ETV Bharat / state

ధనార్జనే లక్ష్యంగా తెరాస దోపిడీ పర్వం సాగుతోంది: డీకే అరుణ

author img

By

Published : Jul 13, 2020, 1:59 PM IST

రాష్ట్రంలో భాజపా ఎదగకుండా తెరాస, కాంగ్రెస్​లు కుట్రలు పన్నుతున్నాయని మాజీ మంత్రి డీకే అరుణ ఆరోపించారు. ధనార్జనే లక్ష్యంగా తెరాస దోపిడీ పర్వం కొనసాగుతోందని విమర్శించారు. నేతలు నీచరాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు.

bjp leader dk aruna fires on govt
ధనార్జనే లక్ష్యంగా తెరాస దోపిడీ పర్వం సాగుతోంది: డీకే అరుణ

ధనార్జనే లక్ష్యంగా తెరాస ప్రభుత్వ దోపిడీపర్వం సాగుతోందని మాజీ మంత్రి, భాజపా నేత డీకే అరుణ విమర్శించారు. రాష్ట్రంలో భాజపా పుంజుకోకుండా తెరాస, కాంగ్రెస్​లు కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు. నిజామాబాద్​ ఎంపీ ధర్మపురి అర్వింద్​పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు.

రాష్ట్రంలో భాజపా ఎదుగుదలను ఓర్వలేకే తెరాస, కాంగ్రెస్​ నేతలు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని అరుణ మండిపడ్డారు. సచివాలయం విషయంలో కాంగ్రెస్‌తో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్రకు తెరలేపారని ఆరోపించారు. కరోనాతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే స్పందించకుండా.. నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. నేతలు ఇలాంటి రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు.

ధనార్జనే లక్ష్యంగా తెరాస దోపిడీ పర్వం సాగుతోంది: డీకే అరుణ

ఇదీచూడండి: వైద్య వ్యవస్థపై నమ్మకం పెంచాల్సిన అవసరం ఉంది: కేటీఆర్​

ధనార్జనే లక్ష్యంగా తెరాస ప్రభుత్వ దోపిడీపర్వం సాగుతోందని మాజీ మంత్రి, భాజపా నేత డీకే అరుణ విమర్శించారు. రాష్ట్రంలో భాజపా పుంజుకోకుండా తెరాస, కాంగ్రెస్​లు కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు. నిజామాబాద్​ ఎంపీ ధర్మపురి అర్వింద్​పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు.

రాష్ట్రంలో భాజపా ఎదుగుదలను ఓర్వలేకే తెరాస, కాంగ్రెస్​ నేతలు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని అరుణ మండిపడ్డారు. సచివాలయం విషయంలో కాంగ్రెస్‌తో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్రకు తెరలేపారని ఆరోపించారు. కరోనాతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే స్పందించకుండా.. నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. నేతలు ఇలాంటి రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు.

ధనార్జనే లక్ష్యంగా తెరాస దోపిడీ పర్వం సాగుతోంది: డీకే అరుణ

ఇదీచూడండి: వైద్య వ్యవస్థపై నమ్మకం పెంచాల్సిన అవసరం ఉంది: కేటీఆర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.