Anti Congress Posters Hyderabad : హైదరాబాద్లో సీడబ్ల్యూసీ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే.. కాంగ్రెస్ తీరుపై నగరంలో (Anti Congress Posters) గోడ పత్రికలు వెలిశాయి. హస్తం పార్టీ పాలిత రాష్ట్రాల్లో ఉన్న పథకాలు.. తెలంగాణలో అమలవుతున్న పథకాలను పోల్చుతూ వాల్ పోస్టర్లను అతికించారు. కరప్ట్ కాంగ్రెస్ మోడల్.. కరెక్ట్ బీఆర్ఎస్ మోడల్ అంటూ అందులో పేర్కొన్నారు. దళితబంధు, రైతు బంధు, రైతు బీమా, వృద్ధులు, వికలాంగుల పింఛన్ల గురించి వివరిస్తూ పోస్టర్లను రూపొందించారు.
Posters on BRS and Congress Difference : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న హామీలకు.. ఆ పార్టీ అధికారంలో ఉన్న ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న పథకాలకు పొంతన లేదంటూ ( BRS and Congress Difference) ఆ పోస్టర్లలో పేర్కొన్నారు. దళితులకు ఆర్థిక సాయం గురించి పేర్కొంటూ.. హస్తం పాలిత రాష్ట్రాలైన ఛత్తీస్గడ్, హిమాచల్ప్రదేశ్, కర్ణాటక, రాజస్థాన్లో లేదని.. ఇక్కడ తెలంగాణలో రూ.10 లక్షలు ఇస్తున్నామని గోడ పత్రికల్లో ముద్రించారు. వికలాంగులకు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన ఛత్తీస్గఢ్లో రూ.500, హిమాచల్ప్రదేశ్లో రూ.1300, కర్ణాటకలో రూ.1100, రాజస్థాన్లో రూ.1250 చొప్పున పింఛన్ ఇస్తుంటే.. తెలంగాణలో మాత్రం రూ.4116 ఇస్తున్నట్లు అందులో తెలిపారు.
Poster War in Hyderabad Amid CWC Meeting : అలాగే వృద్ధుల పింఛన్ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన ఛత్తీస్గడ్లో రూ.500, హిమాచల్ప్రదేశ్లో రూ.750 నుంచి రూ.1250, కర్ణాటకలో రూ.1000, రాజస్థాన్లో రూ.1000 నుంచి రూ.1250 వరకు ఇస్తున్నారని.. తెలంగాణలో మాత్రం రూ.2016 అందిస్తున్నామంటూ పోస్టర్లలో తెలిపారు. రైతులకు బీమా పథకం గురించి తెలుపుతూ.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో సున్నా అయితే.. రాష్ట్రంలో రూ.5 లక్షలు ఇస్తున్నామని వివరించారు.
అన్నదాతలకు పెట్టుబడి సాయంగా తెలంగాణలో ఎకరానికి ఏడాదికి రూ.10,000 ఇస్తున్నట్లు పేర్కొన్నారు. రైతులకు ఉచిత విద్యుత్ గురించి తెలుపుతూ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన ఛత్తీస్గడ్, హిమాచల్ప్రదేశ్, కర్ణాటక, రాజస్థాన్లో లేదని.. తెలంగాణలో 24 గంటల పాటు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని గోడ పత్రికల్లో వివరించారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Congress Vijayabheri Sabha Today : తుక్కుగూడ వేదికగా.. నేడు కాంగ్రెస్ ఎన్నికల సమర శంఖం
CWC Meeting Hyderabad 2023 : మరోవైపు నిన్నటి సమావేశానికి కొనసాగింపుగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ విస్తృత స్థాయి సమావేశాలు రెండో రోజూ జరుగుతున్నాయి. సీడబ్ల్యూసీ సభ్యులతో పాటు పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కు పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో 5 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంపై చర్చలు జరుపుతున్నారు. రాజస్థాన్, ఛత్తీస్గడ్ ఫార్ములాను దేశ వ్యాప్తంగా ప్రచారం చేయాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సూచించారు. 5 రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్కు గెలుపు అవకాశాలు ఎక్కువ ఉన్నాయని.. నేతలు ఐక్యంగా ఉంటే వచ్చే ఫలితాలు కర్ణాటకలో చూపించామని చెప్పారు. అన్ని రాష్ట్రాల్లో నేతలంతా ఐక్యమత్యంగా పని చేయాలని మల్లికార్జున ఖర్గే కోరారు.
"రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ఫార్ములాను దేశ వ్యాప్తంగా ప్రచారం చేయాలి. 5 రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్కు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నేతలు ఐక్యంగా ఉంటే వచ్చే ఫలితాలు కర్ణాటకలో చూపించాం. అన్ని రాష్ట్రాల్లో నేతలంతా ఐక్యంగా పని చేయాలి." - మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ అధ్యక్షుడు
Pawan Khera On Telangana Elections 2023 : 'ఎవరి మద్దతూ లేకుండా.. తెలంగాణలో గెలిచి చూపిస్తాం'