ETV Bharat / state

ఆర్టీసీ డిపో ఎదుట కార్మికుల ఆందోళన.. ఎందుకంటే? - భద్రాచలంలో కార్మికుల నిరసన వార్తలు

డిపో మేనేజర్​ ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ భద్రాచలంలోని ఆర్టీసీ డిపో ఎదుట కార్మికులు ఆందోళనకు దిగారు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ నిరసన వ్యక్తం చేశారు.

workers-agitated-in-front-of-rtc-depot-dot
ఆర్టీసీ డిపో ఎదుట కార్మికులు ఆందోళన.. ఎందుకంటే?
author img

By

Published : Jul 13, 2020, 12:47 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని ఆర్టీసి డిపో ఎదుట కార్మికులు నిరసనకు దిగారు. డిపో మేనేజర్ కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ ఆందోళన చేపట్టారు. డిపోలో అనేక సమస్యల నడుమ పనిచేస్తున్న ఉద్యోగులపై.. డిపో మేనేజర్ వివక్ష చూపిస్తున్నారని ఆరోపించారు.

సరైన డ్యూటీలు లేకపోవడం వల్ల ఈనెల వెయ్యిలోపే జీతాలు వచ్చాయని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ జీతాలతో కుటుంబ పోషణ కష్టమవుతుందని తెలిపారు. హైదరాబాద్ డ్యూటీలకు వెళ్లిన వారిని కాలనీవాసులు ఇంటికి రానివ్వడం లేదని.. ఆర్టీసీ డిపోలోనే ఉండాలని గొడవకు దిగుతున్నారని తమ గోడు వెల్లబోసుకున్నారు.

మరోవైపు డ్రైవర్లు, కండక్టర్లు విశ్రాంతి తీసుకునేందుకు భద్రాచలంలో సరైన వసతి గదులు లేవని కార్మికులు ఆరోపించారు. చిన్న గదిలోనే 50 నుంచి 100 మంది విశ్రాంతి తీసుకోవాల్సి వస్తోందని అన్నారు. పైగా భవనం శిథిలావస్థకు చేరుకుందని తెలిపారు. ఇరుకు గదుల్లో ఒకరికొకరు దగ్గరగా ఉండాల్సి వస్తోందని.. అనేక సమస్యల నడుమ విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు.

ఇదీచూడండి: యథేచ్ఛగా వీధుల్లోకి.. కట్టడి లేని వేళ.. కరోనా ఆగేదెలా?

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని ఆర్టీసి డిపో ఎదుట కార్మికులు నిరసనకు దిగారు. డిపో మేనేజర్ కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ ఆందోళన చేపట్టారు. డిపోలో అనేక సమస్యల నడుమ పనిచేస్తున్న ఉద్యోగులపై.. డిపో మేనేజర్ వివక్ష చూపిస్తున్నారని ఆరోపించారు.

సరైన డ్యూటీలు లేకపోవడం వల్ల ఈనెల వెయ్యిలోపే జీతాలు వచ్చాయని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ జీతాలతో కుటుంబ పోషణ కష్టమవుతుందని తెలిపారు. హైదరాబాద్ డ్యూటీలకు వెళ్లిన వారిని కాలనీవాసులు ఇంటికి రానివ్వడం లేదని.. ఆర్టీసీ డిపోలోనే ఉండాలని గొడవకు దిగుతున్నారని తమ గోడు వెల్లబోసుకున్నారు.

మరోవైపు డ్రైవర్లు, కండక్టర్లు విశ్రాంతి తీసుకునేందుకు భద్రాచలంలో సరైన వసతి గదులు లేవని కార్మికులు ఆరోపించారు. చిన్న గదిలోనే 50 నుంచి 100 మంది విశ్రాంతి తీసుకోవాల్సి వస్తోందని అన్నారు. పైగా భవనం శిథిలావస్థకు చేరుకుందని తెలిపారు. ఇరుకు గదుల్లో ఒకరికొకరు దగ్గరగా ఉండాల్సి వస్తోందని.. అనేక సమస్యల నడుమ విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు.

ఇదీచూడండి: యథేచ్ఛగా వీధుల్లోకి.. కట్టడి లేని వేళ.. కరోనా ఆగేదెలా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.