ETV Bharat / state

భద్రాద్రిలో ముక్కోటి పండగట... చూసిన కనులకు వేడుకట - Mukkoti Vaikunta Ekadasi arrangements completed at Bhadrachalam temple

ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని భద్రాచలం సీతారామ చంద్రస్వామి ఆలయంలో నేటి నుంచి జనవరి 16 వరకు వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు జరగనున్నాయి. ఉత్సవాల్లో స్వామివారు రోజుకో అవతారంలో దర్శనమివ్వనున్నారు. జనవరి 5న తెప్పోత్సవం, 6న ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. ఉత్సవం సందర్భంగా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

రామయ్యసన్నిధిలో ముక్కోటి ఉత్సవాలు.. చూదము రారండి
రామయ్యసన్నిధిలో ముక్కోటి ఉత్సవాలు.. చూదము రారండి
author img

By

Published : Dec 27, 2019, 4:51 AM IST

ముక్కోటి ఏకాదశి ఉత్సవాలకు భద్రాద్రి రామయ్య సన్నిధి ముస్తాబైంది. నేటినుంచి జనవరి 16 వరకు వైకుంఠ ఏకాదశి అధ్యనోత్సవాలు నిర్వహించనున్నారు. వీటిలో ముందు పది రోజులు పగలు ఉత్సవాలు... తర్వాత పది రోజులు రాపత్తు ఉత్సవాలు నిర్వహిస్తారు. ఉత్సవాల సందర్భంగా కౌసల్యానందనుడు రోజుకో అవతారంలో భక్తులకు దర్శనమిస్తాడు.

రోజుకో అవతారంలో..

మత్స్యావతారం, కూర్మావతారం,వరాహావతారం, నరసింహావతారం, వామన, పరశురామ, శ్రీరామ, బలరామ, శ్రీకృష్ణ ఇలా రోజుకో అవతారల్లో రఘుకుల తిలకుడు భక్తులను అనుగ్రహించనున్నాడు. ఉత్సవాల్లో భాగంగా జనవరి 5న సాయంత్రం గోదావరిలో తెప్పోత్సవం నిర్వహిస్తారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా జనవరి 6న ఉదయం 5 గంటలకు ఉత్తర ద్వారం ద్వారా స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు.

ప్రత్యేక ఏర్పాట్లు

ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రామయ్య సన్నిధి పరిసరాలన్నీ సుందరంగా తీర్చిదిద్దారు. కల్యణమండపంతో పాటు ఆలయ ప్రాంగణంలో చలువ పందిళ్ళ ఏర్పాటు చేశారు.

రామయ్యసన్నిధిలో ముక్కోటి ఉత్సవాలు.. చూదము రారండి

ఇదీ చూడండి: సంక్రాంతికి సంసిద్ధం: జనవరి 10 నుంచి ప్రత్యేక బస్సులు

ముక్కోటి ఏకాదశి ఉత్సవాలకు భద్రాద్రి రామయ్య సన్నిధి ముస్తాబైంది. నేటినుంచి జనవరి 16 వరకు వైకుంఠ ఏకాదశి అధ్యనోత్సవాలు నిర్వహించనున్నారు. వీటిలో ముందు పది రోజులు పగలు ఉత్సవాలు... తర్వాత పది రోజులు రాపత్తు ఉత్సవాలు నిర్వహిస్తారు. ఉత్సవాల సందర్భంగా కౌసల్యానందనుడు రోజుకో అవతారంలో భక్తులకు దర్శనమిస్తాడు.

రోజుకో అవతారంలో..

మత్స్యావతారం, కూర్మావతారం,వరాహావతారం, నరసింహావతారం, వామన, పరశురామ, శ్రీరామ, బలరామ, శ్రీకృష్ణ ఇలా రోజుకో అవతారల్లో రఘుకుల తిలకుడు భక్తులను అనుగ్రహించనున్నాడు. ఉత్సవాల్లో భాగంగా జనవరి 5న సాయంత్రం గోదావరిలో తెప్పోత్సవం నిర్వహిస్తారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా జనవరి 6న ఉదయం 5 గంటలకు ఉత్తర ద్వారం ద్వారా స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు.

ప్రత్యేక ఏర్పాట్లు

ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రామయ్య సన్నిధి పరిసరాలన్నీ సుందరంగా తీర్చిదిద్దారు. కల్యణమండపంతో పాటు ఆలయ ప్రాంగణంలో చలువ పందిళ్ళ ఏర్పాటు చేశారు.

