ETV Bharat / state

Mansas Trust: ప్రథమ ప్రాధాన్యత విద్యకే: అశోక్ గజపతిరాజు

author img

By

Published : Jun 17, 2021, 3:55 PM IST

ఏపీ హైకోర్టు ఆదేశాలతో మాన్సాస్ (Mansas Trust) ట్రస్ట్ ఛైర్మన్​గా అశోక్ గజపతిరాజు (Ashok gajapathi raju) తిరిగి బాధ్యతలు స్వీకరించారు. గత కొంతకాలంగా ట్రస్ట్​లో కార్యకలాపాలు సరిగా జరగకపోవటంపై అసహనం వ్యక్తం చేశారు. కనీసం ఆర్థిక లావాదేవీలపై ఆడిట్ జరపకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

Mansas Trust
అశోక్ గజపతిరాజు, మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్

ఆంధ్రప్రదేశ్​ హైకోర్టు ఆదేశాలతో వంశాచారానికి అనుగుణంగా మాన్సాస్(Mansas Trust) ట్రస్ట్ ఛైర్మన్​గా అశోక్ గజపతిరాజు(Ashok gajapathi raju) తిరిగి బాధ్యతలు స్వీకరించారు. విజయనగరంలోని మాన్సాస్ కార్యాలయానికి వచ్చిన ఆయనకు సిబ్బంది సాదర స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి మాన్సాస్ ఈవో వెంకటేశ్వర రావు, కరెస్పాండెంట్ కేవీఎల్ రాజు గైర్హాజరు కావడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ట్రస్ట్ నిర్వహణలో అధికారులు సహకరించాలని కోరారు. మాన్సాస్ భూముల్లో ఇసుక అక్రమాలు ఎవరి హయాంలో జరిగాయో తేల్చాలన్న ఆయన.. మాన్సాస్ సిబ్బందికి జీతాలు ఎందుకు చెల్లించలేదని ప్రశ్నించారు. విశాఖలోని పంచ గ్రామాల సమస్యపై త్వరలోనే దృష్టి సారించనున్నట్లు పేర్కొన్నారు.

సింహాచలం ఆలయ ఈవో కూడా నిన్న నన్ను కలవడానికి ఇష్టపడలేదని అశోక్ గజపతిరాజు(Ashok gajapathi raju) అన్నారు. నెల్లిమర్ల మండలంలోని రామతీర్ధంలో దుండగుల దాడిలో రాముని శిరస్సు ఖండించిన వారిని వైకాపా ప్రభుత్వం పట్టుకోక పోగా.. ఆలయ అభివృద్ధికి పంపిన చెక్కును వెనక్కి పంపడం తనను మానసిక క్షోభకు గురిచేసిందన్నారు. విగ్రహ పునఃప్రతిష్ట కార్యక్రమానికి కూడా ఆహ్వానించలేదని వెల్లడించారు.

ట్రస్ట్(Mansas Trust) కార్యాలయాన్ని విజయనగరం నుంచి ఎందుకు తరలిస్తున్నారో తెలియట్లేదని అశోక్ గజపతిరాజు అన్నారు. ట్రస్టుకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై గడచిన ఏడాదిగా ఆడిట్ జరగకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రతి ఏడాది ఆడిట్ జరపటానికి సంస్ధ నుంచి ఫీజు కూడా అధికారికంగా చెల్లింస్తున్నట్లు తెలిపారు. ఆడిట్ జరిపించాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులదేనని స్పష్టం చేశారు. దోపిడీదారులకు మాన్సాస్‌ ట్రస్టులో స్థానం లేదని ఆయన తేల్చి చెప్పారు. ఛైర్మన్​గా తన ప్రథమ ప్రాధాన్యం విద్యకేనన్నారు. దాని కోసం ప్రభుత్వ సహకారాన్ని కూడా అర్ధిస్తామన్నారు. ట్రస్ట్ చేపడుతున్న సేవా కార్యక్రమాలను పారదర్శకతతో నిర్వహిస్తూ ముందుకెళ్తామని స్పష్టం చేశారు.

ఇవీ చదవండి: Internet outage: ఆగిన వెబ్​సైట్లు, యాప్​లు

ఆంధ్రప్రదేశ్​ హైకోర్టు ఆదేశాలతో వంశాచారానికి అనుగుణంగా మాన్సాస్(Mansas Trust) ట్రస్ట్ ఛైర్మన్​గా అశోక్ గజపతిరాజు(Ashok gajapathi raju) తిరిగి బాధ్యతలు స్వీకరించారు. విజయనగరంలోని మాన్సాస్ కార్యాలయానికి వచ్చిన ఆయనకు సిబ్బంది సాదర స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి మాన్సాస్ ఈవో వెంకటేశ్వర రావు, కరెస్పాండెంట్ కేవీఎల్ రాజు గైర్హాజరు కావడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ట్రస్ట్ నిర్వహణలో అధికారులు సహకరించాలని కోరారు. మాన్సాస్ భూముల్లో ఇసుక అక్రమాలు ఎవరి హయాంలో జరిగాయో తేల్చాలన్న ఆయన.. మాన్సాస్ సిబ్బందికి జీతాలు ఎందుకు చెల్లించలేదని ప్రశ్నించారు. విశాఖలోని పంచ గ్రామాల సమస్యపై త్వరలోనే దృష్టి సారించనున్నట్లు పేర్కొన్నారు.

సింహాచలం ఆలయ ఈవో కూడా నిన్న నన్ను కలవడానికి ఇష్టపడలేదని అశోక్ గజపతిరాజు(Ashok gajapathi raju) అన్నారు. నెల్లిమర్ల మండలంలోని రామతీర్ధంలో దుండగుల దాడిలో రాముని శిరస్సు ఖండించిన వారిని వైకాపా ప్రభుత్వం పట్టుకోక పోగా.. ఆలయ అభివృద్ధికి పంపిన చెక్కును వెనక్కి పంపడం తనను మానసిక క్షోభకు గురిచేసిందన్నారు. విగ్రహ పునఃప్రతిష్ట కార్యక్రమానికి కూడా ఆహ్వానించలేదని వెల్లడించారు.

ట్రస్ట్(Mansas Trust) కార్యాలయాన్ని విజయనగరం నుంచి ఎందుకు తరలిస్తున్నారో తెలియట్లేదని అశోక్ గజపతిరాజు అన్నారు. ట్రస్టుకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై గడచిన ఏడాదిగా ఆడిట్ జరగకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రతి ఏడాది ఆడిట్ జరపటానికి సంస్ధ నుంచి ఫీజు కూడా అధికారికంగా చెల్లింస్తున్నట్లు తెలిపారు. ఆడిట్ జరిపించాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులదేనని స్పష్టం చేశారు. దోపిడీదారులకు మాన్సాస్‌ ట్రస్టులో స్థానం లేదని ఆయన తేల్చి చెప్పారు. ఛైర్మన్​గా తన ప్రథమ ప్రాధాన్యం విద్యకేనన్నారు. దాని కోసం ప్రభుత్వ సహకారాన్ని కూడా అర్ధిస్తామన్నారు. ట్రస్ట్ చేపడుతున్న సేవా కార్యక్రమాలను పారదర్శకతతో నిర్వహిస్తూ ముందుకెళ్తామని స్పష్టం చేశారు.

ఇవీ చదవండి: Internet outage: ఆగిన వెబ్​సైట్లు, యాప్​లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.