రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి తగ్గుముఖం పడుతోంది. వరుసగా రెండో రోజు వెయ్యిలోపు నమోదయ్యాయి. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 1,12,982 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా... 993 మంది వైరస్ (CORONA POSITIVE) బారినపడినట్లు వెల్లడైంది. రాష్ట్రవ్యాప్తంగా మరో 9 మంది మరణించారు.
రాష్ట్రంలో మరో 1,417 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 13,869 కొవిడ్ యాక్టివ్ కేసులున్నాయి. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీలో 124 పాజిటివ్ కేసులు నమోదు కాగా, నల్గొండలో 78, సూర్యాపేటలో 72, మంచిర్యాలలో 59, భద్రాద్రి కొత్తగూడెంలో 58, ఖమ్మంలో 50, మహబూబాబాద్లో 51 కేసులు నమోదయ్యాయి.
ఇదీ చూడండి: ONLINE CLASSES: జులై 1 నుంచి ఆన్లైన్ తరగతులు: మంత్రి సబిత