ETV Bharat / state

గ్రేటర్​ ఓట్ల లెక్కింపు కోసం పటిష్ఠ ఏర్పాట్లు

author img

By

Published : Dec 3, 2020, 3:53 PM IST

గ్రేటర్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం పటిష్ఠ ఏర్పాట్లు చేసినట్లు ఎస్​ఈసీ తెలిపింది. రేపు ఉదయం 8 గంటలకు ప్రారంభం అయ్యే లెక్కింపు కోసం 30 కేంద్రాల్లో 166 కౌంటింగ్ టేబుళ్లు ఏర్పాటు చేసినట్లు వివరించింది.

గ్రేటర్​ ఓట్ల లెక్కింపు కోసం పటిష్ఠ ఏర్పాట్లు
గ్రేటర్​ ఓట్ల లెక్కింపు కోసం పటిష్ఠ ఏర్పాట్లు

జీహెచ్ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం పటిష్ఠ ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. రేపు ఉదయం 8 గంటలకు ప్రారంభం అయ్యే లెక్కింపు కోసం 30 కేంద్రాల్లో 166 కౌంటింగ్ టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఒక్కో డివిజన్‌కు 14 టేబుళ్లతో కూడిన ఒక్కో కౌంటింగ్ హాల్ ఉంటుంది.

ఒక్కో కౌంటింగ్ హల్‌లో రిటర్నింగ్ అధికారి, సహాయ రిటర్నింగ్ అధికారి సహా ఒక్కో పరిశీలకుడిని నియమించారు. అభ్యర్థులు ఒక్కో టేబుల్‌కు ఒక ఏజెంట్‌ను నియమించుకునే అవకాశం ఉంటుంది. వారికి రిలీవింగ్ సౌకర్యం లేదని ఎస్​ఈసీ స్పష్టం చేసింది. మొదట పోస్టల్ బ్యాలెట్లు, తర్వాత రెగ్యులర్ బ్యాలెట్ పత్రాల లెక్కింపు చేపట్టనుండగా... తొలుత పోలైన అన్ని ఓట్ల లెక్కను సరిచూస్తారు.

తర్వాత అభ్యర్థుల వారీగా ఓట్ల లెక్కింపు అనంతరం పరిశీలకుడి అనుమతి తర్వాతే ఫలితాలు ప్రకటిస్తారు. అనుమానిత ఓట్లకు సంబంధించి రిటర్నింగ్ అధికారిదే తుది నిర్ణయమని ఎస్ఈసీ స్పష్టం చేసింది. ఎవరైనా అభ్యర్థులు రీకౌంటింగ్ కోరాలనుకుంటే... ఫలితం ప్రకటించడానికి ముందే రిటర్నింగ్ అధికారికి విజ్ఞప్తి చేయాల్సి ఉంటుందని తెలిపింది.

ఒకవేళ ఇద్దరు అభ్యర్థులకు సమానంగా ఓట్లు వస్తే లాటరీ పద్ధతిన డ్రా తీసి ఫలితాన్ని ప్రకటిస్తారు. రిటర్నింగ్ అధికారి టేబుల్ వద్ద అభ్యర్థి లేదా ఒక ఏజెంటుకు మాత్రమే అనుమతి ఉంటుంది.

ఇదీ చదవండి: నోముల నర్సింహయ్య అంత్యక్రియలకు హాజరైన కేసీఆర్

జీహెచ్ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం పటిష్ఠ ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. రేపు ఉదయం 8 గంటలకు ప్రారంభం అయ్యే లెక్కింపు కోసం 30 కేంద్రాల్లో 166 కౌంటింగ్ టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఒక్కో డివిజన్‌కు 14 టేబుళ్లతో కూడిన ఒక్కో కౌంటింగ్ హాల్ ఉంటుంది.

ఒక్కో కౌంటింగ్ హల్‌లో రిటర్నింగ్ అధికారి, సహాయ రిటర్నింగ్ అధికారి సహా ఒక్కో పరిశీలకుడిని నియమించారు. అభ్యర్థులు ఒక్కో టేబుల్‌కు ఒక ఏజెంట్‌ను నియమించుకునే అవకాశం ఉంటుంది. వారికి రిలీవింగ్ సౌకర్యం లేదని ఎస్​ఈసీ స్పష్టం చేసింది. మొదట పోస్టల్ బ్యాలెట్లు, తర్వాత రెగ్యులర్ బ్యాలెట్ పత్రాల లెక్కింపు చేపట్టనుండగా... తొలుత పోలైన అన్ని ఓట్ల లెక్కను సరిచూస్తారు.

తర్వాత అభ్యర్థుల వారీగా ఓట్ల లెక్కింపు అనంతరం పరిశీలకుడి అనుమతి తర్వాతే ఫలితాలు ప్రకటిస్తారు. అనుమానిత ఓట్లకు సంబంధించి రిటర్నింగ్ అధికారిదే తుది నిర్ణయమని ఎస్ఈసీ స్పష్టం చేసింది. ఎవరైనా అభ్యర్థులు రీకౌంటింగ్ కోరాలనుకుంటే... ఫలితం ప్రకటించడానికి ముందే రిటర్నింగ్ అధికారికి విజ్ఞప్తి చేయాల్సి ఉంటుందని తెలిపింది.

ఒకవేళ ఇద్దరు అభ్యర్థులకు సమానంగా ఓట్లు వస్తే లాటరీ పద్ధతిన డ్రా తీసి ఫలితాన్ని ప్రకటిస్తారు. రిటర్నింగ్ అధికారి టేబుల్ వద్ద అభ్యర్థి లేదా ఒక ఏజెంటుకు మాత్రమే అనుమతి ఉంటుంది.

ఇదీ చదవండి: నోముల నర్సింహయ్య అంత్యక్రియలకు హాజరైన కేసీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.