భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వరావుపేట నియోజకవర్గ వ్యాప్తంగా రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. ఈ భారీవర్షం కారణంతో వందలాది ఎకరాల్లోని పంటలు నీట మునిగాయి. ఈదురు గాలులకు చెట్లు విరిగి... విద్యుత్ స్తంభాలు మీద పడటంతో... విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ప్రధానంగా అశ్వరావుపేట, దమ్మపేట, ములకలపల్లి మండలాల్లో రాత్రి నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
ఇదీ చూడండి: తీరాన్ని దాటిన తీవ్ర వాయుగుండం.. నాలుగైదు గంటలు వర్షగండం