ETV Bharat / state

నక్సల్స్​ నుంచి వెంకయ్యను కాపాడిన వ్యక్తి తెలుసా?

నక్సల్స్​ నుంచి కాపాడినందుకు ఉద్యోగమిప్పిస్తానని హామి ఇచ్చిన వెంకయ్యనాయుడు. నెరవేర్చాలని సదరు వ్యక్తి వినతి.

author img

By

Published : Feb 7, 2019, 5:58 AM IST

నక్సల్స్​ నుంచి కాపాడినందుకు వెంకయ్యనాయుడు ఉద్యోగ హామి

నక్సల్స్ నుంచి కాపాడినందుకు వెంకయ్యనాయుడు ఉద్యోగ హామి
దేశంలో నిరుద్యోగుల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. కొంతమంది ప్రతిభతో ఉద్యోగం పొందితే, ఇంకొందరు డబ్బులిచ్చి కొనుక్కుంటారు. మరికొందరు పెద్దవారి సిఫార్సులతో ఉద్యోగం పొందుతారు. ఇవేమి లేకుండానే ఆర్థికంగా కుంగిపోతున్న ఓ వ్యక్తికి అనుకోకుండా స్వయాన ఉపరాష్ట్రపతే హామీ ఇస్తే ఎంత సంతోషంగా ఉంటారు... ఆ వ్యక్తీ సంతోషించాడు, కానీ వెంకయ్య హామీకి మాత్రం విలువ లేకుండా పోయింది. ఈ ఘటన బిహార్​లో జరిగింది.
undefined

2005లో అప్పటి భాజపా జాతీయాధ్యక్షుడిగా ఉన్న వెంకయ్య నాయుడు ఓసారి బిహార్​లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనుకోకుండా హెలికాప్టర్​లో ఇంధనం అయిపోయింది. అత్యవసరంగా పండరియా గ్రామంలో దిగారు. అప్పట్లో ఆ ప్రాంతంలో నక్సళ్ల ప్రభావం ఎక్కవగా ఉండేది. హెలికాప్టర్​లో ఉన్న వారికి బెంగ పట్టుకుంది. సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. అదే సమయంలో రాజేంద్ర అనే వ్యక్తి అటుగా వెళ్లడం చూశారు. తర్వాత రాజేంద్ర తన సొంత వాహనంలో వెంకయ్య నాయుడిని బారాచట్టి పోలీసు స్టేషన్​కు తీసుకెళ్లారు.

నెరవేరని వెంకయ్య మాట...

సహాయం చేసిన రాజేంద్రకు ఆర్థికంగా సహాయం చేస్తానని మాట ఇచ్చారు వెంకయ్య. కేంద్ర మంత్రి అరుణ్​ జైట్లీ సైతం ఓ సందర్భంలో రాజేంద్రను అభినందించారు.

"హెలికాప్టర్​ వచ్చి ఇక్కడ ఆగింది. వెంకయ్యను చూడటానికి చాలమంది వచ్చారు. నా కొత్త వాహనంపై ఆయనను తీసుకెళ్లాను. దారిలో ఆయన నా పేరు అడిగారు. రాజేంద్ర సావ్​ అని చెప్పాను. దారిలో ఎంతో హడావుడి జరిగింది. అది చూసి నాకు భయమేసింది. భయపడకు నేను వెంకయ్య నాయుడిని... నీకు సహాయం చేస్తామని హామీ ఇచ్చారు."
--- రాజేంద్ర సావ్​.

కానీ ఇప్పటికీ ఆ మాట నిజం కాలేదు. భాజపా నేతకు సహాయం చేసినందుకు రాజేంద్రపై నక్సలైట్లు దాడి చేశారు. అనేక విధాలుగా చిత్ర హింసలు పెట్టారు. చంపేస్తామని బెదిరించగా రాజేంద్ర బిహార్​ను విడిచారు. ఛత్తీస్​గఢ్​లో నివాసం ఏర్పరచుకున్నారు. ఉద్యోగం లేక ఎంతో బాధపడ్డారు.