రామయ్యసన్నిధిలో ముక్కోటి ఉత్సవాలు.. చూదము రారండి

ఇదీ చూడండి: సంక్రాంతికి సంసిద్ధం: జనవరి 10 నుంచి ప్రత్యేక బస్సులు

Intro:దక్షిణ భారత దేశంలోనే రెండవ అయోధ్య గా పేరుగాంచింది భద్రాచలం పుణ్యక్షేత్రం.. ఈ ఆలయంలో ప్రధానంగా రెండు ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు ...వాటిలో మొదటిది సీతారాముల కళ్యాణం... రెండోది ముక్కోటి ఏకాదశి... సీతారాములను దర్శించుకునేందుకు రోజుకు సుమారు రెండు వేల మంది భక్తులు వస్తారు .ప్రత్యేక ఉత్సవాల్లో అయితే 40 వేల నుంచి 50 వేల మంది భక్తులు పొరుగు రాష్ట్రాల నుంచి తరలి వస్తారు...


Body:ఈ సంవత్సరం జనవరి 6న జరగనున్న ముక్కోటి ఏకాదశి ఉత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు రానున్నందున అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు ...డిసెంబర్ 27 నుంచి జనవరి 16 వరకు వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు నిర్వహిస్తారు .వీటిలో ముందు పది రోజులు పగలు ఉత్సవాలు... మరో పది రోజులు రాపత్తు ఉత్సవాలు నిర్వహిస్తారు .రామయ్య తండ్రి రోజుకో రూపంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు .ఆలయం వద్ద నుంచి సకల రాజ లాంఛనాలు నడుమ కోలాట నృత్యాలతో తిరువీధులలో ఊరేగుతూ మిథిలా ప్రాంగణానికి చేరుకుంటారు. అక్కడ స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులకు దర్శనం కల్పిస్తారు .అనంతరం తాతగుడి వద్దకు వెళ్తారు. ఇందులో భాగంగా స్వామి వారు మొదటిరోజు మత్స్య అవతారం... రెండోరోజు కూర్మావతారం... మూడో రోజు వరాహావతారం... నరసింహావతారం.. వామన ...పరశురామ.. శ్రీరామ... బలరామ ...శ్రీకృష్ణ అవతారాలలో.. భక్తులకు దర్శనం ఇస్తారు. జనవరి 5వ తేదీన సాయంత్రం గోదావరిలో తెప్పోత్సవం నిర్వహిస్తారు .దీనిని తిలకించేందుకు వేలసంఖ్యలో భక్తులు గోదావరి నది కి తరలి వస్తారు ..జనవరి 6న ఉదయం 5 గంటలకు ఉత్తర ద్వార దర్శనం నిర్వహిస్తారు ..స్వామి వారిని ప్రధానాలయం నుంచి నేరుగా ఉత్తర ద్వారం వద్దకు తీసుకొచ్చి భక్తులకు దర్శనం కల్పిస్తారు .ఈ వేడుకను తిలకించేందుకు విశేష సంఖ్యలో భక్తుల తరలి వస్తారు ..ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఆలయ ఈవో నరసింహులు తో పాటు ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు... భద్రాచలం అన్ని ప్రధాన రహదారులలో స్వాగత ద్వారాలు ఏర్పాటు చేస్తున్నారు .ఆలయంలోని అన్ని శిఖరాలకు రంగులు దిద్దుతున్నారు.. విద్యుద్దీపాలతో అలంకరిస్తున్నారు.. ఉత్సవాలకు హాజరయ్యే భక్తులకు లడ్డూ ప్రసాదం తయారుచేస్తున్నారు ..కళ్యాణమండపం తో పాటు ఆలయ ప్రాంగణంలో చలువ పందిళ్ళ నిర్మాణాలు ఏర్పాటు చేస్తున్నారు .లాంచీ కి హంస బొమ్మను అమర్చేందుకు నిపుణులు శ్రమిస్తున్నారు...


Conclusion:ఈ ఉత్సవాల్లో వివిధ అవతారాలలో దర్శనమిచ్చే స్వామి వారిని దర్శించుకోవడం వలన అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు చెబుతున్నారు....
బైట్స్: నరసింహులు ,ఆలయ ఈ ఓ
జగన్నాథచార్యులు, విశ్రాంత ప్రధాన అర్చకులు
శ్రీనివాస్ ,భద్రాచలం
లావణ్య ,ఈ జె ఎస్
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.