ETV Bharat / state

'పాత్రికేయులందరికీ కరోనా పరీక్షలు నిర్వహించాలి' - మీడియా రిపోర్టర్లందరకీ కరోనా పరీక్షలు

తెరాస ప్రభుత్వం మొద్దు నిద్ర వదిలి కరోనా కట్టడిపై అప్రమత్తంగా ఉండాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ సూచించారు. రాష్ట్రంలోని మీడియా ప్రతినిధులందరికీ కరోనా పరీక్షలు నిర్వహించాలని కోరారు.

Hyderabad Latest news
Hyderabad Latest news
author img

By

Published : Jun 7, 2020, 5:41 PM IST

రాష్ట్రంలోని మీడియా రిపోర్టర్లందరకీ ప్రభుత్వమే ఆరోగ్య రక్షణ కల్పించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ డిమాండ్ చేశారు. పాత్రికేయులందరికీ యుద్ధ ప్రాతిపదికన కరోనా పరీక్షలు నిర్వహించాలని సర్కారుకు సూచించారు.

ఓ ఎలక్ట్రానిక్​ మీడియా సంస్థకు చెందిన క్రైమ్ రిపోర్టర్ కరోనాతో మృతి చెందడం తనను కలిచి వేసిందన్నారు. ఈ ఘటన చాలా బాధాకరమని సంజయ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. లాక్‌డౌన్ సమయంలోనూ కరోనాపై పోరాడేందుకు కావాల్సిన సమాచారాన్ని చేరవేసిన మీడియా ప్రతినిధులు కూడా కొవిడ్-19 వారియర్సేనని ఆయన పేర్కొన్నారు. వారిని ప్రత్యేక దృష్టితో చూసి ఆరోగ్య రక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు.

రాష్ట్రంలోని మీడియా రిపోర్టర్లందరకీ ప్రభుత్వమే ఆరోగ్య రక్షణ కల్పించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ డిమాండ్ చేశారు. పాత్రికేయులందరికీ యుద్ధ ప్రాతిపదికన కరోనా పరీక్షలు నిర్వహించాలని సర్కారుకు సూచించారు.

ఓ ఎలక్ట్రానిక్​ మీడియా సంస్థకు చెందిన క్రైమ్ రిపోర్టర్ కరోనాతో మృతి చెందడం తనను కలిచి వేసిందన్నారు. ఈ ఘటన చాలా బాధాకరమని సంజయ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. లాక్‌డౌన్ సమయంలోనూ కరోనాపై పోరాడేందుకు కావాల్సిన సమాచారాన్ని చేరవేసిన మీడియా ప్రతినిధులు కూడా కొవిడ్-19 వారియర్సేనని ఆయన పేర్కొన్నారు. వారిని ప్రత్యేక దృష్టితో చూసి ఆరోగ్య రక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.