భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ ఎన్నికల సమన్వయ కమిటీతో జీహెచ్ఎంసీ ఎన్నికల పరిశీలకుడు భూపేంద్ర యాదవ్ భేటీ అయ్యారు. ఎన్నికల వ్యూహాలు, అభ్యర్థుల ఎంపికపై చర్చిస్తున్నారు. బుధవారం సాయంత్రానికి మెజార్టీ సీట్లలో అభ్యర్థులను ప్రకటించనున్నారు.
రెండు విడతల్లో అభ్యర్థుల జాబితాను విడుదల చేయనున్నారు. భూపేంద్ర యాదవ్ ఆమోద ముద్రపడగానే తొలి జాబితాను భాజపా ప్రకటించనుంది. ఈ సమావేశంలో కేంద్రమంత్రి కిషన్రెడ్డి, లక్ష్మణ్, బండి సంజయ్, డీకే అరుణ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: 'ఎన్ని తాయిలాలిచ్చినా.. తెరాస పాపాలు తెరమరుగు కావు'