హైదరాబాద్ జలసౌధలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ భేటీ అయింది. సమావేశానికి బోర్డు సభ్య కార్యదర్శి హరికేశ్మీనా నాయకత్వం వహించారు. భేటీలో తెలంగాణ ఈఎన్సీ మురళీధర్, ఏపీ ఈఎన్సీ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. మే నెల వరకు ఇరు రాష్ట్రాలకు అవసరమైన నీటి విడుదలపై చర్చించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల నుంచి కావల్సిన నీటి ప్రతిపాదనలను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కోరింది. ఇరువురుఈఎన్సీలు ప్రతిపాదనలు అందించారు.
ఇవీ చూడండి:రాచకొండకు 5 పారామిలటరీ బలగాలు