ETV Bharat / state

Air Passenger Statistics: విమానాల్లో తెగ తిరిగేస్తున్నారు.. ఆ వివరాలు ఇవే..!

author img

By

Published : Nov 2, 2021, 11:23 AM IST

Updated : Nov 2, 2021, 11:47 AM IST

తెలుగు రాష్ట్రాల నుంచి విమాన ప్రయాణికుల సంఖ్య సెప్టెంబర్ నెలలో భారీగా పెరిగింది( Air Passenger Statistics). ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్ వరకు విమాన ప్రయాణాలు రెట్టింపునకు మించాయి. హైదరాబాద్‌, విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం విమానాశ్రయాల నుంచి జరిగిన రాకపోకలు పెరగగా, కడప నుంచి ప్రయాణాలు భారీగా పడిపోయాయి.

Air Passenger Statistics, Air Passengers increased in telugu states
విమాన ప్రయాణికుల సంఖ్యలో పెరుగుదల, తెలంగాణలో విమాన ప్రయాణికుల సంఖ్య

తెలుగు రాష్ట్రాల నుంచి విమానాల్లో ప్రయాణించిన స్వదేశీ, విదేశీ ప్రయాణికుల సంఖ్య(Air Passenger Statistics) సెప్టెంబర్ నెలలో భారీగా పెరిగింది. గతేడాది సెప్టెంబర్ నెలలో రెండు రాష్ట్రాల నుంచి 7,87,547 మంది ప్రయాణించగా... ఈ ఏడాది సెప్టెంబర్​లో ఏకంగా 12,67,969 మంది ప్రయాణించినట్లు ఎయిర్‌ పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా ప్రకటించిన గణాంకాలు(Air Passenger Statistics) స్పష్టం చేస్తున్నాయి. అదేవిధంగా ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్ వరకు తీసుకుంటే గత ఏడాదిలో 22,71,976 మంది మాత్రమే ప్రయాణాలు చేయగా... ఈసారి అదే ఆరు నెలల్లో ఏకంగా 54,01,042 మంది ప్రయాణించారు. గతేడాది కంటే ఈ ఏడాది ప్రయాణికుల సంఖ్య రెట్టింపునకు మించింది.

వివరాలు ఇలా..

రెండు రాష్ట్రాల్లోని విమానాశ్రయాల వారీగా ప్రయాణికుల వివరాలను( Air Passenger Statistics) పరిశీలించినట్లయితే...శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి గతేడాది సెప్టెంబర్ నెలలో 38,324 మంది విదేశాలకు రాకపోకలు సాగించారు. ఈ ఏడాది అదే నెలలో 1,15,000 మంది ప్రయాణించారు. విశాఖపట్నం నుంచి అయితే.. విదేశీ ప్రయాణాలు 5మంది మాత్రమే చేయగా... విజయవాడ నుంచి 2,815 మంది ప్రయాణించినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. శంషాబాద్‌ అంతర్జాతీయ ఎయిర్​పోర్టు నుంచి గత సంవత్సరం 1,06,821 మందికాగా... ఈ ఏడాది అదే ఆరు నెలల్లో ఏకంగా 4,18,979 మంది ప్రయాణించారు.

పెరుగుదల

స్వదేశీ ప్రయాణాలు తీసుకుంటే... శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంతోపాటు విశాఖపట్నం, విజయవాడ విమానాశ్రయాల నుంచి ప్రయాణం చేసిన వారి సంఖ్య అంతకు ముందు ఏడాది సెప్టెంబర్​తో పోలిస్తే పెరిగింది. శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టు నుంచి 9,11,835 మంది, విశాఖపట్నం నుంచి 1,30,719 మంది, తిరుపతి నుంచి 56,308 మంది, విజయవాడ నుంచి 48,035 మంది ప్రయాణించారు. అదే విధంగా కర్నూలు నుంచి 2,569 మంది... కడప నుంచి కేవలం 583 మంది మాత్రమే ప్రయాణించారు. కడప విమానాశ్రయం నుంచి ప్రయాణించిన వారి సంఖ్య గతేడాది ఇదే నెలతో పోల్చితే భారీగా పడిపోయింది.

గణాంకాలు

సెప్టెంబర్ నెలలో అంతర్జాతీయ విమానాల రాకపోకలు 58 శాతానికి పైగా... స్వదేశీ విమాన రాకపోకలు 50 శాతానికిపైగా పెరిగినట్లు ఎయిర్‌ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా వెల్లడించింది. గత ఏడాది సెప్టెంబర్ నెలలో దేశీయ, విదేశీయ విమానాల రాకపోకల సంఖ్యను చూసినట్లయితే అంతకు ముందు ఏడాదిలో 97,125 ఉండగా... ఈ ఏడాది 1,46,849 విమాన రాకపోకలు సాగాయి. సరుకు రవాణాలో తీసుకుంటే అంతర్జాతీయంగా 18శాతానికిపైగా... దేశీయంగా 10శాతానికిపైగా వృద్ధి నమోదు చేసింది.

