ETV Bharat / state

లాక్​డౌన్​పై వస్తోన్న వార్తలన్నీ అవాస్తవం: డా.శ్రీనివాస్

author img

By

Published : Apr 28, 2021, 10:50 PM IST

రాష్ట్రంలో లాక్​డౌన్​పై పలు ఎలక్ట్రానిక్‌, సోషల్‌ మీడియాల్లో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు డా.శ్రీనివాస్‌ స్పష్టం చేశారు. వైద్యారోగ్య శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి అటువంటి ప్రతిపాదనలు పంపినట్లు వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని వివరించారు.

రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు డా.శ్రీనివాస్‌
రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు డా.శ్రీనివాస్‌

రాష్ట్రంలో లాక్‌డౌన్‌ విధించాలని వైద్యారోగ్య శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు పలు ఎలక్ట్రానిక్‌, సోషల్‌ మీడియాల్లో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు డా.శ్రీనివాస్‌ స్పష్టం చేశారు. వైద్యారోగ్య శాఖ అటువంటి ప్రతిపాదనలేమీ రాష్ట్ర ప్రభుత్వానికి పంపలేదని చెప్పారు. ప్రస్తుతం తెలంగాణ‌లో కొవిడ్ కేసుల పెరుగుద‌ల‌ స్థిరంగా ఉందన్నారు.

ప్రజలు ఇలాగే ప్రభుత్వానికి సహకరిస్తూ జాగ్రత్తలు పాటిస్తే.. మ‌రో మూడు, నాలుగు వారాల్లో వైర‌స్ అదుపులోకి వ‌స్తుందని తెలిపారు. అందువల్ల రాష్ట్రంలో లాక్‌డౌన్ పెట్టాల‌నే ఆలోచ‌న కానీ, ప్రతిపాదనలు కానీ ఏమీ ఇవ్వలేదన్నారు. క‌నీసం అటువంటి ఉద్దేశం కూడా వైద్యారోగ్య శాఖ‌కు లేదని డా.శ్రీనివాస్‌ స్పష్టం చేశారు.

రాష్ట్రంలో లాక్‌డౌన్‌ విధించాలని వైద్యారోగ్య శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు పలు ఎలక్ట్రానిక్‌, సోషల్‌ మీడియాల్లో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు డా.శ్రీనివాస్‌ స్పష్టం చేశారు. వైద్యారోగ్య శాఖ అటువంటి ప్రతిపాదనలేమీ రాష్ట్ర ప్రభుత్వానికి పంపలేదని చెప్పారు. ప్రస్తుతం తెలంగాణ‌లో కొవిడ్ కేసుల పెరుగుద‌ల‌ స్థిరంగా ఉందన్నారు.

ప్రజలు ఇలాగే ప్రభుత్వానికి సహకరిస్తూ జాగ్రత్తలు పాటిస్తే.. మ‌రో మూడు, నాలుగు వారాల్లో వైర‌స్ అదుపులోకి వ‌స్తుందని తెలిపారు. అందువల్ల రాష్ట్రంలో లాక్‌డౌన్ పెట్టాల‌నే ఆలోచ‌న కానీ, ప్రతిపాదనలు కానీ ఏమీ ఇవ్వలేదన్నారు. క‌నీసం అటువంటి ఉద్దేశం కూడా వైద్యారోగ్య శాఖ‌కు లేదని డా.శ్రీనివాస్‌ స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: సీఎం కేసీఆర్‌కు కరోనా నెగెటివ్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.