ETV Bharat / state

ఐదుగురు సజీవ దహనం ఘటన.. అంతా ఉడత చేసిందట..!

author img

By

Published : Jun 30, 2022, 2:07 PM IST

APSPDCL CMD: ఆంధ్రప్రదేశ్ సత్యసాయి జిల్లా ప్రమాద ఘటనపై ఏపీఎస్పీడీసీఎల్‌ సీఎండీ హరనాథరావు స్పందించారు. ఈ దుర్ఘటన జరగడానికి ఒక ఉడత కారణమని చెప్పారు.

ఐదుగురు సజీవ దహనం ఘటన.. అంతా ఉడత చేసిందట..!
ఐదుగురు సజీవ దహనం ఘటన.. అంతా ఉడత చేసిందట..!

APSPDCL CMD: ఏపీ సత్యసాయి జిల్లాలో.. విద్యుత్ తీగలు ఆటోమీద పడి.. ఐదుగురు సజీవదహనమైన దుర్ఘటనకు.. ఉడత కారణని చెప్పారు ఏపీఎస్పీడీసీఎల్‌ సీఎండీ హరనాథరావు. ఈ ప్రమాదంపై స్పందించిన ఆయన.. వివరాలు వెల్లడించారు. విద్యుత్‌ తీగ నుంచి స్తంభంపై ఉన్న ఇనుప క్లాంప్‌ మీదకు ఉడత దూకడం వల్ల.. ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. ఉడత దూకిన సమయంలో షార్ట్‌సర్క్యూట్‌, ఎర్త్‌ కావడంతో.. హైటెన్షన్‌ విద్యుత్‌ తీగలు ఆటోపై తెగిపడ్డాయని పేర్కొన్నారు. దానివల్లే ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు.

సీఎండీ ఇచ్చిన ఈ వివరణపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ మండిపడ్డారు. "తేనెటీగల వల్ల రథం తగలబడటం, ఎలుకలు మందు తాగడం, కుక్కలు తరిమితే భయపడి కోర్టులో కాకాని కేసు ఆధారాలు ఎత్తుకుపోవడం, ఉడత వల్ల హై టెన్షన్ వైర్ తెగడం వంటివన్నీ.. జగన్నాటక రెడ్డి పాలనలోనే జరుగుతాయి" అని విమర్శించారు. ఇంకా నయం.. కోతల్లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని చెప్పలేదని ఎద్దేవాచేశారు. ఐదుగురు నిరుపేదలు సజీవ దహనమైతే, కనీస విచారణ జరపకుండానే అధికారులతో కట్టుకథల కహానీలు చెప్పించారని లోకేశ్‌ దుయ్యబట్టారు.

అసలేం జరిగిందంటే..? తాడిమర్రి మండలం గుడ్డంపల్లి గ్రామానికి చెందిన కూలీలు.. చిల్లకొండయ్యపల్లి గ్రామ సమీపంలో కూలి పనులకు బయలుదేరారు. ఆటోలో ప్రయాణిస్తున్న వీరు.. చిల్లకొండయ్యపల్లి గ్రామ సమీపానికి చేరుకోగానే.. విద్యుత్ తీగలు తెగి ఆటోమీద పడ్డాయి. క్షణాల్లోనే మంటలు ఆటో మొత్తాన్నీ చుట్టు ముట్టాయి. ఏం జరుగుతోందో అర్థమయ్యే లోపే.. లోపల ఉన్న కూలీలకూ మంటలు అంటుకున్నాయి. హాహాకారాలు.. ఆర్తనాదాలతో ప్రాణాలు దక్కించుకునేందుకు అందరూ ప్రయత్నించారు. కానీ.. కొందరికి దుస్సాధ్యంగా మారింది. ప్రమాద సమయంలో మొత్తం డ్రైవర్‌ తో కలిపి 13 మంది కూలీలు ప్రయాణిస్తున్నారు. వీరిలో డ్రైవర్‌ పోతులయ్య, మరో ఏడుగురు కూలీలు మాత్రమే గాయాలతో బయటపడ్డారు.

