ETV Bharat / state

భద్రాచలంలో హెల్మెట్ అవగాహన ర్యాలీ

వాహనాలు నడిపే సమయంలో చిన్నపాటి జాగ్రత్తలు పాటించకపోవడంతోనే విలువైన ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. రోడ్డు ప్రమాదాల్లో మృతిచెందుతున్న ద్విచక్రవాహనదారుల్లో ఎక్కువ మంది హెల్మెట్ వాడనివారేనని అధికారులు హెచ్చరిస్తున్నారు.

author img

By

Published : Aug 14, 2019, 4:33 PM IST

భద్రాచలంలో హెల్మెట్ అవగాహన ర్యాలీ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో జిల్లా ఏఎస్పీ రాజేష్ చంద్ర హెల్మెట్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని అంబేద్కర్ సెంటర్​లో ద్విచక్ర వాహనదారులకు గులాబీ పువ్వు ఇస్తూ ట్రాఫిక్ నిబంధనలతో కూడిన కరపత్రాలను అందించారు. హెల్మెట్ ధరించాలని, నిబంధనలు పాటించాలని సూచించారు. అనంతరం అంబేద్కర్ సెంటర్ నుంచి కులవరం రోడ్డు వరకు హెల్మెట్​లతో కూడిన బైక్​ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఐ సత్యనారాయణ రెడ్డి, ఎస్ఐలు రాంబాబు, శ్రీనివాస్​లతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

భద్రాచలంలో హెల్మెట్ అవగాహన ర్యాలీ

ఇదీ చూడండి : వనస్థలిపురం ఏటీఎం వ్యాన్ దొంగలు పట్టుబడ్డారు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో జిల్లా ఏఎస్పీ రాజేష్ చంద్ర హెల్మెట్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని అంబేద్కర్ సెంటర్​లో ద్విచక్ర వాహనదారులకు గులాబీ పువ్వు ఇస్తూ ట్రాఫిక్ నిబంధనలతో కూడిన కరపత్రాలను అందించారు. హెల్మెట్ ధరించాలని, నిబంధనలు పాటించాలని సూచించారు. అనంతరం అంబేద్కర్ సెంటర్ నుంచి కులవరం రోడ్డు వరకు హెల్మెట్​లతో కూడిన బైక్​ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఐ సత్యనారాయణ రెడ్డి, ఎస్ఐలు రాంబాబు, శ్రీనివాస్​లతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

భద్రాచలంలో హెల్మెట్ అవగాహన ర్యాలీ

ఇదీ చూడండి : వనస్థలిపురం ఏటీఎం వ్యాన్ దొంగలు పట్టుబడ్డారు

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.