ETV Bharat / state

కరోనా మృతుడికి అంత్యక్రియలు నిర్వహించిన అన్నం ఫౌండేషన్​ - bhadradri kothagudem district latest news

కరోనా మహమ్మారి సోకి ప్రాణాలు కోల్పోయిన వారికి అంతిమ సంస్కారాలు చేయడానికి కుటుంబ సభ్యులే భయపడుతున్న తరుణంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన అన్నం ఫౌండేషన్​ ముందుకొచ్చింది. జులై నుంచి ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన ఎంతో మందికి అంత్యక్రియలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకుంది. తాజాగా ఇల్లందుకు చెందిన ఓ ప్రైవేటు ఉపాధ్యాయుడు కొవిడ్​ సోకి మృతి చెందడంతో అంత్యక్రియలను ఫౌండేషన్​ నిర్వహించింది.

khammam annam foundation did funerals to private teacher
కరోనా మృతుడికి అంత్యక్రియలు నిర్వహించిన అన్నం ఫౌండేషన్​
author img

By

Published : Oct 26, 2020, 1:18 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందుకు చెందిన ప్రముఖ ప్రైవేటు ఉపాధ్యాయుడు శ్రీనివాస రావు(వాసు) కరోనాతో మృతి చెందడంతో ఆయన అంతిమ సంస్కారాలను అన్నం ఫౌండేషన్ నిర్వహించింది. పారా లీగల్ వాలంటీర్ డాక్టర్ అన్నం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఇల్లందు పురపాలక ఛైర్మన్​ దమ్మలపాటి వెంకటేశ్వర్లు పీపీఈ కిట్​ ధరించి అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

ఇల్లందు పట్టణంలో దశాబ్దాలుగా ప్రైవేటు విద్యాసంస్థల్లో భాగస్వామి, ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న శ్రీనివాసరావు.. గత కొంతకాలంగా కరోనాతో బాధపడుతూ మృతి చెందారు. కొవిడ్ నిబంధనలతో అన్నం ఫౌండేషన్​ అంత్యక్రియలు నిర్వహించింది.

జులై 2 వ తేదీన ఇల్లందు పట్టణంలో మొదటి అంత్యక్రియలు నిర్వహించామనీ, కరోనా సోకిన వారికి ధైర్యం చెబుతూ వారికి మానసిక ఉత్సాహం ఇవ్వాలని ఫౌండేషన్​ వ్యవస్థాపకులు అన్నం శ్రీనివాసరావు అన్నారు. తాను కూడా ఈ మహమ్మారి బారిన పడ్డానని కొవిడ్ మృతులకు వారి సంప్రదాయం ప్రకారం అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు రాష్ట్రంలో పలు చోట్ల అంత్యక్రియలు నిర్వహించినట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి: నిరాధార ఆరోపణలతో జడ్జిలపై లేఖ రాశారు: అశ్వినీకుమార్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందుకు చెందిన ప్రముఖ ప్రైవేటు ఉపాధ్యాయుడు శ్రీనివాస రావు(వాసు) కరోనాతో మృతి చెందడంతో ఆయన అంతిమ సంస్కారాలను అన్నం ఫౌండేషన్ నిర్వహించింది. పారా లీగల్ వాలంటీర్ డాక్టర్ అన్నం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఇల్లందు పురపాలక ఛైర్మన్​ దమ్మలపాటి వెంకటేశ్వర్లు పీపీఈ కిట్​ ధరించి అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

ఇల్లందు పట్టణంలో దశాబ్దాలుగా ప్రైవేటు విద్యాసంస్థల్లో భాగస్వామి, ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న శ్రీనివాసరావు.. గత కొంతకాలంగా కరోనాతో బాధపడుతూ మృతి చెందారు. కొవిడ్ నిబంధనలతో అన్నం ఫౌండేషన్​ అంత్యక్రియలు నిర్వహించింది.

జులై 2 వ తేదీన ఇల్లందు పట్టణంలో మొదటి అంత్యక్రియలు నిర్వహించామనీ, కరోనా సోకిన వారికి ధైర్యం చెబుతూ వారికి మానసిక ఉత్సాహం ఇవ్వాలని ఫౌండేషన్​ వ్యవస్థాపకులు అన్నం శ్రీనివాసరావు అన్నారు. తాను కూడా ఈ మహమ్మారి బారిన పడ్డానని కొవిడ్ మృతులకు వారి సంప్రదాయం ప్రకారం అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు రాష్ట్రంలో పలు చోట్ల అంత్యక్రియలు నిర్వహించినట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి: నిరాధార ఆరోపణలతో జడ్జిలపై లేఖ రాశారు: అశ్వినీకుమార్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.