హైదరాబాద్లోని బొల్లారంలో నివాసముండే 24 ఏళ్ల ట్రాన్స్జెండర్ రెజీనా ప్రతిరోజూ భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తోంది. సోమవారం రాత్రి 8 గంటలకు రెజీనా భిక్షాటన చేటి నడుచుకుంటూ వస్తున్న క్రమంలో ఇంటి దగ్గర దింపుతానంటూ ఓ ఆటో డ్రైవర్ ఆమె వద్దకు వచ్చాడు. ఆటోలో ఎక్కించుకొని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఎలాగోలా తప్పించుకున్న రెజీనా బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన వద్ద ఉన్న 1500 రూపాయలు లాక్కొన్ని, ఛాతిపై తీవ్రంగా కొట్టాడని వాపోయింది. సోమవారం రాత్రి ఘటన జరగగా... పోలీసులు ఆటో డ్రైవర్ మహేశ్ని పట్టుకోకపోవడం వల్ల మిగిలిన ట్రాన్స్జెండర్స్తో కలిసి రంగంలోకి దిగింది. ఆటో డ్రైవర్ మహేశ్ని పట్టుకొని పోలీసులకు అప్పగించింది.
మహిళలపై అత్యాచారం జరిగితే వెంటనే స్పందించే పోలీసులు... ట్రాన్స్జెండర్లపై అఘాయిత్యాలు జరిగితే స్పందించకపోవడం బాధాకరమని తెలిపారు. ఇప్పటికైనా మహేశ్పై కేసు నమోదు చేసి తనకు న్యాయం చేయాలంటూ రెజీనా వేడుకుంటోంది.
ఇవీ చూడండి: తాగిన మత్తులో నాగుపాముకు ముద్దు ఇచ్చాడు.. తర్వాత ఏమైంది?