భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దు అటవీ ప్రాంతంలో సోమవారం జరిగిన ఎదురుకాల్పుల్లో మృతి చెందిన ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. మృతులకు సంబంధించిన బంధువులు వారిని గుర్తించి.. తీసుకెళ్లాలని జిల్లా ఎస్పీ సునీల్దత్ తెలిపారు.
మరోవైపు అటవీ ప్రాంతంలో చోటుచేసుకున్న ఎదురుకాల్పులతో ఆయా ప్రాంతాల్లోని గిరిజనులు భయాందోళన చెందుతున్నారు.
ఇదీచూడండి.. 20 నిమిషాలపాటు ఎదురుకాల్పులు... ఇద్దరు మావోయిస్టులు మృతి