ETV Bharat / state

రాజ్​భవన్​లో కరోనా కలకలం... 48 మందికి పాజిటివ్​

author img

By

Published : Jul 12, 2020, 11:59 PM IST

రాజ్‌భవన్‌లో కరోనా కలకలం రేపింది. గవర్నర్‌ అధికారిక నివాసంలో మొత్తం 48 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు రాజ్‌భవన్‌ వర్గాలు వెల్లడించాయి. అందులో పనిచేస్తున్న 38 మంది సిబ్బందికి మహమ్మారి సోకగా అందులో 28 మంది భద్రతా సిబ్బంది ఉన్నారు. పది మంది కుటుంబసభ్యులకూ వైరస్‌ నిర్థరణ అయింది. పరీక్షల్లో తనకు నెగెటివ్‌గా నివేదిక వచ్చినట్లు ట్విట్టర్‌లో గవర్నర్ తెలిపారు.

48 new positive cases registered in raj bawan
రాజ్​భవన్​లో కరోనా కలకలం... 48 మందికి పాజిటివ్​

కొవిడ్‌ మహమ్మారితో రాజ్​భవన్‌ ఉలిక్కిపడింది. అక్కడ 48 మందికి కరోనా సోకింది. వారిలో 28 మంది భద్రతా సిబ్బంది, మరో పది మంది ఇతర సిబ్బందితో పాటు మరో పది మంది వారి కుటుంబసభ్యులకు కరోనా పాజిటివ్‌ నిర్ధరణ అయింది. పాజిటివ్‌ వచ్చిన 28 మంది పోలీసులను వెంటనే ఐసోలేషన్‌కు తరలించారు. మిగిలిన 20 మందిని ఎస్​ఆర్​నగర్‌లోని ఆయుర్వేద ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నట్లు పేర్కొన్నాయి. మరికొందరిని హోం క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా ఆదేశించారు. మొత్తం 395 మందిని పరీక్షించగా... 347 మందికి నెగెటివ్​ వచ్చింది.

గవర్నర్​ దంపతులకు నెగిటివ్​..

రాజ్‌భవన్‌ సిబ్బందితో పాటు గవర్నర్‌ వారి కుటుంబసభ్యులు పరీక్షలు చేయించుకున్నారు. గవర్నర్‌ దంపతులకు నెగిటివ్‌ వచ్చినట్లు రాజ్‌భవన్‌ వర్గాలు ధ్రువీకరించాయి. రెడ్‌జోన్‌లో ఉన్నవారు, కరోనా పాజిటివ్‌ వచ్చిన వారితో కాంటాక్ట్‌ కలిగినవారు తప్పక కొవిడ్‌ పరీక్షలు చేయించుకోవాలని గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ ప్రజలకు సూచించారు.

నాలుగు "టి"లు అనుసరించండి

త్వరగా పరీక్షలు చేయించుకోవడం వల్ల... వ్యక్తిగతంగా ఊరట లభించడమే కాకుండా... ఇతరులకు మేలు చేసినవారవుతారని పేర్కొన్నారు. పరీక్షలు చేయించుకోడానికి ఏ మాత్రం సంకోచించకుండా తక్షణమే చేయించుకుని, ఇతరులను ప్రోత్సహించాలని సూచించారు. అదే విధంగా ప్రతి ఒక్కరు టెస్ట్‌, ట్రేస్‌, ట్రీట్‌, టీచ్‌ అన్న నాలుగు టీలను అనుసరించాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి: తెలంగాణలో కొత్తగా 1,269 మందికి కరోనా... మరో ఎనిమిది మంది మృతి

కొవిడ్‌ మహమ్మారితో రాజ్​భవన్‌ ఉలిక్కిపడింది. అక్కడ 48 మందికి కరోనా సోకింది. వారిలో 28 మంది భద్రతా సిబ్బంది, మరో పది మంది ఇతర సిబ్బందితో పాటు మరో పది మంది వారి కుటుంబసభ్యులకు కరోనా పాజిటివ్‌ నిర్ధరణ అయింది. పాజిటివ్‌ వచ్చిన 28 మంది పోలీసులను వెంటనే ఐసోలేషన్‌కు తరలించారు. మిగిలిన 20 మందిని ఎస్​ఆర్​నగర్‌లోని ఆయుర్వేద ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నట్లు పేర్కొన్నాయి. మరికొందరిని హోం క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా ఆదేశించారు. మొత్తం 395 మందిని పరీక్షించగా... 347 మందికి నెగెటివ్​ వచ్చింది.

గవర్నర్​ దంపతులకు నెగిటివ్​..

రాజ్‌భవన్‌ సిబ్బందితో పాటు గవర్నర్‌ వారి కుటుంబసభ్యులు పరీక్షలు చేయించుకున్నారు. గవర్నర్‌ దంపతులకు నెగిటివ్‌ వచ్చినట్లు రాజ్‌భవన్‌ వర్గాలు ధ్రువీకరించాయి. రెడ్‌జోన్‌లో ఉన్నవారు, కరోనా పాజిటివ్‌ వచ్చిన వారితో కాంటాక్ట్‌ కలిగినవారు తప్పక కొవిడ్‌ పరీక్షలు చేయించుకోవాలని గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ ప్రజలకు సూచించారు.

నాలుగు "టి"లు అనుసరించండి

త్వరగా పరీక్షలు చేయించుకోవడం వల్ల... వ్యక్తిగతంగా ఊరట లభించడమే కాకుండా... ఇతరులకు మేలు చేసినవారవుతారని పేర్కొన్నారు. పరీక్షలు చేయించుకోడానికి ఏ మాత్రం సంకోచించకుండా తక్షణమే చేయించుకుని, ఇతరులను ప్రోత్సహించాలని సూచించారు. అదే విధంగా ప్రతి ఒక్కరు టెస్ట్‌, ట్రేస్‌, ట్రీట్‌, టీచ్‌ అన్న నాలుగు టీలను అనుసరించాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి: తెలంగాణలో కొత్తగా 1,269 మందికి కరోనా... మరో ఎనిమిది మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.