ప్రభుత్వ రంగంలోని పది బ్యాంకుల భారీ విలీనం బుధవారం నుంచి అమల్లోకి వచ్చింది. ఫలితంగా ఆంధ్రా బ్యాంక్ సహా ఆరు బ్యాంకులు కనుమరుగయ్యాయి. హైదరాబాద్ సైఫాబాద్లోని ఆంధ్రాబ్యాంక్ ప్రధాన కార్యాలయ బోర్డును... యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మార్చారు. దేశ వ్యాప్తంగా ఓ వైపు కొవిడ్-19 మహమ్మారిని కట్టడి చేసేందుకు లాక్ డౌన్ అమలవుతోంది.
అంతర్జాతీయ స్థాయి పోటీ కోసమే...
మరో వైపు విలీన ప్రక్రియను ప్రణాళికబద్ధంగానే అమలు చేస్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. అంతర్జాతీయ స్థాయిలో పోటీపడగలిగే భారీ బ్యాంకులను ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతోనే కేంద్రం ఈ చర్యలకు పూనుకుంది. అందుకు అనుగుణంగానే ప్రభుత్వ రంగంలో బ్యాంకుల విలీనానికి తెరతీసింది భారత సర్కారు. ప్రభుత్వ రంగంలో ఎస్బీఐ తర్వాత దేశంలోనే రెండో అతి పెద్ద బ్యాంకుగా పీఎన్బీ ఆవిర్భవించింది.