ETV Bharat / state

కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఏపీ ప్రభుత్వం లేఖ - ఏపీకి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కార్యాలయం

అపెక్స్​ కౌన్సిల్​ భేటీలో నిర్ణయానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఏపీ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లేఖ రాశారు. విశాఖకు బోర్టు కార్యాలయాన్ని తరలించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.

KRMB
కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఏపీ లేఖ
author img

By

Published : Jan 3, 2021, 10:15 AM IST

కృష్ణానదీ యాజమాన్య బోర్డును విశాఖకు తరలించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బోర్డుకు ఏపీ సర్కార్ లేఖ రాసింది. అక్టోబర్ ఆరో తేదీన జరిగిన రెండో అత్యున్నత మండలి సమావేశం నిర్ణయానికి అనుగుణంగా.. విశాఖలో ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపింది.

కృష్ణాబోర్డు ప్రధాన కార్యాలయం కోసం వసతి చూడాలని ఏపీ జలవనరుల శాఖ ఇప్పటికే ఈఎన్సీనీ ఆదేశించినట్లు తెలిపింది. వసతి గుర్తింపు పూర్తయ్యాక బోర్డుకు సమాచారం ఇస్తామని లేఖలో పేర్కొంది. ఈ మేరకు బోర్డు సభ్య కార్యదర్శికి ఏపీ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లేఖ రాశారు.

కృష్ణానదీ యాజమాన్య బోర్డును విశాఖకు తరలించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బోర్డుకు ఏపీ సర్కార్ లేఖ రాసింది. అక్టోబర్ ఆరో తేదీన జరిగిన రెండో అత్యున్నత మండలి సమావేశం నిర్ణయానికి అనుగుణంగా.. విశాఖలో ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపింది.

కృష్ణాబోర్డు ప్రధాన కార్యాలయం కోసం వసతి చూడాలని ఏపీ జలవనరుల శాఖ ఇప్పటికే ఈఎన్సీనీ ఆదేశించినట్లు తెలిపింది. వసతి గుర్తింపు పూర్తయ్యాక బోర్డుకు సమాచారం ఇస్తామని లేఖలో పేర్కొంది. ఈ మేరకు బోర్డు సభ్య కార్యదర్శికి ఏపీ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లేఖ రాశారు.

ఇవీచూడండి: కుమారుడి ప్రోద్బలంతో సేంద్రియ సాగు.. లాభాలు బాగు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.