాస చెప్పాలని లక్ష్మణ్​ డిమాండ్​ చేశారు. తెరాస నాయకులు దిల్లీలో కాళ్లు.. హైదరాబాద్​లో కన్నీళ్లు పెట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

ఇదీ చూడండి : బంజారాహిల్స్​లో వ్యక్తి దారుణ హత్య

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్

ముఖ్యమంత్రి కేసీఆర్​ తెలంగాణను అప్పుల, అవినీతి రాష్ట్రంగా మార్చారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. ఆర్థిక మంత్రి ప్రమేయం లేకుండానే సమీక్షలు చేయడమేంటని ప్రశ్నించారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలన్నీ ఒక్కొక్కటిగా మూలన పడుతున్నాయని లక్ష్మణ్​ అన్నారు. రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్​ అప్పుల తెలంగాణగా మార్చారని మండిపడ్డారు.

అంగన్​ వాడీలకు నిధులు ఇవ్వలేక.. మూసివేయాలని ప్రభుత్వం చూస్తోందని పేర్కొన్నారు. నిరుద్యోగ భృతి ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేశారని ఆరోపించారు.

రాష్ట్ర ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని విమర్శించారు. అన్నదాతకు ఆలంబనగా ఉంటుందనుకున్న రైతు బంధు బంద్​ అయ్యేలా ఉందని ఎద్దేవా చేశారు.

రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దిశ, సమత, మానస ఘటనలు ఫ్రెండ్లీ పోలీస్​ ఎక్కడుందని ఎద్దేవా చేస్తున్నాయని చెప్పారు. రాష్ట్రంలో మద్యం నిషేధించే వరకు భాజపా పోరాడుతూనే ఉంటుందని స్పష్టం చేశారు.

పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఎందుకు ఓటు వేశారో తెరాస చెప్పాలని లక్ష్మణ్​ డిమాండ్​ చేశారు. తెరాస నాయకులు దిల్లీలో కాళ్లు.. హైదరాబాద్​లో కన్నీళ్లు పెట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

ఇదీ చూడండి : బంజారాహిల్స్​లో వ్యక్తి దారుణ హత్య

Pithoragarh/ Ranikhet (Uttarakhand), Manali (Himachal Pradesh), Pir Panjal (JandK), Dec 13 (ANI): Uttarakhand's Pithoragarh and Ranikhet received fresh snowfall on December 13. Normal life got affected following the snowfall in several areas. Snow covered the entire landscape. Heavy snowfall warning has been issued for today by the weather department in several areas in Uttarakhand. Himachal Pradesh's famous tourist spot Manali was wrapped in a huge blanket of snow and received over 45 cms of fresh snow. Meanwhile, in Jammu and Kashmir's Mughal Road has been closed due to heavy spell of snow.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.