ఈ ఏడాది నుంచి ప్రభుత్వం రాష్ట్ర అవతరణ వేడుకలను ఈసారి పబ్లిక్ గార్డెన్లో నిర్వహిస్తోంది. 1846లో బాగ్ ఇ ఉమ్ (పీపుల్స్ పార్క్) పేరుతో ఏర్పాటు చేసిన ఈ పార్క్ నిజాం కాలం నుంచి నగరవాసులకు ఆహ్లాదాన్ని పంచుతోంది. ఇప్పటికే అవతరణ వేడుకలకు సంబంధించిన పనులను ముమ్మరం చేశారు. జూబ్లీహాల్ ఎదురుగా ఉన్న ముఖద్వారాన్ని ఆకుపచ్చతోరణంగా తీర్చిదిద్ది ప్రత్యేక మెరుగులు దిద్దుతున్నారు. వేదిక చుట్టు, ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేసేందుకు రాష్ట్రంలోని వివిధ నర్సరీల నుంచి మొక్కలను తీసుకొస్తున్నారు. జూబ్లీహాల్ ను ఆధునీకరించారు. ఇందులో తొలిసారిగా కవి సమ్మేళనం ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన పనులు కొనసాగుతున్నాయి. రోడ్ల భవనాల శాఖ, ఉద్యానవనశాఖ అధికారులు అవతరణ వేడుకలకు సంబంధించిన పనులను పర్యవేక్షిస్తున్నారు. వీఐపీలు, వీవీఐపీలు, ముఖ్యనేతలకు ప్రత్యేక లాబీలు ఏర్పాటు చేస్తున్నారు.
ఇవీ చూడండి:వేసవి సెలవులు... పార్కుల్లో ఆటలు... హుషారులో పిల్లలు