ETV Bharat / state

CRPF RAISING DAY: దేశ అంతర్గత భద్రతలో సీఆర్పీఎఫ్ బలగాల పాత్రే కీలకం

author img

By

Published : Jul 27, 2021, 2:37 PM IST

హైదరాబాద్​లో సీఆర్పీఎఫ్ రైజింగ్​ డే వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జూబ్లీహిల్స్​లోని నిర్వహించిన 83వ రైజింగ్​ డే వేడుకల్లో... సీఆర్​పీఎఫ్ ఐజీ మహేశ్​ చంద్ర లడ్డా (CRPF IG Mahesh Chandra Ladda) పాల్గొని అమర జవాన్లకు నివాళులు అర్పించారు.

crpf raising day
సీఆర్పీఎఫ్ రైజింగ్​ డే

దేశ అంతర్గత భద్రతలో సీఆర్పీఎఫ్ బలగాల పాత్ర కీలకమని సదరన్ సెక్టార్ ఐజీ మహేశ్‌చంద్ర లడ్డా (CRPF IG Mahesh Chandra Ladda) వెల్లడించారు. జూబ్లీహిల్స్​లోని సీఆర్పీఎఫ్ దక్షిణాది సెక్టార్ కార్యాలయంలో 83వ రైజింగ్​ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఆర్పీఎఫ్ సదరన్​ సెక్టార్ ఐజీ మహేశ్ చంద్ర లడ్డా పాల్గొన్నారు.

దేశ రక్షణ కోసం ప్రాణ త్యాగం చేసిన అమరవీరులకు ఐజీ నివాళులు అర్పించి... వారు చేసిన త్యాగాలను స్మరించుకున్నారు. దేశ భద్రతకు ఎటువంటి సవాళ్లనైనా ఎదుర్కోవటానికి సిద్ధమని ప్రతిజ్ఞ చేశారు. భారత్​లోనే అతిపెద్ద పారా మిలటరీ బలగం అయినా సీఆర్పీఎఫ్ 1939లో స్థాపించబడిందని... ఒక బెటాలియన్​తో ప్రారంభమై... ప్రస్తుతం 246 బెటాలియన్లకు విస్తరించిందని తెలిపారు.

83 ఏళ్ల క్రితం మధ్యప్రదేశ్​లో సీఆర్పీఎఫ్ ప్రారంభమైంది. 1939లో ఒక బెటాలియన్​తో ప్రారంభమై... ప్రస్తుతం 246 బెటాలియన్లకు విస్తరించింది. భారత్​లోనే అతిపెద్ద పారా మిలటరీ బలగంగా మారి... అంతర్గత భద్రతను కాపాడుకోవడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రస్తుతం దేశంలో 3 లక్షలకు పైగా సీఆర్పీఎఫ్​ జవాన్లు ఉన్నారు.

-సీఆర్ఫీఎఫ్ సదరన్ సెక్టార్ ఐజీపీ మహేశ్‌చంద్ర లడ్డా

సాధారణ శాంత్రి భద్రతలు, నక్సలిజం, ఉగ్రవాదాన్ని నియంత్రించేందుకు సీఆర్​పీఎఫ్ పనిచేస్తోందని ఐజీ తెలిపారు. దేశంలో పచ్చదనానికి ప్రాధాన్యమిస్తూ... దళానికి సంబంధించి ఎటువంటి కార్యక్రమం జరిగినా... హరిత క్రాంతి పేరుతో మొక్కలు నాటుతున్నామన్నారు. కార్యక్రమంలో పలువురు సీఆర్పీఎఫ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

సీఆర్పీఎఫ్ రైజింగ్​ డే

ఇదీ చూడండి: సీఆర్పీఎఫ్​ బెటాలియన్​ క్యాంప్​లో వాల్యుర్​ డే వేడుకలు

దేశ అంతర్గత భద్రతలో సీఆర్పీఎఫ్ బలగాల పాత్ర కీలకమని సదరన్ సెక్టార్ ఐజీ మహేశ్‌చంద్ర లడ్డా (CRPF IG Mahesh Chandra Ladda) వెల్లడించారు. జూబ్లీహిల్స్​లోని సీఆర్పీఎఫ్ దక్షిణాది సెక్టార్ కార్యాలయంలో 83వ రైజింగ్​ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఆర్పీఎఫ్ సదరన్​ సెక్టార్ ఐజీ మహేశ్ చంద్ర లడ్డా పాల్గొన్నారు.

దేశ రక్షణ కోసం ప్రాణ త్యాగం చేసిన అమరవీరులకు ఐజీ నివాళులు అర్పించి... వారు చేసిన త్యాగాలను స్మరించుకున్నారు. దేశ భద్రతకు ఎటువంటి సవాళ్లనైనా ఎదుర్కోవటానికి సిద్ధమని ప్రతిజ్ఞ చేశారు. భారత్​లోనే అతిపెద్ద పారా మిలటరీ బలగం అయినా సీఆర్పీఎఫ్ 1939లో స్థాపించబడిందని... ఒక బెటాలియన్​తో ప్రారంభమై... ప్రస్తుతం 246 బెటాలియన్లకు విస్తరించిందని తెలిపారు.

83 ఏళ్ల క్రితం మధ్యప్రదేశ్​లో సీఆర్పీఎఫ్ ప్రారంభమైంది. 1939లో ఒక బెటాలియన్​తో ప్రారంభమై... ప్రస్తుతం 246 బెటాలియన్లకు విస్తరించింది. భారత్​లోనే అతిపెద్ద పారా మిలటరీ బలగంగా మారి... అంతర్గత భద్రతను కాపాడుకోవడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రస్తుతం దేశంలో 3 లక్షలకు పైగా సీఆర్పీఎఫ్​ జవాన్లు ఉన్నారు.

-సీఆర్ఫీఎఫ్ సదరన్ సెక్టార్ ఐజీపీ మహేశ్‌చంద్ర లడ్డా

సాధారణ శాంత్రి భద్రతలు, నక్సలిజం, ఉగ్రవాదాన్ని నియంత్రించేందుకు సీఆర్​పీఎఫ్ పనిచేస్తోందని ఐజీ తెలిపారు. దేశంలో పచ్చదనానికి ప్రాధాన్యమిస్తూ... దళానికి సంబంధించి ఎటువంటి కార్యక్రమం జరిగినా... హరిత క్రాంతి పేరుతో మొక్కలు నాటుతున్నామన్నారు. కార్యక్రమంలో పలువురు సీఆర్పీఎఫ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

సీఆర్పీఎఫ్ రైజింగ్​ డే

ఇదీ చూడండి: సీఆర్పీఎఫ్​ బెటాలియన్​ క్యాంప్​లో వాల్యుర్​ డే వేడుకలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.