ETV Bharat / state

అసెంబ్లీ ఆమోదించిన బిల్లులకు మండలి ఆమోదం

author img

By

Published : Mar 16, 2020, 12:31 PM IST

Updated : Mar 16, 2020, 2:31 PM IST

అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులను శాసనమండలి ఆమోదించింది. కీలక బిల్లులకు గ్రీన్​ సిగ్నల్ తెలిపింది.

approval-by-the-legislature-for-bills-passed-in-the-ts-assembly
అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులకు మండలి ఆమోదం
అసెంబ్లీ ఆమోదించిన బిల్లులకు మండలి ఆమోదం

అసెంబ్లీలో ఆమోదించిన కీలక బిల్లులను శాసనమండలి ఆమోదించింది. లోకాయుక్త సవరణ బిల్లుకు మండలి ఆమోదం తెలిపింది. జీతాలు, పింఛను చెల్లింపు, అనర్హతల తొలగింపు సవరణ బిల్లును అంగీకరించింది. కార్పొరేషన్ ఛైర్మన్ పదవులను లాభదాయక పదవుల నుంచి తొలగింపు బిల్లు, అభయహస్తం పింఛను పథకం రద్దు బిల్లు, జీఎస్టీ చట్ట సవరణ బిల్లులకు మండలి గ్రీన్​ సిగ్నల్ ఇచ్చింది.

ఈ సందర్భంగా కాంగ్రెస్​ ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి... కాంట్రిబ్యూటరీ పింఛన్​ అయిన అభయహస్తంకు ఆసరా పింఛన్​కు పోలిక లేదని తెలిపారు. అభయహస్తం పేరిట జమ అయిన 934 కోట్లు ఏ బ్యాంక్​లో ఉన్నాయని ప్రశ్నించారు. అభయహస్తం మీద ఒక కమిటీ ఏర్పాటు చేసి.. సెలెక్ట్​ కమిటీకి పంపించాలని కోరారు. లోకాయుక్తలో ఫిర్యాదులు పేరుకుపోతున్నాయని, వాటి పరిష్కారానికి కాలపరిమితి పెట్టాలన్నారు.

అభయహస్తం అర్హులందరికీ ఆసరా పింఛన్లను అందిస్తున్నామని... అభయహస్తం కింద మహిళా సభ్యులు చెల్లించిన మొత్తానికి వడ్డీతో సహా వాళ్లకు చెల్లిస్తున్నామని పంచాయతీరాజ్​ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు అన్నారు. అభయహస్తం కంటే ఆసరానే లాభదాయకమైన పింఛన్​ అని వ్యాఖ్యానించారు. లోకాయుక్తలో వచ్చిన ఫిర్యాదులు వేగంగా పరిష్కరించాలని కోరుతామని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​ రావు అన్నారు.

ఇవీ చూడండి:నాలుగు బిల్లులకు శాసనసభ ఏకగ్రీవ ఆమోదం

అసెంబ్లీ ఆమోదించిన బిల్లులకు మండలి ఆమోదం

అసెంబ్లీలో ఆమోదించిన కీలక బిల్లులను శాసనమండలి ఆమోదించింది. లోకాయుక్త సవరణ బిల్లుకు మండలి ఆమోదం తెలిపింది. జీతాలు, పింఛను చెల్లింపు, అనర్హతల తొలగింపు సవరణ బిల్లును అంగీకరించింది. కార్పొరేషన్ ఛైర్మన్ పదవులను లాభదాయక పదవుల నుంచి తొలగింపు బిల్లు, అభయహస్తం పింఛను పథకం రద్దు బిల్లు, జీఎస్టీ చట్ట సవరణ బిల్లులకు మండలి గ్రీన్​ సిగ్నల్ ఇచ్చింది.

ఈ సందర్భంగా కాంగ్రెస్​ ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి... కాంట్రిబ్యూటరీ పింఛన్​ అయిన అభయహస్తంకు ఆసరా పింఛన్​కు పోలిక లేదని తెలిపారు. అభయహస్తం పేరిట జమ అయిన 934 కోట్లు ఏ బ్యాంక్​లో ఉన్నాయని ప్రశ్నించారు. అభయహస్తం మీద ఒక కమిటీ ఏర్పాటు చేసి.. సెలెక్ట్​ కమిటీకి పంపించాలని కోరారు. లోకాయుక్తలో ఫిర్యాదులు పేరుకుపోతున్నాయని, వాటి పరిష్కారానికి కాలపరిమితి పెట్టాలన్నారు.

అభయహస్తం అర్హులందరికీ ఆసరా పింఛన్లను అందిస్తున్నామని... అభయహస్తం కింద మహిళా సభ్యులు చెల్లించిన మొత్తానికి వడ్డీతో సహా వాళ్లకు చెల్లిస్తున్నామని పంచాయతీరాజ్​ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు అన్నారు. అభయహస్తం కంటే ఆసరానే లాభదాయకమైన పింఛన్​ అని వ్యాఖ్యానించారు. లోకాయుక్తలో వచ్చిన ఫిర్యాదులు వేగంగా పరిష్కరించాలని కోరుతామని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​ రావు అన్నారు.

ఇవీ చూడండి:నాలుగు బిల్లులకు శాసనసభ ఏకగ్రీవ ఆమోదం

Last Updated : Mar 16, 2020, 2:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.