ETV Bharat / state

'సికింద్రాబాద్​లో జరిగిన అల్లర్లలో రాష్ట్ర ప్రభుత్వ హస్తముంది'

Bandi sanjay: సికింద్రాబాద్​లో జరిగిన అల్లర్లలో రాష్ట్ర ప్రభుత్వ హస్తముందని బండి సంజయ్ ఆరోపించారు. పథకం ప్రకారమే తెరాస కార్యకర్తలు దాడి చేశారని తెలిపారు. నిన్న సికింద్రాబాద్​లో జరిగిన నష్టానికి సీఎం కేసీఆర్ పూర్తి బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు.

author img

By

Published : Jun 18, 2022, 3:38 PM IST

Updated : Jun 18, 2022, 6:05 PM IST

బండి సంజయ్‌
బండి సంజయ్‌

Bandi sanjay: సికింద్రాబాద్ అల్లర్లలో రాష్ట్ర ప్రభుత్వ హస్తముందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. పథకం ప్రకారమే తెరాస కార్యకర్తలు దాడి చేశారని పేర్కొన్నారు. అల్లర్లు జరుగుతాయని తెలిసినా ప్రభుత్వం అలసత్వం వహించారని విమర్శించారు. రైల్వేస్టేషన్‌లోకి పెట్రోల్ ఎలా వచ్చిందని ప్రశ్నించారు. కేంద్రంపై బురద జల్లేందుకే తెరాస గుండాలు దాడి చేశారని వెల్లడించారు. సికింద్రాబాద్‌లో జరిగిన నష్టానికి సీఎం కేసీఆర్‌ పూర్తి బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. కరీంనగర్​ జిల్లాలో నిర్వహించిన శక్తి కేంద్ర ఇంఛార్జ్​ల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

సీఎం కేసీఆర్ కార్యాలయం నుంచే విధ్వంసానికి కుట్ర జరిగిందని బండి సంజయ్‌ పేర్కొన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్​లో రాష్ట్ర పోలీసులే కాల్పులు జరిపారని.. అయినా కేంద్రాన్ని బదనాం చేయడం సిగ్గు చేటన్నారు. పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన రాకేశ్ అంతిమ యాత్ర పేరుతో ఈరోజు వరంగల్ జిల్లాలో తెరాస నేతలు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలపై దాడులు చేస్తుండటం దుర్మార్గమన్నారు. ఆర్మీ అభ్యర్థులతోపాటు ప్రజలంతా వాస్తవాలు గమనించాలని ఆయన కోరారు.

భాజపా నాయకులు చిన్న మీటింగులు పెట్టినా, ధర్నాలు చేసినా ఇంటెలిజెన్సుకు తెలుస్తుంది.. కానీ వందల మంది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్​లో గుమిగూడి విధ్వంసం సృష్టిస్తే ఆ సమాచారం ఇంటెలిజెన్స్ వాళ్లకు ఎందుకు తెలియదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సహం, సహకారంతోనే ఈ విధ్వంసానికి కుట్ర జరిగిందని తెలిపారు. విధ్వంసం చేసినోళ్లు పారిపోయేలా చేశారన్నారు. కానీ అమాయకులైన ఆర్మీ అభ్యర్థులను మాత్రం సాయంత్రం వరకు అక్కడే ఉంచారు. ట్విటర్ మంత్రి లేదా మరోకరో ఆదేశించే వరకు వారిని ఖాళీ చేయించలేదు. అంతా అయిపోయాక రాత్రి సీఎం స్పందించడం విడ్డూరమని పేర్కొన్నారు.

