భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని ఆర్టీసీ బస్టాండ్లో 244 కేజీల గంజాయిని పట్టుకున్నట్లు భద్రాచలం ఏఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. బస్టాండ్లో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా.. ఐదుగురు అనుమానితులు గుర్తించారు. వారి నుంచి 244 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గంజాయి విలువ రూ. 36 లక్షలు ఉంటుందన్నారు.
ఆంధ్రప్రదేశ్లోని సీలేరు నుంచి భద్రాచలం మీదుగా పంజాబ్కు రవాణా చేస్తుండగా పట్టుకున్నామని తెలిపారు. రవాణా చేస్తున్న వారిలో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. వీరంతా రాజస్థాన్కు చెందిన వారని ఏఎస్పీ తెలిపారు.
ఇవీ చూడండి: శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత