ETV Bharat / state

'ఐఏఎస్​లే రాజకీయ నాయకుల్లా వ్యవహరిస్తే'

author img

By

Published : Nov 17, 2019, 4:11 PM IST

కార్మికుల సమ్మెపై హైకోర్టులో ఆర్టీసీ ఎండీ దాఖలు చేసిన అఫిడవిట్​ను అన్ని రాజకీయ పార్టీలు ఖండిస్తున్నాయని తెతెదేపా అధ్యక్షుడు ఎల్​.రమణ అన్నారు. ఐఏఎస్​ అధికారి రాజకీయ నేతగా వ్యవహరించడం సరికాదని మండిపడ్డారు.

'ఐఏఎస్​లే రాజకీయ నాయకుల్లా వ్యవహరిస్తే'
'ఐఏఎస్​లే రాజకీయ నాయకుల్లా వ్యవహరిస్తే'

44 రోజులుగా కార్మికులు తమ సమస్యలపై పోరాడుతుంటే ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని తెతెదేపా అధ్యక్షుడు ఎల్.రమణ ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్​ ముషీరాబాద్​లోని రిసాల్​గడ్డలో స్టాఫ్​ అండ్​ వర్కర్స్​ ఫెడరేషన్​ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగమూర్తి నిరాహార దీక్షకు సంఘీభావం తెలిపారు.

దీక్షా శిబిరాన్ని ఎల్​.రమణతో పాటు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, తెజస అధ్యక్షుడు కోదండరాం, భాజపా ఎమ్మెల్సీ మోహన్ రెడ్డి సందర్శించారు. లింగమూర్తి దీక్షకు మద్దతునిచ్చారు.

కార్మికుల పక్షాన వ్యవహరించాల్సిన ఆర్టీసీ ఇంఛార్జీ ఎండీ రాజకీయ నాయకుడిగా వ్యవహరించారని తమ్మినేని మండిపడ్డారు. ఇళ్లలోనే దీక్షలు చేస్తున్న ఆర్టీసీ నేతలను అక్రమంగా అరెస్టు చేస్తున్నారని కోదండరాం అన్నారు. ఈనెల 19న నిర్వహించనున్న సడక్​ బంద్ యథావిథిగా కొనసాగుతుందని స్పష్టం చేశారు.

'ఐఏఎస్​లే రాజకీయ నాయకుల్లా వ్యవహరిస్తే'

44 రోజులుగా కార్మికులు తమ సమస్యలపై పోరాడుతుంటే ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని తెతెదేపా అధ్యక్షుడు ఎల్.రమణ ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్​ ముషీరాబాద్​లోని రిసాల్​గడ్డలో స్టాఫ్​ అండ్​ వర్కర్స్​ ఫెడరేషన్​ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగమూర్తి నిరాహార దీక్షకు సంఘీభావం తెలిపారు.

దీక్షా శిబిరాన్ని ఎల్​.రమణతో పాటు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, తెజస అధ్యక్షుడు కోదండరాం, భాజపా ఎమ్మెల్సీ మోహన్ రెడ్డి సందర్శించారు. లింగమూర్తి దీక్షకు మద్దతునిచ్చారు.

కార్మికుల పక్షాన వ్యవహరించాల్సిన ఆర్టీసీ ఇంఛార్జీ ఎండీ రాజకీయ నాయకుడిగా వ్యవహరించారని తమ్మినేని మండిపడ్డారు. ఇళ్లలోనే దీక్షలు చేస్తున్న ఆర్టీసీ నేతలను అక్రమంగా అరెస్టు చేస్తున్నారని కోదండరాం అన్నారు. ఈనెల 19న నిర్వహించనున్న సడక్​ బంద్ యథావిథిగా కొనసాగుతుందని స్పష్టం చేశారు.

Intro:ఆర్టీసీ కార్మికుల సమ్మె లో భాగంగా ఆర్టీసీ ఎస్ డబ్ల్యూ ఎఫ్ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఇ చేపట్టిన దీక్షా శిబిరాన్ని అన్ని రాజకీయ పార్టీల నేతలు సందర్శించి సంఘీభావం ప్రకటించారు....


