ETV Bharat / state

నిలకడగా రజనీకాంత్​ ఆరోగ్యం... నేడు మరికొన్ని వైద్య పరీక్షలు

author img

By

Published : Dec 26, 2020, 4:50 AM IST

అధిక రక్తపోటుతో అస్వస్థతకు గురికావడం వల్ల ప్రముఖ నటుడు రజనీకాంత్​ హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చేరారు. ఆయనకు రక్తపోటులో హెచ్చతగ్గులు ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఆయన మరో మరో రెండు రోజులపాటు ఆస్పత్రిలోనే చికిత్స తీసుకోనున్నారు.

నిలకడగా రజనీకాంత్​ ఆరోగ్యం... నేడు మరికొన్ని వైద్య పరీక్షలు
నిలకడగా రజనీకాంత్​ ఆరోగ్యం... నేడు మరికొన్ని వైద్య పరీక్షలు

అనారోగ్యంతో హైదరాబాద్​ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ నటుడు రజనీకాంత్​ ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి ప్రకటన విడుదల చేసింది. ఆయనకు రక్తపోటులో హెచ్చుతగ్గులు ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ మేరకు శనివారం మరోసారి రజనీకాంత్​కు కొవిడ్ నిర్ధరణ పరీక్షలతోపాటు... గుండె సంబంధిత పరీక్షలు చేయనున్నట్లు సమాచారం. ఆ నివేదికలు వచ్చిన తర్వాతనే ఆయనను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్న రజనీకాంత్ ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు ప్రకటించారు.

రజనీకాంత్‌కు తోడుగా ఆయన కుమార్తె ఉన్నారని వైద్యులు తెలిపారు. ఆయన్ను పరామర్శించేందుకు ఎవరినీ అనుమతించట్లేదని చెప్పారు. రజనీ ఆరోగ్య పరిస్థితిపై వాకబు కోసం ఆస్పత్రికి ఎవరూ రావొద్దని వైద్యులు విజ్ఞప్తి చేశారు.

తలైవా త్వరగా కోలుకోవాలి: ప్రముఖుల ఆకాంక్ష

‌రజనీకాంత్‌ అస్వస్థతకు గురికావడంపై పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు వాకబు చేశారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రముఖ సినీనటుడు కమల్‌హాసన్‌, మోహన్​ బాబు, మంత్రి కేటీఆర్‌ ఆకాంక్షించారు. రజనీ మానసికంగా, శారీరకంగా దృఢమైన వ్యక్తని, త్వరగా కోలుకొని పనులు మొదలుపెడతారని మోహన్ బాబు ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: అభిమాని ఫాస్ట్​ఫుడ్​ సెంటర్​లో సోనూసూద్​ సందడి

అనారోగ్యంతో హైదరాబాద్​ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ నటుడు రజనీకాంత్​ ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి ప్రకటన విడుదల చేసింది. ఆయనకు రక్తపోటులో హెచ్చుతగ్గులు ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ మేరకు శనివారం మరోసారి రజనీకాంత్​కు కొవిడ్ నిర్ధరణ పరీక్షలతోపాటు... గుండె సంబంధిత పరీక్షలు చేయనున్నట్లు సమాచారం. ఆ నివేదికలు వచ్చిన తర్వాతనే ఆయనను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్న రజనీకాంత్ ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు ప్రకటించారు.

రజనీకాంత్‌కు తోడుగా ఆయన కుమార్తె ఉన్నారని వైద్యులు తెలిపారు. ఆయన్ను పరామర్శించేందుకు ఎవరినీ అనుమతించట్లేదని చెప్పారు. రజనీ ఆరోగ్య పరిస్థితిపై వాకబు కోసం ఆస్పత్రికి ఎవరూ రావొద్దని వైద్యులు విజ్ఞప్తి చేశారు.

తలైవా త్వరగా కోలుకోవాలి: ప్రముఖుల ఆకాంక్ష

‌రజనీకాంత్‌ అస్వస్థతకు గురికావడంపై పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు వాకబు చేశారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రముఖ సినీనటుడు కమల్‌హాసన్‌, మోహన్​ బాబు, మంత్రి కేటీఆర్‌ ఆకాంక్షించారు. రజనీ మానసికంగా, శారీరకంగా దృఢమైన వ్యక్తని, త్వరగా కోలుకొని పనులు మొదలుపెడతారని మోహన్ బాబు ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: అభిమాని ఫాస్ట్​ఫుడ్​ సెంటర్​లో సోనూసూద్​ సందడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.