ETV Bharat / state

379వ రోజుకు చేరిన అమరావతి రైతుల ఆందోళనలు

author img

By

Published : Dec 30, 2020, 10:02 PM IST

అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలే తప్ప రాజధానులు విభజించడం సరికాదని.. ఏపీ మేధావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. అమరావతే ఏపీ రాజధానిగా కొనసాగాలని రైతులు చేపట్టిన దీక్ష 379వ రోజు చేరింది. రైతులు నిరసన దీక్షకు ఆయన మద్దతు ప్రకటించారు.

amaravathi
379వ రోజుకు చేరిన అమరావతి రైతుల ఆందోళనలు

అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలే తప్ప రాజధానులు విభజించడం సరికాదని.. ఏపీ మేధావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. ఏపీ పరిపాలన రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న ఆందోళన 379వ రోజుకు చేరింది. ఈ దీక్షకు ఆయన మద్దతు ప్రకటించారు.

మందడం, వెలగపూడి, తుళ్లూరు, వెంకటపాలెంలోని దీక్షా శిబిరాలలో రైతులతో కలిసి అమరావతికి మద్దతుగా నినాదాలు చేశారు. గత ప్రభుత్వం అమరావతిలో లక్షకోట్ల సంపద సృష్టించిందని.. వాటితో ఏపీని అభివృద్ధి చేయవచ్చని చలసాని అన్నారు. కేంద్ర ప్రభుత్వమే ఏపీకి అన్యాయం చేస్తోందని ఆరోపించారు.

ఏపీ రాజధాని కోసం సుమారు 110 మందికిపైగా ప్రాణాలొదిలితే.. సీఎం జగన్​ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. రాజధానిని శ్మశానంతో పోల్చిన నేతలు.. ఈ ప్రాంతంలో పేదలకు భూములు ఎలా ఇస్తారని నిలదీశారు.

ఇవీచూడండి: అమరావతికి 20 ఎకరాలు ఇచ్చిన రైతు కన్నుమూత

అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలే తప్ప రాజధానులు విభజించడం సరికాదని.. ఏపీ మేధావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. ఏపీ పరిపాలన రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న ఆందోళన 379వ రోజుకు చేరింది. ఈ దీక్షకు ఆయన మద్దతు ప్రకటించారు.

మందడం, వెలగపూడి, తుళ్లూరు, వెంకటపాలెంలోని దీక్షా శిబిరాలలో రైతులతో కలిసి అమరావతికి మద్దతుగా నినాదాలు చేశారు. గత ప్రభుత్వం అమరావతిలో లక్షకోట్ల సంపద సృష్టించిందని.. వాటితో ఏపీని అభివృద్ధి చేయవచ్చని చలసాని అన్నారు. కేంద్ర ప్రభుత్వమే ఏపీకి అన్యాయం చేస్తోందని ఆరోపించారు.

ఏపీ రాజధాని కోసం సుమారు 110 మందికిపైగా ప్రాణాలొదిలితే.. సీఎం జగన్​ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. రాజధానిని శ్మశానంతో పోల్చిన నేతలు.. ఈ ప్రాంతంలో పేదలకు భూములు ఎలా ఇస్తారని నిలదీశారు.

ఇవీచూడండి: అమరావతికి 20 ఎకరాలు ఇచ్చిన రైతు కన్నుమూత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.