రాష్ట్రంలో కరోనా తగ్గినట్లే తగ్గి... మళ్లీ విజృంభిస్తోంది. తాజాగా మరో 204 కరోనా కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో మరో 37 మంది మహమ్మారి బారిన పడ్డారు. వైరస్కు ఇద్దరు బలయ్యారు. కొత్తగా 170 మంది బాధితులు కొవిడ్ను జయించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,015 యాక్టివ్ కేసులున్నాయి. ప్రస్తుతం 624 మంది హోం ఐసోలేషన్లో ఉన్నారు.
రాష్ట్రంలో కొవిడ్ మహమ్మారి మళ్లీ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ప్రజలంతా కరోనా నిబంధనలు పాటిస్తూ వైరస్ బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ సూచించింది.
ఇదీ చూడండి: ప్రభుత్వ పాఠశాలలో కరోనా కలవరం.. 14 మందికి పాజిటివ్