వెంకయ్య మాటతో ఎన్నో ప్రభుత్వ కార్యాలయాలు తిరిగారు రాజేంద్ర. ఎట్టకేలకు... సైన్యంలో ఉద్యోగమిస్తామని అప్పటి ఛత్తీస్​గఢ్​ ముఖ్యమంత్రి రమణ్ సింగ్​ హామీ ఇచ్చారు. కానీ ఇప్పటికి వారి నుంచి పిలుపు రాలేదు. అ తర్వాత కొన్ని సందర్భాల్లో వెంకయ్యను కలిశానని రాజేంద్ర తెలిపారు. కనీసం తన పిల్లలకైనా ఉద్యోగం ఇస్తే ఆర్థిక స్తోమత పెరుగుతుందని రాజేంద్ర ఆశగా ఎదురు చూస్తున్నారు.

undefined

నక్సల్స్ నుంచి కాపాడినందుకు వెంకయ్యనాయుడు ఉద్యోగ హామి
దేశంలో నిరుద్యోగుల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. కొంతమంది ప్రతిభతో ఉద్యోగం పొందితే, ఇంకొందరు డబ్బులిచ్చి కొనుక్కుంటారు. మరికొందరు పెద్దవారి సిఫార్సులతో ఉద్యోగం పొందుతారు. ఇవేమి లేకుండానే ఆర్థికంగా కుంగిపోతున్న ఓ వ్యక్తికి అనుకోకుండా స్వయాన ఉపరాష్ట్రపతే హామీ ఇస్తే ఎంత సంతోషంగా ఉంటారు... ఆ వ్యక్తీ సంతోషించాడు, కానీ వెంకయ్య హామీకి మాత్రం విలువ లేకుండా పోయింది. ఈ ఘటన బిహార్​లో జరిగింది.
undefined

2005లో అప్పటి భాజపా జాతీయాధ్యక్షుడిగా ఉన్న వెంకయ్య నాయుడు ఓసారి బిహార్​లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనుకోకుండా హెలికాప్టర్​లో ఇంధనం అయిపోయింది. అత్యవసరంగా పండరియా గ్రామంలో దిగారు. అప్పట్లో ఆ ప్రాంతంలో నక్సళ్ల ప్రభావం ఎక్కవగా ఉండేది. హెలికాప్టర్​లో ఉన్న వారికి బెంగ పట్టుకుంది. సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. అదే సమయంలో రాజేంద్ర అనే వ్యక్తి అటుగా వెళ్లడం చూశారు. తర్వాత రాజేంద్ర తన సొంత వాహనంలో వెంకయ్య నాయుడిని బారాచట్టి పోలీసు స్టేషన్​కు తీసుకెళ్లారు.

నెరవేరని వెంకయ్య మాట...

సహాయం చేసిన రాజేంద్రకు ఆర్థికంగా సహాయం చేస్తానని మాట ఇచ్చారు వెంకయ్య. కేంద్ర మంత్రి అరుణ్​ జైట్లీ సైతం ఓ సందర్భంలో రాజేంద్రను అభినందించారు.

"హెలికాప్టర్​ వచ్చి ఇక్కడ ఆగింది. వెంకయ్యను చూడటానికి చాలమంది వచ్చారు. నా కొత్త వాహనంపై ఆయనను తీసుకెళ్లాను. దారిలో ఆయన నా పేరు అడిగారు. రాజేంద్ర సావ్​ అని చెప్పాను. దారిలో ఎంతో హడావుడి జరిగింది. అది చూసి నాకు భయమేసింది. భయపడకు నేను వెంకయ్య నాయుడిని... నీకు సహాయం చేస్తామని హామీ ఇచ్చారు."
--- రాజేంద్ర సావ్​.

కానీ ఇప్పటికీ ఆ మాట నిజం కాలేదు. భాజపా నేతకు సహాయం చేసినందుకు రాజేంద్రపై నక్సలైట్లు దాడి చేశారు. అనేక విధాలుగా చిత్ర హింసలు పెట్టారు. చంపేస్తామని బెదిరించగా రాజేంద్ర బిహార్​ను విడిచారు. ఛత్తీస్​గఢ్​లో నివాసం ఏర్పరచుకున్నారు. ఉద్యోగం లేక ఎంతో బాధపడ్డారు.

వెంకయ్య మాటతో ఎన్నో ప్రభుత్వ కార్యాలయాలు తిరిగారు రాజేంద్ర. ఎట్టకేలకు... సైన్యంలో ఉద్యోగమిస్తామని అప్పటి ఛత్తీస్​గఢ్​ ముఖ్యమంత్రి రమణ్ సింగ్​ హామీ ఇచ్చారు. కానీ ఇప్పటికి వారి నుంచి పిలుపు రాలేదు. అ తర్వాత కొన్ని సందర్భాల్లో వెంకయ్యను కలిశానని రాజేంద్ర తెలిపారు. కనీసం తన పిల్లలకైనా ఉద్యోగం ఇస్తే ఆర్థిక స్తోమత పెరుగుతుందని రాజేంద్ర ఆశగా ఎదురు చూస్తున్నారు.

undefined

New Delhi, Feb 06 (ANI): Businessman Robert Vadra arrived at the office of Enforcement Directorate (ED) over money laundering charges. Wife Priyanka Gandhi accompanied him; however, she soon left the venue.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.