ETV Bharat / state

రహదారి పక్కనే ప్రసవించిన మహిళ

author img

By

Published : Dec 24, 2019, 1:20 PM IST

ఓ నిండు గర్భిణి వాహన సదుపాయం లేక రహదారి పక్కనే ప్రసవించిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అల్లపల్లి మండలం మర్కోడు గ్రామంలో చోటుచేసుకుంది.

pregnant women delivered a baby boy beside road at markodu village in bhadradri kothagudem district
రహదారి పక్కనే ప్రసవించిన మహిళ
రహదారి పక్కనే ప్రసవించిన మహిళ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అల్లపల్లి మండలం కిచ్చెనపల్లి అటవీ ప్రాంతానికి దగ్గర్లో ఉండటం వల్ల రవాణా సౌకర్యం సరిగ్గా లేదు. గ్రామానికి చెందిన మోకాల శిరీష అనే గర్భిణికి పురిటి నొప్పులు రావడం వల్ల కుటుంబ సభ్యులు ఆమెను ద్విచక్రవాహనంపై ఆస్పత్రికి తీసుకెళ్తూ సంజీవని వాహనానికి సమాచారం అందించారు.

సంజీవని దూరప్రాంతంలో ఉండటం వల్ల రావడానికి ఆలస్యమైంది. ఈలోపునే శిరీషకు పురిటి నొప్పులు ఎక్కువ కావడం వల్ల మార్గం మధ్యలోని మర్కోడు గ్రామ శివారులో రహదారి పక్కనే పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది.

అనంతరం తల్లీబిడ్డను ఆటోలో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యురాలు సుజాత పరీక్షలు నిర్వహించి తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నట్లు తెలిపారు. ప్రసవం సమయంలో ఏఎన్​ఎం సావిత్రి అందుబాటులో ఉండటం వల్ల గర్భిణీకి ప్రమాదం తప్పింది.

తమ గ్రామానికి రవాణా సదుపాయం లేక ఇలా ఎంతో మంది గర్భిణీలు వాహనాల్లో, రహదారి పక్కన ప్రమాదకర పరిస్థితుల్లో ప్రసవించాల్సిన దుస్థితి ఏర్పడుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రహదారి పక్కనే ప్రసవించిన మహిళ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అల్లపల్లి మండలం కిచ్చెనపల్లి అటవీ ప్రాంతానికి దగ్గర్లో ఉండటం వల్ల రవాణా సౌకర్యం సరిగ్గా లేదు. గ్రామానికి చెందిన మోకాల శిరీష అనే గర్భిణికి పురిటి నొప్పులు రావడం వల్ల కుటుంబ సభ్యులు ఆమెను ద్విచక్రవాహనంపై ఆస్పత్రికి తీసుకెళ్తూ సంజీవని వాహనానికి సమాచారం అందించారు.

సంజీవని దూరప్రాంతంలో ఉండటం వల్ల రావడానికి ఆలస్యమైంది. ఈలోపునే శిరీషకు పురిటి నొప్పులు ఎక్కువ కావడం వల్ల మార్గం మధ్యలోని మర్కోడు గ్రామ శివారులో రహదారి పక్కనే పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది.

అనంతరం తల్లీబిడ్డను ఆటోలో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యురాలు సుజాత పరీక్షలు నిర్వహించి తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నట్లు తెలిపారు. ప్రసవం సమయంలో ఏఎన్​ఎం సావిత్రి అందుబాటులో ఉండటం వల్ల గర్భిణీకి ప్రమాదం తప్పింది.

తమ గ్రామానికి రవాణా సదుపాయం లేక ఇలా ఎంతో మంది గర్భిణీలు వాహనాల్లో, రహదారి పక్కన ప్రమాదకర పరిస్థితుల్లో ప్రసవించాల్సిన దుస్థితి ఏర్పడుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Intro:రహదారి పక్కనే మహిళ ప్రసవంBody:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.
మణుగూరు.
Stringer: naresh.
Cell: 9121229033
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అల్లపల్లి మండలంలో మారుమూల గిరిజన గ్రామానికి చెందిన ఓ నిండు గర్భిణీ ఆస్పత్రికి వెళ్లేందుకు వాహన సదుపాయం లేక రహదారి పక్కనే ప్రసవించిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. మర్కోడు పంచాయతీ పరిధిలోని గిరిజన కిచ్చెనపల్లి గ్రామం అడవిలో ఉంటుంది. గ్రామానికి చెందిన మోకాల శిరీష అనే మహిళ ప్రసవ వేదనకు గురైంది . పురిటి నొప్పులతో బాధపడుతున్న ఆమెను అక్కడి నుంచి ద్విచక్రవాహనంపై తీసుకొస్తూ సంజీవని వాహనానికి సమాచారం అందించారు. సంజీవిని దూర ప్రాంతంలో ఉండడంతో సకాలంలో రాలేకపోయింది.Conclusion:ఈ పరిస్థితుల్లో పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో మర్కోడు గ్రామ శివారులో రోడ్డు పక్కనే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.
ఏఎన్ఎం సావిత్రి అందుబాటులో ఉండడంతో గర్భిణీకి ప్రమాదం తప్పింది. అనంతరం తల్లి, బిడ్డను ఆటోలో ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వైద్యురాలు సుజాత వైద్య పరీక్షలు నిర్వహించి తల్లీబిడ్డలు క్షేమంగానే ఉన్నట్లు తెలిపారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.