ETV Bharat / state

23 వేలు దాటిన కరోనా కేసులు.. కొత్తగా 1,590 మందికి పాజిటివ్‌ - తెలంగాణలో కరోనా కేసులు

రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 23,000 దాటింది. గత కొద్దిరోజులుగా 1,500 పైగా కేసులు నమోదవుతున్నాయి. ఆదివారం 1,590 మందికి పాజిటివ్ వచ్చినట్లు...... వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. వాటిలో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 1,277 మందిలో వైరస్‌ గుర్తించినట్లు వెల్లడించింది. బాధితుల్లో ఎక్కువ శాతం పురుషులే ఉన్నట్లు పేర్కొంది.

1590-new-corona-positive-cases-registered-on-sunday-in-telangana-total-cases-rised-to-23902
23 వేలు దాటిన కరోనా కేసులు.. కొత్తగా 1,590 మందికి పాజిటివ్‌
author img

By

Published : Jul 6, 2020, 4:51 AM IST

Updated : Jul 6, 2020, 7:19 AM IST

రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. ఆదివారం 5,290 నమూనాలు పరీక్షించగా... 1,590 మందిలో వైరస్ గుర్తించినట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. కొత్త కేసులతో కలుపుకుంటే రాష్ట్రంలో కేసుల సంఖ్య 23,902కి చేరింది. జీహెచ్​ఎంసీ పరిధిలోఅత్యధికంగా 1,277 మందికి కరోనా సోకింది.

మేడ్చల్‌లో 125, రంగారెడ్డి 82, సూర్యాపేట 23.....సంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో 19 మందికి కొత్తగా మహమ్మారి బారినపడ్డారు. నల్గొండ జిల్లాలో 14 మందికి... వనపర్తి, కరీంనగర్‌ జిల్లాల్లో 4 చొప్పున కేసులు నమోదయ్యాయి. మెదక్‌, నిజామాబాద్ జిల్లాల్లో 3 చొప్పున... నిర్మల్‌, వికారాబాద్, భద్రాద్రి, జనగాం జిల్లాల్లో 2 చొప్పున కేసులు వెలుగుచూశాయి. గద్వాల్‌, సిరిసిల్ల, సిద్దిపేట, వరంగల్‌ గ్రామీణం, నారాయణ పేట్‌, పెద్దపల్లి, యాదాద్రి, కామారెడ్డి, ఆదిలాబాద్‌ జిల్లాల్లో..... ఒక్కో కేసు నమోదైనట్లు వైద్యా ఆరోగ్య శాఖ వివరించింది.

295కి చేరిన మృతుల సంఖ్య

ఆదివారం మహమ్మారి బారిన పడి మరో ఏడుగురు మృత్యువాత పడ్డారు. వారితో కలుపుకుంటే రాష్ట్రంలో కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 295కి చేరింది. ఆదివారం కరోనా నుంచి కోలుకొని 1,166 మంది డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు వైరస్‌ నుంచి కోలుకుని 12,703 మంది డిశ్చార్చి అయినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం వివిధ ఆస్పత్రుల్లో 10,904 మంది బాధితులు చికిత్స పొందుతున్నారని స్పష్టంచేసింది.

పురుషులే అత్యధికం

రాష్ట్రంలో ఇప్పటివరకు 1,15,835 మందికి కరోనా పరీక్షలు చేయగా... 91,933 మందికి నెగెటివ్‌ వచ్చినట్లు....... అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసులను పరిశీలిస్తే బాధితుల్లో పురుషులే ఎక్కువగా ఉన్నట్లు వెల్లడవుతోంది. మొత్తం బాధితుల్లో...... పురుషులు 15,559 మంది ఉండగా...... 8,343 మంది మహిళలు ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ పేర్కొంది. వారిలో 13 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్కులు 20,091 మంది ఉన్నారని తెలిపింది.

ఇదీ చూడండి: స్పీడు పెంచిన కరోనా- 'మహా'లో కొత్తగా 6,555 కేసులు

రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. ఆదివారం 5,290 నమూనాలు పరీక్షించగా... 1,590 మందిలో వైరస్ గుర్తించినట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. కొత్త కేసులతో కలుపుకుంటే రాష్ట్రంలో కేసుల సంఖ్య 23,902కి చేరింది. జీహెచ్​ఎంసీ పరిధిలోఅత్యధికంగా 1,277 మందికి కరోనా సోకింది.

మేడ్చల్‌లో 125, రంగారెడ్డి 82, సూర్యాపేట 23.....సంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో 19 మందికి కొత్తగా మహమ్మారి బారినపడ్డారు. నల్గొండ జిల్లాలో 14 మందికి... వనపర్తి, కరీంనగర్‌ జిల్లాల్లో 4 చొప్పున కేసులు నమోదయ్యాయి. మెదక్‌, నిజామాబాద్ జిల్లాల్లో 3 చొప్పున... నిర్మల్‌, వికారాబాద్, భద్రాద్రి, జనగాం జిల్లాల్లో 2 చొప్పున కేసులు వెలుగుచూశాయి. గద్వాల్‌, సిరిసిల్ల, సిద్దిపేట, వరంగల్‌ గ్రామీణం, నారాయణ పేట్‌, పెద్దపల్లి, యాదాద్రి, కామారెడ్డి, ఆదిలాబాద్‌ జిల్లాల్లో..... ఒక్కో కేసు నమోదైనట్లు వైద్యా ఆరోగ్య శాఖ వివరించింది.

295కి చేరిన మృతుల సంఖ్య

ఆదివారం మహమ్మారి బారిన పడి మరో ఏడుగురు మృత్యువాత పడ్డారు. వారితో కలుపుకుంటే రాష్ట్రంలో కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 295కి చేరింది. ఆదివారం కరోనా నుంచి కోలుకొని 1,166 మంది డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు వైరస్‌ నుంచి కోలుకుని 12,703 మంది డిశ్చార్చి అయినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం వివిధ ఆస్పత్రుల్లో 10,904 మంది బాధితులు చికిత్స పొందుతున్నారని స్పష్టంచేసింది.

పురుషులే అత్యధికం

రాష్ట్రంలో ఇప్పటివరకు 1,15,835 మందికి కరోనా పరీక్షలు చేయగా... 91,933 మందికి నెగెటివ్‌ వచ్చినట్లు....... అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసులను పరిశీలిస్తే బాధితుల్లో పురుషులే ఎక్కువగా ఉన్నట్లు వెల్లడవుతోంది. మొత్తం బాధితుల్లో...... పురుషులు 15,559 మంది ఉండగా...... 8,343 మంది మహిళలు ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ పేర్కొంది. వారిలో 13 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్కులు 20,091 మంది ఉన్నారని తెలిపింది.

ఇదీ చూడండి: స్పీడు పెంచిన కరోనా- 'మహా'లో కొత్తగా 6,555 కేసులు

Last Updated : Jul 6, 2020, 7:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.