భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో లక్ష్మణ సమేత సీతారాములకు జ్యేష్ఠాభిషేకం వైభవంగా నిర్వహించారు. ప్రతి ఏడాది జేష్ఠ మాసంలో రామయ్య తండ్రికి ఈ అభిషేకం చేస్తారు. ఇందులో భాగంగానే గురువారం గోదావరి నది వద్ద నుంచి తీర్థ బిందెను తీసుకువచ్చి యాగశాలలలో పూజలు నిర్వహించారు.
శుక్రవారం ఉదయం నిత్య కల్యాణ మండపం వద్ద స్వామివారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, నదీజలాలు పంచోదకములు, పళ్లరసాలతోఅభిషేకం నిర్వహించారు. వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ అర్చకులు స్వామివారికి దీప, ధూప నైవేద్యాలు సమర్పించారు.
ఇవీ చూడండి: మీ ఇంట్లోనే కరోనా చికిత్స.. వైరస్ నుంచి బయటపడే మార్గం