Body:ఆర్టీసీ కార్మికుల సమస్యలపై స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇ లింగమూర్తి నిరాహార దీక్ష చేపట్టారు హైదరాబాద్ ముషీరాబాద్ రిసలగడ్డ లోని యూనియన్ కార్యాలయంలో చేస్తున్న దీక్షా శిబిరాన్ని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ,, పొలిట్బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్,, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం,, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం,,, బిజెపి నేత మాజీ ఎమ్మెల్సీ మోహన్ రెడ్డి,, సిపిఐ నాయకుడు డాక్టర్ సుధాకర్,, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు పెద్ద ఎత్తున విచ్చేసి సంఘీభావం ప్రకటించారు. ఆర్టీసీ సమ్మె పై కోర్టులో ఆర్టీసీ ఇంచార్జ్ ఎండి దాఖలు చేసిన అఫిడవిట్ పై అన్ని రాజకీయ పార్టీల నాయకులు తీవ్రంగా మండిపడ్డారు... ఐఏఎస్ అధికారి రాజకీయ నాయకుడిగా వ్యవహరించడం రాజకీయ చరిత్రలో లేదని సిగ్గుచేటని వారు ఆక్షేపణ వ్యక్తం చేశారు..... 44 రోజులుగా కార్మికులు తమ సమస్యల సాధన కోసం పోరాటం చేస్తుంటే ప్రభుత్వం స్పందించకపోవడం భావ్యం కాదని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు రమణ ఆందోళన వ్యక్తం చేశారు కెసిఆర్ నియంతృత్వ పోకడల ఆయన పేర్కొన్నారు..... ఆర్టీసీ సమ్మె పై ఆర్టిసి ఇంచార్జ్ ఎండి కోర్టుకు దాఖలు చేసిన అఫిడవిట్లో తో ప్రభుత్వ వైఖరి ఐఏఎస్ అధికారుల విధానం ఏమిటో స్పష్టమైందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు కార్మికుల పక్షాన వ్యవహరించాల్సిన ఆర్టీసీ ఇంచార్జ్ ఎండి ప్రభుత్వ అధికారిగా కాకుండా రాజకీయ నాయకుల నోటిమాటగా మారానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఈ వైఖరి అని డిమాండ్ చేశారు..... ఆర్టీసీ కార్మికుల సమ్మె అంశంపై ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ చేపట్టిన సమ్మె 44వ రోజుకు చేరిన ప్రభుత్వంలో చలనం లేదని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం అన్నారు ఆర్టీసీ కన్వీనర్ అశ్వద్ధామ రెడ్డి,,, కోకన్వీనర్ రాజిరెడ్డి ,,,లింగమూర్తి యూనియన్ కార్యాలయం ఇళ్లల్లో దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం వారిపై ఏకపక్షంగా వ్యవహరిస్తూ అరెస్టు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు ఈనెల 19వ తేదీన నిర్వహించ తలపెట్టిన బంద్ కార్యక్రమం యధావిధిగా కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.......
ఇదిలా ఉండగా దీక్షా శిబిరాన్ని సందర్శించి తిరిగి వెళుతున్న టిడిపి,, సిపిఎంnn బిజెపి,, తెలంగాణ జన సమితి నేతలను ను బెల్లం ఇవ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు పోలీసు బలగాలను పెద్ద ఎత్తున తీసుకు వచ్చే వరకు ఆయన నాయకులను మాయమాటలతో ఆపి చివరకు అరెస్టు చేస్తామని నాయకులతో సంప్రదింపులు చేశారు... తాము ఇళ్లకు వెళ్దామని ఇచ్చిన హామీ అనంతరం పోలీసులు వారిని పంపారు....


బైట్........ ఎల్ రమణ టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు
బైట్........ తమ్మినేని వీరభద్రం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి
బైట్......... కోదండరామ్ తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు


Conclusion:దీక్షా శిబిరాన్ని సందర్శించి దానికి వచ్చిన అన్ని రాజకీయ పార్టీల నాయకులను పోలీసులు అడ్డుకోవడం కొద్దిసేపు స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.