ETV Bharat / state

లోక్​సభ ఎన్నికలకు సిద్ధం

గత అనుభవాల దృష్ట్యా ఓటర్ల జాబితాపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. లోక్​సభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లు ఈసీ పేర్కొంది.

author img

By

Published : Mar 2, 2019, 6:14 AM IST

ఎన్నికల నిర్వహణ, ఈవీఎం, వీవీప్యాట్​ల వినియోగం పై అవగాహన సదస్సు

ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాలు సరిగ్గానే పనిచేస్తున్నాయని, వీటిపై అపోహలు అక్కర్లేదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. లోక్​సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎన్నికల నిర్వహణ, సంబంధిత అంశాలపై ఈసీ హైదరాబాద్​లో కార్యశాల నిర్వహించింది.

ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ, ఎన్నికల నిర్వహణ, ఈవీఎం, వీవీప్యాట్​ల వినియోగం, చెల్లింపు వార్తలు, ఐటీ అప్లికేషన్స్ వినియోగం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి, ఖర్చులపై నిబంధనల ప్రకారం నడుచుకుంటామని అధికారులు తెలిపారు.

శాసనసభ ఎన్నికలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ వెల్లడించారు.
జీహెచ్ఎంసీ పరిధిలో ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని ప్రత్యేక శ్రద్ధతో నిర్వహిస్తామని కమిషనర్ దానకిషోర్ తెలిపారు.

ఆధునిక సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎన్నికల నిర్వహణలో విరివిగా వినియోగిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంయుక్త ప్రధానాధికారి అమ్రపాలి తెలిపారు.

లోక్​సభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహిస్తాం : ఈసీ

ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాలు సరిగ్గానే పనిచేస్తున్నాయని, వీటిపై అపోహలు అక్కర్లేదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. లోక్​సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎన్నికల నిర్వహణ, సంబంధిత అంశాలపై ఈసీ హైదరాబాద్​లో కార్యశాల నిర్వహించింది.

ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ, ఎన్నికల నిర్వహణ, ఈవీఎం, వీవీప్యాట్​ల వినియోగం, చెల్లింపు వార్తలు, ఐటీ అప్లికేషన్స్ వినియోగం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి, ఖర్చులపై నిబంధనల ప్రకారం నడుచుకుంటామని అధికారులు తెలిపారు.

శాసనసభ ఎన్నికలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ వెల్లడించారు.
జీహెచ్ఎంసీ పరిధిలో ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని ప్రత్యేక శ్రద్ధతో నిర్వహిస్తామని కమిషనర్ దానకిషోర్ తెలిపారు.

ఆధునిక సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎన్నికల నిర్వహణలో విరివిగా వినియోగిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంయుక్త ప్రధానాధికారి అమ్రపాలి తెలిపారు.

లోక్​సభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహిస్తాం : ఈసీ
Intro:కార్యాలయానికి యజమాని తాళం వేయడం లో మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల లోని ఐ సి డి ఎస్ సిబ్బంది ఇబ్బందులు పడుతూ ఆరుబయట విధులు నిర్వహించాల్సి వచ్చింది గత కొన్ని రోజులుగా భవనాన్ని ఖాళీ చేయాలని యజమాని సూచించిన ఇతర చోట భవనం దొరకక ఖాళీ చేయకపోవడంతో ఈ పరిస్థితి నెలకొన్నది


Body:జడ్చర్ల లోని ఇందిరా నగర్ లో నిర్వహిస్తున్న సమగ్ర శిశు సంరక్షణ పథకం ప్రాజెక్టు కార్యాలయం ఆ భవనంలో కొనసాగుతున్నది గత రెండేళ్లుగా తన భవనాన్ని ఖాళీ చేయాలని అగ్రిమెంట్ పూర్తయిన తర్వాత వేరే చోట భవనం చూసుకోవాలని యజమాని సూచించారు కానీ ప్రభుత్వం చెల్లించే సరైన భవనాలు దొరకకపోవడం కార్యాలయాన్ని మార్చలేని పరిస్థితి ఏర్పడింది ప్రజా ప్రతినిధులు కూడా పట్టించుకోకపోవడంతో ఐసిడిఎస్ కార్యాలయానికి లేకుండా పోయింది గుర్తించకుండా చేయడం లేదని ఉదయం కార్యాలయానికి తాళం వేశారు దీంతో నాలుగు మండలాలకు చెందిన సూపర్వైజర్లు ఇతర కార్యాలయ సిబ్బంది ఆరుబయట కూర్చొని విధులు నిర్వహించారు


Conclusion:యజమాని తాళం వేయడంతో సమాచారం తెలుసుకున్న జడ్చర్ల సర్పంచి బుక్క వెంకటేశం ఐసిడిఎస్ అధికారిని యజమాని తో చర్చించగా ఎట్టకేలకు ఆయన తాళం తెరిచారు కానీ కొన్ని గంటల వరకు సిబ్బంది బయటనే ఉండాల్సి వచ్చింది
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.