తెలంగాణలో విచిత్రమైన పరిస్థతి నెలకొందని బండి సంజయ్ అన్నారు. భాజపా నేతలను పదేపదే అరెస్ట్ చేస్తారు కానీ కాంగ్రెస్ నేతలను మాత్రం చూసీచూడనట్లు వదిలేస్తారని విమర్శించారు. హైదరాబాద్​లో తమ తడాఖా చూపిస్తామని కాంగ్రెస్​ వాళ్లు హెచ్చరించి ‘చలో రాజ్ భవన్ ’ పేరుతో విధ్వంసం సృష్టించారు. అయిన పోలీసులకు సమాచారం ఉన్నా ముందస్తుగా అరెస్ట్ చేయరు. భాజపా గ్రాఫ్ పెరిగింది కాబట్టే ఎలాగైనా చేసి కాంగ్రెస్ గ్రాఫ్ పెంచాలని సీఎం కేసీఆర్ ఇలాంటి నీచమైన కుట్రలకు తెరదీశారని బండి సంజయ్‌ ఆరోపించారు.

సికింద్రాబాద్​లో జరిగిన అల్లర్లలో రాష్ట్ర ప్రభుత్వ హస్తముంది

"అగ్నిపథ్ గొప్ప పథకం. ఈ పథకంపై ఏమైనా అనుమానాలు, అపోహలుంటే నివృత్తి చేసుకోవాలి. విధ్వంసం చేసిందేవరు. 8బోగీలకు పెట్రోలు పోసి నిప్పు పెట్టారు. సికింద్రాబాద్ అల్లర్లలో రాష్ట్ర ప్రభుత్వ హస్తముంది. ఆర్మీ యువకులు ప్రశాంతంగా ధర్నా చేస్తుంటే వాళ్లలో సంఘవిద్రోహ శక్తులు కలిసి ఈ ఘటనకు పాల్పడారు. విధ్వంసం చేసినోళ్లు పారిపోయారు. కానీ అమాయకులైన ఆర్మీ అభ్యర్థులను మాత్రం సాయంత్రం వరకు అక్కడే ఉంచారు. ట్విటర్ మంత్రి లేదా మరోకరో ఆదేశించే వరకు వారిని ఖాళీ చేయించలేదు. పథకం ప్రకారమే తెరాస కార్యకర్తలు దాడి చేశారు." -బండి సంజయ్ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

ఇదీ చదవండి: 'కాంగ్రెస్‌ పిలుపునిస్తే... తెరాస, ఎంఐఎం దాడి చేశాయా?'

'ఆ విషయంలో తగ్గేదే లే'.. అగ్నిపథ్‌ పథకంపై రాజ్‌నాథ్‌

Bandi sanjay: సికింద్రాబాద్ అల్లర్లలో రాష్ట్ర ప్రభుత్వ హస్తముందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. పథకం ప్రకారమే తెరాస కార్యకర్తలు దాడి చేశారని పేర్కొన్నారు. అల్లర్లు జరుగుతాయని తెలిసినా ప్రభుత్వం అలసత్వం వహించారని విమర్శించారు. రైల్వేస్టేషన్‌లోకి పెట్రోల్ ఎలా వచ్చిందని ప్రశ్నించారు. కేంద్రంపై బురద జల్లేందుకే తెరాస గుండాలు దాడి చేశారని వెల్లడించారు. సికింద్రాబాద్‌లో జరిగిన నష్టానికి సీఎం కేసీఆర్‌ పూర్తి బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. కరీంనగర్​ జిల్లాలో నిర్వహించిన శక్తి కేంద్ర ఇంఛార్జ్​ల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

సీఎం కేసీఆర్ కార్యాలయం నుంచే విధ్వంసానికి కుట్ర జరిగిందని బండి సంజయ్‌ పేర్కొన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్​లో రాష్ట్ర పోలీసులే కాల్పులు జరిపారని.. అయినా కేంద్రాన్ని బదనాం చేయడం సిగ్గు చేటన్నారు. పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన రాకేశ్ అంతిమ యాత్ర పేరుతో ఈరోజు వరంగల్ జిల్లాలో తెరాస నేతలు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలపై దాడులు చేస్తుండటం దుర్మార్గమన్నారు. ఆర్మీ అభ్యర్థులతోపాటు ప్రజలంతా వాస్తవాలు గమనించాలని ఆయన కోరారు.

