ETV Bharat / state

రాష్ట్రంలో కొవిడ్​ పరీక్షలు పెంచాలి: ఏపీ హైకోర్టు

author img

By

Published : Apr 28, 2021, 9:13 AM IST

ఏపీలో కరోనా పరీక్షలను పెంచాలని ఆ రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. పరీక్ష ఫలితాలు ప్రకటించేందుకు గతంలో 2, 3 రోజులు పట్టేదని, ప్రస్తుతం 24-36 గంటల్లో వస్తున్నాయని జీపీ తెలిపారు. అంత సమయం ఎందుకు పడుతుందని ధర్మాసనం ప్రశ్నించి.. 8-10 గంటల్లో వచ్చేలా చూడాలని పేర్కొంది. ప్రభుత్వం తీసుకున్న చర్యల వివరాల్ని కోర్టు ముందు ఉంచేందుకు సమయం కోరారు. అందుకు ధర్మాసనం అంగీకరించి విచారణను బుధవారానికి వాయిదా వేసింది.

ఏపీ వార్తలు
ఏపీలో కరోనా వార్తలు

కరోనా బాధితులకు అందిస్తున్న చికిత్స, ఏర్పాట్లతో పాటు కట్టడి విషయంలో ఏపీ ప్రభుత్వాన్ని ఆ రాష్ట్ర హైకోర్టు పలు ప్రశ్నలు వేసింది. కరోనా బాధితుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో రోజుకు ఎన్ని పరీక్షలు చేస్తున్నారు, ఫలితాలు రావడానికి ఎక్కువ సమయం ఎందుకు పడుతోందని ఆరాతీసింది. సాధ్యమైనంత త్వరగా ఫలితాల్ని ప్రకటించాలని పేర్కొంది.

రాష్ట్రంలో ఆక్సిజన్‌ నిల్వలపైన, మాస్కులు, భౌతిక దూరం, ఆసుపత్రుల్లో పడకలపైన ప్రశ్నల వర్షం కురిపించింది. ప్రభుత్వ న్యాయవాది (జీపీ) సుమన్‌ స్పందిస్తూ.. ఆక్సిజన్‌ కొరత లేదన్నారు. ప్రభుత్వం జారీచేసిన జీవోలను కోర్టు ముందు ఉంచుతామన్నారు. దీనిపై విచారణను బుధవారానికి వాయిదా వేస్తూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఏకే గోస్వామి, జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం మంగళవారం ఆదేశాలిచ్చింది.

కరోనా కట్టడి విషయంలో కేంద్రం… మార్చి 23న జారీచేసిన మార్గదర్శకాల్ని రాష్ట్రంలో అమలు చేయట్లేదంటూ ఏపీ పౌరహక్కుల సంఘం సంయుక్త కార్యదర్శి బి.మోహన్‌రావు హైకోర్టులో పిల్‌ వేశారు. న్యాయవాది పొత్తూరి సురేశ్‌కుమార్‌ వాదనలు వినిపిస్తూ.. కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నా రాష్ట్రంలో పరీక్షల సంఖ్య పెంచలేదన్నారు. ఫలితాల వెల్లడిలో తీవ్రజాప్యం జరుగుతోందన్నారు. రోజుకు ఎన్ని పరీక్షలు చేస్తున్నారని ధర్మాసనం ప్రశ్నించింది. రోజుకు 75వేల పరీక్షలు చేస్తున్నట్లు ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. ఆక్సిజన్‌ నిల్వలకు కొరత ఏమైనా ఉందా? అని ప్రశ్నించగా.. రోజుకు 310 టన్నుల ఆక్సిజన్‌ ఉందన్నారు. కొరత లేదన్నారు.

మాస్కులు ధరించనివారిపై ఏం చర్యలు తీసుకున్నారు? జరిమానా ఎంత వసూలు చేస్తున్నారని ధర్మాసనం ఆరాతీసింది. రూ.100 జరిమానా వేస్తున్నామని జీపీ బదులిచ్చారు. నిజంగానే చర్యలు తీసుకుంటున్నారా? మార్గదర్శకాలు కాగితాలకే పరిమితమా అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. హోం ఐసొలేషన్‌ అవకాశం లేనివారికి ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటుచేశారా అని ప్రశ్నించింది. 'కేసులు భారీగా పెరుగుతున్న ప్రాంతాల్లో పరీక్షల సంఖ్య పెంచాలి, ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. ఈ వ్యాజ్యం ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాఖలైనదిగా భావించవద్దు. కరోనాను కట్టడి చేయడానికి వ్యవస్థ లేకపోతే కేసుల సంఖ్య భారీగా పెరుగుతుంది’ అని తెలిపింది.

