ETV Bharat / state

వర్షాలు సమృద్ధిగా కురవాలని వరద పాశం పూజలు

author img

By

Published : Aug 2, 2020, 9:30 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం రామానుజవరంలోని సంతాన వేణుగోపాల స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని పాండవులకు వరద పాశం పూజలు నిర్వహించారు. ప్రత్యేకంగా వండిన పాశాన్ని నేలపై ఉంచి పిల్లలతో నాకించారు.

pandavulaku varadha pasham program in ramanujavaram
pandavulaku varadha pasham program in ramanujavaram

వర్షాలు సమృద్ధిగా కురవాలని... పాండవుల శాపం తొలగిపోవాలని కోరుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం రామానుజవరంలోని సంతాన వేణుగోపాలస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వర్షాలు సరిగా కురవకపోవటం వల్ల పత్తి చేలు ఎండిపోయి రైతులు ఆందోళన చెందుతున్న దృష్ట్యా... ఆలయంలో ఐదుగురు బాలలతో పూజలు చేయించారు.

ప్రత్యేకంగా వండిన పాశాన్ని నేలపై ఉంచి బాలలతో నాకించారు. వర్షాలు సరిగా కురవకపోతే... పాండవులకు వరద పాశం పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని గ్రామ పెద్దలు వివరించారు.

ఇదీ చూడండి : పీఎస్​కు వచ్చే ఫిర్యాదు పేపర్లను ఇస్త్రీ చేస్తున్న పోలీసులు

వర్షాలు సమృద్ధిగా కురవాలని... పాండవుల శాపం తొలగిపోవాలని కోరుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం రామానుజవరంలోని సంతాన వేణుగోపాలస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వర్షాలు సరిగా కురవకపోవటం వల్ల పత్తి చేలు ఎండిపోయి రైతులు ఆందోళన చెందుతున్న దృష్ట్యా... ఆలయంలో ఐదుగురు బాలలతో పూజలు చేయించారు.

ప్రత్యేకంగా వండిన పాశాన్ని నేలపై ఉంచి బాలలతో నాకించారు. వర్షాలు సరిగా కురవకపోతే... పాండవులకు వరద పాశం పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని గ్రామ పెద్దలు వివరించారు.

ఇదీ చూడండి : పీఎస్​కు వచ్చే ఫిర్యాదు పేపర్లను ఇస్త్రీ చేస్తున్న పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.