ETV Bharat / state

'లాక్​డౌన్​లో ఉన్న సమస్యలను సీఎం పట్టించుకోవాలి'

author img

By

Published : Apr 20, 2020, 5:46 PM IST

కరోనా నియంత్రణతో పాటు లాక్​డౌన్​లో ఉత్పన్నమయ్యే సమస్యలను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్​ వెంటనే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ కోరారు. అకాల వర్షానికి పంట కోల్పోయిన రైతులను ఆదుకోవాలన్నారు.

bjp bandi sanjay on ts government
'లాక్​డౌన్​లో ఉన్న సమస్యలను సీఎం పట్టించుకోవాలి'

లాక్​డౌన్​లో ఉత్పన్నమయ్యే సమస్యల పరిష్కారం కోసం సీఎం కేసీఆర్​ వెంటనే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ కోరారు. మూడ్రోజులుగా రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలకు పంటలు తీవ్రంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. పిడుగుపాటుకు ఎందరో అన్నదాతలు మృత్యువాత పడ్డారని.. వారి కుటుంబాలకు ఆర్థిక సాయం చేయాలని కోరారు.

మహిళలు డ్వాక్రా రుణాలు చెల్లించాలని, ప్రాపర్టీ టాక్స్​ కట్టాలని ప్రభుత్వం ప్రకటించడం హేయమైన చర్యగా అభివర్ణించిన బండి సంజయ్​... ముఖ్యమంత్రి ఆ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. బోర్డు నిర్ణయం ప్రకారం ఇంటివద్ద ఉండే కార్మికులందరికీ రూ.1500 అందించేలా తక్షణమే నిర్ణయం తీసుకోవాలని కోరారు.

లాక్​డౌన్​లో ఉత్పన్నమయ్యే సమస్యల పరిష్కారం కోసం సీఎం కేసీఆర్​ వెంటనే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ కోరారు. మూడ్రోజులుగా రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలకు పంటలు తీవ్రంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. పిడుగుపాటుకు ఎందరో అన్నదాతలు మృత్యువాత పడ్డారని.. వారి కుటుంబాలకు ఆర్థిక సాయం చేయాలని కోరారు.

మహిళలు డ్వాక్రా రుణాలు చెల్లించాలని, ప్రాపర్టీ టాక్స్​ కట్టాలని ప్రభుత్వం ప్రకటించడం హేయమైన చర్యగా అభివర్ణించిన బండి సంజయ్​... ముఖ్యమంత్రి ఆ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. బోర్డు నిర్ణయం ప్రకారం ఇంటివద్ద ఉండే కార్మికులందరికీ రూ.1500 అందించేలా తక్షణమే నిర్ణయం తీసుకోవాలని కోరారు.

ఇవీచూడండి: పోలీసులను చూసి భయమేసింది... కొత్తిమీర రోడ్డు పాలైంది

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.