  • తేనెటీగల వల్ల రథం తగలబడటం,ఎలుకలు మందు తాగడం,కుక్కలు తరిమితే భయపడి కోర్టులో కాకాని కేసు ఆధారాలు ఎత్తుకుపోవడం,ఉడత వల్ల హై టెన్షన్ వైర్ తెగడం వంటివన్నీ జగన్ నాటక రెడ్డి పాలనలోనే జరుగుతాయి.ఇంకా నయం!కోతల్లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగింది అని చెప్పలేదు(1/2) pic.twitter.com/nb7w14ZY3I

    — Lokesh Nara (@naralokesh) June 30, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇవీ చదవండి:

APSPDCL CMD: ఏపీ సత్యసాయి జిల్లాలో.. విద్యుత్ తీగలు ఆటోమీద పడి.. ఐదుగురు సజీవదహనమైన దుర్ఘటనకు.. ఉడత కారణని చెప్పారు ఏపీఎస్పీడీసీఎల్‌ సీఎండీ హరనాథరావు. ఈ ప్రమాదంపై స్పందించిన ఆయన.. వివరాలు వెల్లడించారు. విద్యుత్‌ తీగ నుంచి స్తంభంపై ఉన్న ఇనుప క్లాంప్‌ మీదకు ఉడత దూకడం వల్ల.. ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. ఉడత దూకిన సమయంలో షార్ట్‌సర్క్యూట్‌, ఎర్త్‌ కావడంతో.. హైటెన్షన్‌ విద్యుత్‌ తీగలు ఆటోపై తెగిపడ్డాయని పేర్కొన్నారు. దానివల్లే ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు.

సీఎండీ ఇచ్చిన ఈ వివరణపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ మండిపడ్డారు. "తేనెటీగల వల్ల రథం తగలబడటం, ఎలుకలు మందు తాగడం, కుక్కలు తరిమితే భయపడి కోర్టులో కాకాని కేసు ఆధారాలు ఎత్తుకుపోవడం, ఉడత వల్ల హై టెన్షన్ వైర్ తెగడం వంటివన్నీ.. జగన్నాటక రెడ్డి పాలనలోనే జరుగుతాయి" అని విమర్శించారు. ఇంకా నయం.. కోతల్లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని చెప్పలేదని ఎద్దేవాచేశారు. ఐదుగురు నిరుపేదలు సజీవ దహనమైతే, కనీస విచారణ జరపకుండానే అధికారులతో కట్టుకథల కహానీలు చెప్పించారని లోకేశ్‌ దుయ్యబట్టారు.

అసలేం జరిగిందంటే..? తాడిమర్రి మండలం గుడ్డంపల్లి గ్రామానికి చెందిన కూలీలు.. చిల్లకొండయ్యపల్లి గ్రామ సమీపంలో కూలి పనులకు బయలుదేరారు. ఆటోలో ప్రయాణిస్తున్న వీరు.. చిల్లకొండయ్యపల్లి గ్రామ సమీపానికి చేరుకోగానే.. విద్యుత్ తీగలు తెగి ఆటోమీద పడ్డాయి. క్షణాల్లోనే మంటలు ఆటో మొత్తాన్నీ చుట్టు ముట్టాయి. ఏం జరుగుతోందో అర్థమయ్యే లోపే.. లోపల ఉన్న కూలీలకూ మంటలు అంటుకున్నాయి. హాహాకారాలు.. ఆర్తనాదాలతో ప్రాణాలు దక్కించుకునేందుకు అందరూ ప్రయత్నించారు. కానీ.. కొందరికి దుస్సాధ్యంగా మారింది. ప్రమాద సమయంలో మొత్తం డ్రైవర్‌ తో కలిపి 13 మంది కూలీలు ప్రయాణిస్తున్నారు. వీరిలో డ్రైవర్‌ పోతులయ్య, మరో ఏడుగురు కూలీలు మాత్రమే గాయాలతో బయటపడ్డారు.

  • తేనెటీగల వల్ల రథం తగలబడటం,ఎలుకలు మందు తాగడం,కుక్కలు తరిమితే భయపడి కోర్టులో కాకాని కేసు ఆధారాలు ఎత్తుకుపోవడం,ఉడత వల్ల హై టెన్షన్ వైర్ తెగడం వంటివన్నీ జగన్ నాటక రెడ్డి పాలనలోనే జరుగుతాయి.ఇంకా నయం!కోతల్లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగింది అని చెప్పలేదు(1/2) pic.twitter.com/nb7w14ZY3I

    — Lokesh Nara (@naralokesh) June 30, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.