కొవిడ్‌ వ్యాప్తి చెందకుండా తీసుకునే చర్యల్లో భాగంగా రాత్రివేళల్లో కర్ఫ్యూ విధించామని జీపీ అన్నారు. భవిష్యత్తు అవసరాలకు ఆక్సిజన్‌ అవసరాలపై ఓ అంచనాకు రావాలని ధర్మాసనం సూచించింది. ఆక్సిజన్‌ ప్లాంట్ల ఏర్పాటుకు గతేడాది కేంద్రం అనుమతించిన నేపథ్యంలో.. రాష్ట్రంలో ఎన్ని ఏర్పాటు చేశారని ప్రశ్నించింది. రాష్ట్రంలో ఆక్సిజన్‌ సరఫరా చేసే మూడు సంస్థలున్నాయని జీపీ బదులిచ్చారు. ఈ నెల 26న గుంటూరులో ఒక ఆక్సిజన్‌ ప్లాంటుకు అనుమతి ఇచ్చామన్నారు. ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని గతేడాది కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేస్తే.. గుంటూరులో ఒక్క ప్లాంటుకు ఇటీవల అనుమతి ఇచ్చారా? అని అసహనం వ్యక్తం చేసింది.

పరీక్ష ఫలితాలు 8-10 గంటల్లో వచ్చేలా చూడాలి

పరీక్ష ఫలితాల వెల్లడికి గతంలో 2, 3 రోజులు పట్టేదని, ప్రస్తుతం 24-36 గంటల్లో వస్తున్నాయని జీపీ తెలిపారు. అంత సమయం ఎందుకు పడుతుందని ధర్మాసనం ప్రశ్నించి.. 8-10 గంటల్లో వచ్చేలా చూడాలని తెలిపింది. జీపీ బదులిస్తూ సాధ్యమైనంత త్వరగా వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వం తీసుకున్న చర్యల వివరాల్ని కోర్టు ముందు ఉంచేందుకు సమయం కోరారు. అందుకు ధర్మాసనం అంగీకరించి, విచారణను బుధవారానికి వాయిదా వేసింది.

ఇదీ చూడండి: ప్రాణవాయువు పుష్కలం.. అందుబాటే దుర్భలం..!

కరోనా బాధితులకు అందిస్తున్న చికిత్స, ఏర్పాట్లతో పాటు కట్టడి విషయంలో ఏపీ ప్రభుత్వాన్ని ఆ రాష్ట్ర హైకోర్టు పలు ప్రశ్నలు వేసింది. కరోనా బాధితుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో రోజుకు ఎన్ని పరీక్షలు చేస్తున్నారు, ఫలితాలు రావడానికి ఎక్కువ సమయం ఎందుకు పడుతోందని ఆరాతీసింది. సాధ్యమైనంత త్వరగా ఫలితాల్ని ప్రకటించాలని పేర్కొంది.

రాష్ట్రంలో ఆక్సిజన్‌ నిల్వలపైన, మాస్కులు, భౌతిక దూరం, ఆసుపత్రుల్లో పడకలపైన ప్రశ్నల వర్షం కురిపించింది. ప్రభుత్వ న్యాయవాది (జీపీ) సుమన్‌ స్పందిస్తూ.. ఆక్సిజన్‌ కొరత లేదన్నారు. ప్రభుత్వం జారీచేసిన జీవోలను కోర్టు ముందు ఉంచుతామన్నారు. దీనిపై విచారణను బుధవారానికి వాయిదా వేస్తూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఏకే గోస్వామి, జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం మంగళవారం ఆదేశాలిచ్చింది.

