ETV Bharat / state

ఉద్ధృతి తగ్గుతోంది.. 11 జిల్లాల్లో కరోనా జాడలేదు

author img

By

Published : Apr 30, 2020, 7:27 AM IST

రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకూ తగ్గుతున్నాయి. బుధవారం కొత్తగా మరో 7 కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం బాధితుల సంఖ్య 1016కు చేరింది. మరో 35 మంది కోలుకొని ఆస్పత్రుల నుంచి ఇళ్లకెళ్లారు. మరోవైపు వైద్యారోగ్యశాఖ 11 జిల్లాలను కరోనా రహిత జిల్లాలుగా ప్రకటించింది.

7 more corona passitive cases in the state
రాష్ట్రంలో మరో 7 కరోనా కేసులు.. 11 జిల్లాల్లో జాడలేదు

రాష్ట్రంలో 11 జిల్లాలను కరోనా రహిత జిల్లాలుగా వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. ఇందులో వరంగల్‌ గ్రామీణ, వనపర్తి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఇప్పటి వరకూ ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. సిద్దిపేట, మహబూబాబాద్‌, మంచిర్యాల, నారాయణపేట, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, నాగర్‌కర్నూల్‌, ములుగు జిల్లాల్లో కేసులు నమోదైనా కూడా వారందరూ కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి అయ్యారు. ఇప్పుడు ఈ 8 జిల్లాల్లోనూ ఒక్కరు కూడా పాజిటివ్‌తో చికిత్స పొందడం లేదు.

అయితే బుధవారం రాష్ట్రంలో కొత్తగా మరో ఏడు కేసులు నమోదయ్యాయి. ఫలింతగా వైరస్‌ బాధితుల సంఖ్య 1016కు పెరిగింది. ఆసుపత్రుల నుంచి మరో 35 మంది కోలుకొని ఇళ్లకెళ్లారు. కరోనా సమాచారం కోసం 104కు, మానసిక ఆరోగ్య సమాచారం, కౌన్సెలింగ్‌ కోసం 108 నంబరుకు ఫోన్‌ చేయాలని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు సూచించారు.

ఐసీయూలో 10 మంది

గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నవారిలో 10 మంది ఐసీయూలో ఉన్నారు. వీరిలో ఒకరు వెంటిలేటర్‌పై ఉండగా.. మిగిలినవారు ఆక్సిజన్‌ సాయంతో చికిత్స పొందుతున్నారు. ఇద్దరికి డయాలసిస్‌ సేవలందిస్తుండగా, మరొకరు నోటి క్యాన్సర్‌తో, ఇంకొకరు లింఫోమా, ఒకరు క్లోమగ్రంథిÅ క్యాన్సర్‌తో, నలుగురు గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు.

గాంధీ వైద్యులు నిరంతరంగా సేవలందిస్తున్నారని, వారి పర్యవేక్షణలో అందరూ కోలుకుంటారని ఆశిస్తున్నట్లు వైద్యమంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. దేశంలో మరణాల రేటు 3.2 కాగా, రాష్ట్రంలో 2.5గా ఉందని, మరణాల రేటును మరింత తగ్గించేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

రాష్ట్రంలో కేసుల వివరాలు

  • మొత్తం కేసులు: 1016
  • డిశ్ఛార్జి అయిన వారు: 409
  • చికిత్స పొందుతున్నవారు: 582
  • మరణాలు: 25

కరోనా ఫ్రీ జిల్లాలు ఇవే..

  1. వరంగల్​ గ్రామీణ
  2. వనపర్తి
  3. యాదాద్రి భువనగిరి
  4. సిద్దిపేట
  5. మహబూబాబాద్‌
  6. మంచిర్యాల
  7. నారాయణపేట
  8. పెద్దపల్లి
  9. భద్రాద్రి కొత్తగూడెం
  10. నాగర్‌కర్నూల్‌
  11. ములుగు

ఇదీ చూడండి: 'లాక్​డౌన్ నష్టాన్ని పూడ్చేందుకు కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ!'

రాష్ట్రంలో 11 జిల్లాలను కరోనా రహిత జిల్లాలుగా వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. ఇందులో వరంగల్‌ గ్రామీణ, వనపర్తి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఇప్పటి వరకూ ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. సిద్దిపేట, మహబూబాబాద్‌, మంచిర్యాల, నారాయణపేట, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, నాగర్‌కర్నూల్‌, ములుగు జిల్లాల్లో కేసులు నమోదైనా కూడా వారందరూ కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి అయ్యారు. ఇప్పుడు ఈ 8 జిల్లాల్లోనూ ఒక్కరు కూడా పాజిటివ్‌తో చికిత్స పొందడం లేదు.

అయితే బుధవారం రాష్ట్రంలో కొత్తగా మరో ఏడు కేసులు నమోదయ్యాయి. ఫలింతగా వైరస్‌ బాధితుల సంఖ్య 1016కు పెరిగింది. ఆసుపత్రుల నుంచి మరో 35 మంది కోలుకొని ఇళ్లకెళ్లారు. కరోనా సమాచారం కోసం 104కు, మానసిక ఆరోగ్య సమాచారం, కౌన్సెలింగ్‌ కోసం 108 నంబరుకు ఫోన్‌ చేయాలని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు సూచించారు.

ఐసీయూలో 10 మంది

గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నవారిలో 10 మంది ఐసీయూలో ఉన్నారు. వీరిలో ఒకరు వెంటిలేటర్‌పై ఉండగా.. మిగిలినవారు ఆక్సిజన్‌ సాయంతో చికిత్స పొందుతున్నారు. ఇద్దరికి డయాలసిస్‌ సేవలందిస్తుండగా, మరొకరు నోటి క్యాన్సర్‌తో, ఇంకొకరు లింఫోమా, ఒకరు క్లోమగ్రంథిÅ క్యాన్సర్‌తో, నలుగురు గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు.

గాంధీ వైద్యులు నిరంతరంగా సేవలందిస్తున్నారని, వారి పర్యవేక్షణలో అందరూ కోలుకుంటారని ఆశిస్తున్నట్లు వైద్యమంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. దేశంలో మరణాల రేటు 3.2 కాగా, రాష్ట్రంలో 2.5గా ఉందని, మరణాల రేటును మరింత తగ్గించేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

రాష్ట్రంలో కేసుల వివరాలు

  • మొత్తం కేసులు: 1016
  • డిశ్ఛార్జి అయిన వారు: 409
  • చికిత్స పొందుతున్నవారు: 582
  • మరణాలు: 25

కరోనా ఫ్రీ జిల్లాలు ఇవే..

  1. వరంగల్​ గ్రామీణ
  2. వనపర్తి
  3. యాదాద్రి భువనగిరి
  4. సిద్దిపేట
  5. మహబూబాబాద్‌
  6. మంచిర్యాల
  7. నారాయణపేట
  8. పెద్దపల్లి
  9. భద్రాద్రి కొత్తగూడెం
  10. నాగర్‌కర్నూల్‌
  11. ములుగు

ఇదీ చూడండి: 'లాక్​డౌన్ నష్టాన్ని పూడ్చేందుకు కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.