నైట్రిక్ ఆక్సైడ్ ఆవిష్కరణ, రక్తనాళాలను రిలాక్స్ చేయడం ద్వారా గుండె జబ్బులు తగ్గించడంలో ముఖ్య పాత్ర వహించారు నోబెల్ బహుమతి గ్రహీత డాక్టర్ మురాద్.
దేశంలో ఏటా పెరిగిపోతోన్న గుండె సంబంధిత మరణాలకు చెక్ పెట్టేందుకు అపోలో ఆస్పత్రి యాజమాన్యం డాక్టర్ మురాద్తో ఒప్పందం కుదుర్చుకుంది.
గుండె జబ్బులు త్వరగా గుర్తించడం, వాటికి కచ్చితమైన చికిత్సలు అందించడంలో డాక్టర్ మురాద్ తమకు ఎంతగానో దోహదపడనున్నారని అపోలో ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్ సంగీతా రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.