కరోనా కట్టడి విషయంలో కేంద్రం… మార్చి 23న జారీచేసిన మార్గదర్శకాల్ని రాష్ట్రంలో అమలు చేయట్లేదంటూ ఏపీ పౌరహక్కుల సంఘం సంయుక్త కార్యదర్శి బి.మోహన్‌రావు హైకోర్టులో పిల్‌ వేశారు. న్యాయవాది పొత్తూరి సురేశ్‌కుమార్‌ వాదనలు వినిపిస్తూ.. కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నా రాష్ట్రంలో పరీక్షల సంఖ్య పెంచలేదన్నారు. ఫలితాల వెల్లడిలో తీవ్రజాప్యం జరుగుతోందన్నారు. రోజుకు ఎన్ని పరీక్షలు చేస్తున్నారని ధర్మాసనం ప్రశ్నించింది. రోజుకు 75వేల పరీక్షలు చేస్తున్నట్లు ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. ఆక్సిజన్‌ నిల్వలకు కొరత ఏమైనా ఉందా? అని ప్రశ్నించగా.. రోజుకు 310 టన్నుల ఆక్సిజన్‌ ఉందన్నారు. కొరత లేదన్నారు.

మాస్కులు ధరించనివారిపై ఏం చర్యలు తీసుకున్నారు? జరిమానా ఎంత వసూలు చేస్తున్నారని ధర్మాసనం ఆరాతీసింది. రూ.100 జరిమానా వేస్తున్నామని జీపీ బదులిచ్చారు. నిజంగానే చర్యలు తీసుకుంటున్నారా? మార్గదర్శకాలు కాగితాలకే పరిమితమా అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. హోం ఐసొలేషన్‌ అవకాశం లేనివారికి ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటుచేశారా అని ప్రశ్నించింది. 'కేసులు భారీగా పెరుగుతున్న ప్రాంతాల్లో పరీక్షల సంఖ్య పెంచాలి, ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. ఈ వ్యాజ్యం ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాఖలైనదిగా భావించవద్దు. కరోనాను కట్టడి చేయడానికి వ్యవస్థ లేకపోతే కేసుల సంఖ్య భారీగా పెరుగుతుంది’ అని తెలిపింది.

కొవిడ్‌ వ్యాప్తి చెందకుండా తీసుకునే చర్యల్లో భాగంగా రాత్రివేళల్లో కర్ఫ్యూ విధించామని జీపీ అన్నారు. భవిష్యత్తు అవసరాలకు ఆక్సిజన్‌ అవసరాలపై ఓ అంచనాకు రావాలని ధర్మాసనం సూచించింది. ఆక్సిజన్‌ ప్లాంట్ల ఏర్పాటుకు గతేడాది కేంద్రం అనుమతించిన నేపథ్యంలో.. రాష్ట్రంలో ఎన్ని ఏర్పాటు చేశారని ప్రశ్నించింది. రాష్ట్రంలో ఆక్సిజన్‌ సరఫరా చేసే మూడు సంస్థలున్నాయని జీపీ బదులిచ్చారు. ఈ నెల 26న గుంటూరులో ఒక ఆక్సిజన్‌ ప్లాంటుకు అనుమతి ఇచ్చామన్నారు. ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని గతేడాది కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేస్తే.. గుంటూరులో ఒక్క ప్లాంటుకు ఇటీవల అనుమతి ఇచ్చారా? అని అసహనం వ్యక్తం చేసింది.

పరీక్ష ఫలితాలు 8-10 గంటల్లో వచ్చేలా చూడాలి

పరీక్ష ఫలితాల వెల్లడికి గతంలో 2, 3 రోజులు పట్టేదని, ప్రస్తుతం 24-36 గంటల్లో వస్తున్నాయని జీపీ తెలిపారు. అంత సమయం ఎందుకు పడుతుందని ధర్మాసనం ప్రశ్నించి.. 8-10 గంటల్లో వచ్చేలా చూడాలని తెలిపింది. జీపీ బదులిస్తూ సాధ్యమైనంత త్వరగా వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వం తీసుకున్న చర్యల వివరాల్ని కోర్టు ముందు ఉంచేందుకు సమయం కోరారు. అందుకు ధర్మాసనం అంగీకరించి, విచారణను బుధవారానికి వాయిదా వేసింది.

ఇదీ చూడండి: ప్రాణవాయువు పుష్కలం.. అందుబాటే దుర్భలం..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.