ETV Bharat / state

భద్రాద్రిలో వైభవంగా శ్రీరామనవమి తిరు కల్యాణ బ్రహ్మోత్సవాలు

author img

By

Published : Apr 17, 2021, 11:51 AM IST

Updated : Apr 17, 2021, 12:13 PM IST

భద్రాద్రిలో శ్రీరామనవమి తిరు కల్యాణ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆలయంలో నేడు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పుణ్యాహవచనం చేసి కంకణాలకు పూజలు చేశారు.

thiru kalyana celebrations in bhadradri, bhadradri seetha rama swamy temple
తిరు కల్యాణ ఉత్సవాలు, భద్రాద్రి ఆలయంలో శ్రీరామ నవమి వేడుకలు

భద్రాద్రి రామయ్య సన్నిధిలో వసంత పక్ష ప్రయుక్త శ్రీరామనవమి తిరు కల్యాణ బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఆలయ అర్చకులు లక్ష్మణ సమేత సీతారాములకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పుణ్యాహవచనం చేసి కంకణాలకు పూజలు చేశారు. అనంతరం ప్రధాన ఆలయంలోని స్వాములకు, బేడా మండపంలోని ఉత్సవమూర్తులకు కంకణధారణ నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు కంకణాలను ధరించారు.

ఈరోజు సాయంత్రం యాగశాలలో వాస్తు హోమం నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. ఈ వేడుకల్లో భాగంగా నేడు ఆలయ ఈవో శివాజీ, అర్చకులు, ఉద్యోగులకు దీక్ష వస్త్రాలు అందించారు.

భద్రాద్రి రామయ్య సన్నిధిలో వసంత పక్ష ప్రయుక్త శ్రీరామనవమి తిరు కల్యాణ బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఆలయ అర్చకులు లక్ష్మణ సమేత సీతారాములకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పుణ్యాహవచనం చేసి కంకణాలకు పూజలు చేశారు. అనంతరం ప్రధాన ఆలయంలోని స్వాములకు, బేడా మండపంలోని ఉత్సవమూర్తులకు కంకణధారణ నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు కంకణాలను ధరించారు.

ఈరోజు సాయంత్రం యాగశాలలో వాస్తు హోమం నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. ఈ వేడుకల్లో భాగంగా నేడు ఆలయ ఈవో శివాజీ, అర్చకులు, ఉద్యోగులకు దీక్ష వస్త్రాలు అందించారు.

ఇదీ చదవండి: భద్రాద్రిలో సీతారాముల కల్యాణానికి నేడు అంకురార్పణ

Last Updated : Apr 17, 2021, 12:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.