భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలో ప్రజలకు అంటువ్యాధులపై ప్రజాప్రతినిధులు, అధికారులు అవగాహన కల్పించారు. పట్టణంలోని పలు వార్డుల్లో మున్సిపల్ ఛైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర్లు, కమిషనర్ శ్రీనివాసరెడ్డి పర్యటించారు. నీటి తొట్టెల్లో ఉన్న అడుగు నీటిని ఇంటి యజమానులతో శుభ్రం చేయించారు.
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంపై అవగాహన కల్పిస్తూ... ప్రజలకు కరపత్రాలు పంచారు. ప్రతి ఆదివారం 10 గంటల 10 నిమిషాలకు కార్యక్రమం ఉద్దేశాన్ని స్థానికులకు వివరించారు.