ఇదీ చదవండి: telangana news today: ‘ఇంజినీరింగ్‌’ పార్కులకు పెద్దపీట.. ఆ జిల్లాల్లో ఏర్పాటుకు ప్రభుత్వ నిర్ణయం

తెలుగు రాష్ట్రాల నుంచి విమానాల్లో ప్రయాణించిన స్వదేశీ, విదేశీ ప్రయాణికుల సంఖ్య(Air Passenger Statistics) సెప్టెంబర్ నెలలో భారీగా పెరిగింది. గతేడాది సెప్టెంబర్ నెలలో రెండు రాష్ట్రాల నుంచి 7,87,547 మంది ప్రయాణించగా... ఈ ఏడాది సెప్టెంబర్​లో ఏకంగా 12,67,969 మంది ప్రయాణించినట్లు ఎయిర్‌ పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా ప్రకటించిన గణాంకాలు(Air Passenger Statistics) స్పష్టం చేస్తున్నాయి. అదేవిధంగా ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్ వరకు తీసుకుంటే గత ఏడాదిలో 22,71,976 మంది మాత్రమే ప్రయాణాలు చేయగా... ఈసారి అదే ఆరు నెలల్లో ఏకంగా 54,01,042 మంది ప్రయాణించారు. గతేడాది కంటే ఈ ఏడాది ప్రయాణికుల సంఖ్య రెట్టింపునకు మించింది.

వివరాలు ఇలా..

రెండు రాష్ట్రాల్లోని విమానాశ్రయాల వారీగా ప్రయాణికుల వివరాలను( Air Passenger Statistics) పరిశీలించినట్లయితే...శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి గతేడాది సెప్టెంబర్ నెలలో 38,324 మంది విదేశాలకు రాకపోకలు సాగించారు. ఈ ఏడాది అదే నెలలో 1,15,000 మంది ప్రయాణించారు. విశాఖపట్నం నుంచి అయితే.. విదేశీ ప్రయాణాలు 5మంది మాత్రమే చేయగా... విజయవాడ నుంచి 2,815 మంది ప్రయాణించినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. శంషాబాద్‌ అంతర్జాతీయ ఎయిర్​పోర్టు నుంచి గత సంవత్సరం 1,06,821 మందికాగా... ఈ ఏడాది అదే ఆరు నెలల్లో ఏకంగా 4,18,979 మంది ప్రయాణించారు.

పెరుగుదల

స్వదేశీ ప్రయాణాలు తీసుకుంటే... శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంతోపాటు విశాఖపట్నం, విజయవాడ విమానాశ్రయాల నుంచి ప్రయాణం చేసిన వారి సంఖ్య అంతకు ముందు ఏడాది సెప్టెంబర్​తో పోలిస్తే పెరిగింది. శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టు నుంచి 9,11,835 మంది, విశాఖపట్నం నుంచి 1,30,719 మంది, తిరుపతి నుంచి 56,308 మంది, విజయవాడ నుంచి 48,035 మంది ప్రయాణించారు. అదే విధంగా కర్నూలు నుంచి 2,569 మంది... కడప నుంచి కేవలం 583 మంది మాత్రమే ప్రయాణించారు. కడప విమానాశ్రయం నుంచి ప్రయాణించిన వారి సంఖ్య గతేడాది ఇదే నెలతో పోల్చితే భారీగా పడిపోయింది.

గణాంకాలు

సెప్టెంబర్ నెలలో అంతర్జాతీయ విమానాల రాకపోకలు 58 శాతానికి పైగా... స్వదేశీ విమాన రాకపోకలు 50 శాతానికిపైగా పెరిగినట్లు ఎయిర్‌ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా వెల్లడించింది. గత ఏడాది సెప్టెంబర్ నెలలో దేశీయ, విదేశీయ విమానాల రాకపోకల సంఖ్యను చూసినట్లయితే అంతకు ముందు ఏడాదిలో 97,125 ఉండగా... ఈ ఏడాది 1,46,849 విమాన రాకపోకలు సాగాయి. సరుకు రవాణాలో తీసుకుంటే అంతర్జాతీయంగా 18శాతానికిపైగా... దేశీయంగా 10శాతానికిపైగా వృద్ధి నమోదు చేసింది.

ఇదీ చదవండి: telangana news today: ‘ఇంజినీరింగ్‌’ పార్కులకు పెద్దపీట.. ఆ జిల్లాల్లో ఏర్పాటుకు ప్రభుత్వ నిర్ణయం

Last Updated : Nov 2, 2021, 11:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.