ETV Bharat / state

అటవీ అధికారిణిపై దాడిచేసిన వారిని కఠినంగా శిక్షించాలి

author img

By

Published : Jul 1, 2019, 7:52 PM IST

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అటవీ అధికారిణిపై జరిగిన దాడికి సంబంధించి హైదరాబాద్​లోని అటవీ శాఖ ప్రధాన కార్యాలయంలో అన్ని స్థాయిల అటవీ అధికారులు సమావేశమయ్యారు. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్​తో పాటు స్టేట్ ఫారెస్ట్ సర్వీస్, మినిస్టీరియల్ స్టాఫ్,  రేంజ్ ఆఫీసర్స్ అసోసియేషన్, జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్స్ సంఘాల ప్రతినిధులతో పాటు పెద్ద సంఖ్యలో ఉద్యోగులు హాజరై దాడిని ఖండించారు.

అటవీ భూమాల రక్షణకు తగిన భద్రత కల్పించాలి : అటవీ అధికారుల సంఘం

కాగజ్ నగర్ పట్టణంలో అటవీ అధికారిణిపై దాడికి సంబంధించి హైదరాబాద్ అరణ్య భవన్​లో అటవీ అధికారుల సంఘాలు సమావేశమయ్యాయి. కాగజ్ నగర్​లో అటవీ అధికారిణిపై జరిగిన దాడిని అన్ని సంఘాలు ముక్త కంఠంతో ఖండించాయి. విధి నిర్వహణలో ఉన్న సిబ్బందిపై దాడి చేసి తీవ్రంగా గాయపరచటంపై అధికారులు, సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. దాడి చేసిన వారితో పాటు, సూత్రధారులపై కూడా వేగంగా విచారణ జరపాలన్నారు. చట్ట ప్రకారం తగిన శిక్ష పడేలా తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.
అటవీ భూముల రక్షణకు తాము కట్టుబడి ఉన్నామని, తగిన భద్రత కల్పిస్తూ పోలీస్, రెవెన్యూ శాఖల మధ్య సమన్వయాన్ని మరింత పటిష్ఠం చేయాలని కోరారు. అటవీ భూములను ఆక్రమించటమే కాకుండా తమపైనే దాడికి దిగుతున్న వారిపై ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించాలన్నారు.

అరణ్య భవన్​లో అన్ని స్థాయిల అటవీ అధికారుల సమావేశం

ఇవీ చూడండి : బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత...

కాగజ్ నగర్ పట్టణంలో అటవీ అధికారిణిపై దాడికి సంబంధించి హైదరాబాద్ అరణ్య భవన్​లో అటవీ అధికారుల సంఘాలు సమావేశమయ్యాయి. కాగజ్ నగర్​లో అటవీ అధికారిణిపై జరిగిన దాడిని అన్ని సంఘాలు ముక్త కంఠంతో ఖండించాయి. విధి నిర్వహణలో ఉన్న సిబ్బందిపై దాడి చేసి తీవ్రంగా గాయపరచటంపై అధికారులు, సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. దాడి చేసిన వారితో పాటు, సూత్రధారులపై కూడా వేగంగా విచారణ జరపాలన్నారు. చట్ట ప్రకారం తగిన శిక్ష పడేలా తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.
అటవీ భూముల రక్షణకు తాము కట్టుబడి ఉన్నామని, తగిన భద్రత కల్పిస్తూ పోలీస్, రెవెన్యూ శాఖల మధ్య సమన్వయాన్ని మరింత పటిష్ఠం చేయాలని కోరారు. అటవీ భూములను ఆక్రమించటమే కాకుండా తమపైనే దాడికి దిగుతున్న వారిపై ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించాలన్నారు.

అరణ్య భవన్​లో అన్ని స్థాయిల అటవీ అధికారుల సమావేశం

ఇవీ చూడండి : బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత...

Intro:
స్Tg_wgl_05_01_mlc_srinivasreddy_trs_sabhyathvam_ab_ts10077


Body:తెరాస సభ్యత నమోదుకు అనూహ్య స్పందన వస్తుందని తెరాస ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి వరంగల్ లో అన్నారు. హన్మకొండ లో స్థానిక ఎమ్మెల్యే వినయభాస్కర్ ఆధ్వర్యంలో తెరాస విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. ప్రతి ఒక్కరు స్వచ్చందంగా తరలివచ్చి తెరాస సభ్యత నమోదు తీసుకుంటున్నారని పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలే నిదర్శనమన్నారు....బైట్
పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి,ఎమ్మెల్సీ.


Conclusion:trs sabhyathvam
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.