భాజపా నాయకులు చిన్న మీటింగులు పెట్టినా, ధర్నాలు చేసినా ఇంటెలిజెన్సుకు తెలుస్తుంది.. కానీ వందల మంది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్​లో గుమిగూడి విధ్వంసం సృష్టిస్తే ఆ సమాచారం ఇంటెలిజెన్స్ వాళ్లకు ఎందుకు తెలియదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సహం, సహకారంతోనే ఈ విధ్వంసానికి కుట్ర జరిగిందని తెలిపారు. విధ్వంసం చేసినోళ్లు పారిపోయేలా చేశారన్నారు. కానీ అమాయకులైన ఆర్మీ అభ్యర్థులను మాత్రం సాయంత్రం వరకు అక్కడే ఉంచారు. ట్విటర్ మంత్రి లేదా మరోకరో ఆదేశించే వరకు వారిని ఖాళీ చేయించలేదు. అంతా అయిపోయాక రాత్రి సీఎం స్పందించడం విడ్డూరమని పేర్కొన్నారు.

తెలంగాణలో విచిత్రమైన పరిస్థతి నెలకొందని బండి సంజయ్ అన్నారు. భాజపా నేతలను పదేపదే అరెస్ట్ చేస్తారు కానీ కాంగ్రెస్ నేతలను మాత్రం చూసీచూడనట్లు వదిలేస్తారని విమర్శించారు. హైదరాబాద్​లో తమ తడాఖా చూపిస్తామని కాంగ్రెస్​ వాళ్లు హెచ్చరించి ‘చలో రాజ్ భవన్ ’ పేరుతో విధ్వంసం సృష్టించారు. అయిన పోలీసులకు సమాచారం ఉన్నా ముందస్తుగా అరెస్ట్ చేయరు. భాజపా గ్రాఫ్ పెరిగింది కాబట్టే ఎలాగైనా చేసి కాంగ్రెస్ గ్రాఫ్ పెంచాలని సీఎం కేసీఆర్ ఇలాంటి నీచమైన కుట్రలకు తెరదీశారని బండి సంజయ్‌ ఆరోపించారు.

సికింద్రాబాద్​లో జరిగిన అల్లర్లలో రాష్ట్ర ప్రభుత్వ హస్తముంది

"అగ్నిపథ్ గొప్ప పథకం. ఈ పథకంపై ఏమైనా అనుమానాలు, అపోహలుంటే నివృత్తి చేసుకోవాలి. విధ్వంసం చేసిందేవరు. 8బోగీలకు పెట్రోలు పోసి నిప్పు పెట్టారు. సికింద్రాబాద్ అల్లర్లలో రాష్ట్ర ప్రభుత్వ హస్తముంది. ఆర్మీ యువకులు ప్రశాంతంగా ధర్నా చేస్తుంటే వాళ్లలో సంఘవిద్రోహ శక్తులు కలిసి ఈ ఘటనకు పాల్పడారు. విధ్వంసం చేసినోళ్లు పారిపోయారు. కానీ అమాయకులైన ఆర్మీ అభ్యర్థులను మాత్రం సాయంత్రం వరకు అక్కడే ఉంచారు. ట్విటర్ మంత్రి లేదా మరోకరో ఆదేశించే వరకు వారిని ఖాళీ చేయించలేదు. పథకం ప్రకారమే తెరాస కార్యకర్తలు దాడి చేశారు." -బండి సంజయ్ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

ఇదీ చదవండి: 'కాంగ్రెస్‌ పిలుపునిస్తే... తెరాస, ఎంఐఎం దాడి చేశాయా?'

'ఆ విషయంలో తగ్గేదే లే'.. అగ్నిపథ్‌ పథకంపై రాజ్‌నాథ్‌

Last Updated : Jun 18, 2022, 6:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.