ETV Bharat / state

గ్రేటర్​ పోరు... 68 నామినేషన్లు తిరస్కరణ

author img

By

Published : Nov 21, 2020, 8:40 PM IST

Updated : Nov 21, 2020, 10:05 PM IST

Rejection of 68 nominations in GHMC elections
గ్రేటర్​ పోరు... 68 నామినేషన్లు తిరస్కరణ

20:39 November 21

గ్రేటర్​ పోరు... 68 నామినేషన్లు తిరస్కరణ

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ పూర్తయింది. ఎన్నికల్లో 68 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. ఆదివారం మధ్యాహ్నం 3 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల తర్వాత బరిలో ఉన్న తుది అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు. తిరస్కరణకు గురైన నామినేషన్ల అనంతరం తెరాస-527, భాజపా-539, కాంగ్రెస్​-348, తెదేపా-202, ఎంఐఎం-72, సీపీఐ-22, సీపీఎం-19,  రికగనైజ్డ్, రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీలు-143,  స్వతంత్రుల నుంచి 613 నామినేషన్లు దాఖలయ్యాయి. 

కుత్బుల్లాపూర్ 125వ డివిజన్​ గాజులరామారం కాంగ్రెస్ అభ్యర్థి కూన శ్రీనివాస్​గౌడ్ నామినేషన్​ను రిటర్నింగ్ అధికారులు తిరస్కరించటంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. కాంగ్రెస్ శ్రేణులు గాజులరామారం సర్కిల్​ కార్యాలయానికి తరలిరావడంతో​ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో వారిపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ముగ్గురు సంతానం ఉన్నారని నామినేషన్‌ తిరస్కరించినట్లు ఆర్వో సుజాత ప్రకటించారు. ఈ వ్యవహారంపై ఎంపీ రేవంత్​రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ జీహెచ్​ఎంసీ సర్కిల్​ కార్యాలయం ఎదుట బైఠాయించారు.  

ఇదీ చదవండి: బురిడి కొట్టించి ఒకటి రెండు సీట్లు గెలుస్తారేమో: కవిత

20:39 November 21

గ్రేటర్​ పోరు... 68 నామినేషన్లు తిరస్కరణ

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ పూర్తయింది. ఎన్నికల్లో 68 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. ఆదివారం మధ్యాహ్నం 3 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల తర్వాత బరిలో ఉన్న తుది అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు. తిరస్కరణకు గురైన నామినేషన్ల అనంతరం తెరాస-527, భాజపా-539, కాంగ్రెస్​-348, తెదేపా-202, ఎంఐఎం-72, సీపీఐ-22, సీపీఎం-19,  రికగనైజ్డ్, రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీలు-143,  స్వతంత్రుల నుంచి 613 నామినేషన్లు దాఖలయ్యాయి. 

కుత్బుల్లాపూర్ 125వ డివిజన్​ గాజులరామారం కాంగ్రెస్ అభ్యర్థి కూన శ్రీనివాస్​గౌడ్ నామినేషన్​ను రిటర్నింగ్ అధికారులు తిరస్కరించటంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. కాంగ్రెస్ శ్రేణులు గాజులరామారం సర్కిల్​ కార్యాలయానికి తరలిరావడంతో​ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో వారిపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ముగ్గురు సంతానం ఉన్నారని నామినేషన్‌ తిరస్కరించినట్లు ఆర్వో సుజాత ప్రకటించారు. ఈ వ్యవహారంపై ఎంపీ రేవంత్​రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ జీహెచ్​ఎంసీ సర్కిల్​ కార్యాలయం ఎదుట బైఠాయించారు.  

ఇదీ చదవండి: బురిడి కొట్టించి ఒకటి రెండు సీట్లు గెలుస్తారేమో: కవిత

Last Updated : Nov 21, 2020, 10:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.