మతసామరస్యానికి ప్రతీకగా ప్రతి ఏటా కార్తిక మాసంలో వచ్చే ఉర్సు ఉత్సవాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో అట్టహాసంగా జరుగుతున్నాయి. పట్టణ సమీపంలోని హజరత్ నాగుల్ మీరా మౌలాచాన్ దర్గా ఈ వేడుకలకు వేదికైంది. ఘనంగా నిర్వహిస్తోన్న 18వ ఉర్సు ఉత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు.
మొట్టమొదటిసారిగా ఇల్లందు పురపాలక ప్రజాప్రతినిధులు ఈ ఉత్సవాల్లో గంధం అందజేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ వేడుకల్లో పాల్గొనాలని దర్గా నిర్వాహకులు సూచించారు.
- ఇదీ చూడండి : భద్రాద్రి జిల్లాలో పులి కలకలం.. ఆవుదూడపై దాడి